రాయలసీమ న్యూస్ - అనంతపురం
అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు సమీపంలో కావేరి ట్రావెల్స్ బస్సు వ్యాన్ను ఢీకొట్టి కల్వర్టులో బోల్తా పడడంతో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో డ్రైవర్తో సహా కొందరి పరిస్థితి విషమంగా ఉండగా, అందరినీ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు వేగం, డ్రైవర్ అప్రమత్తత వంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం…20 మందికి గాయాలు అనంతపురం జిల్లా పామిడి మండలం పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన కావేరి బస్సు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మందికి గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి