రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్
జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఫతాగఢ్ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్లో భద్రతా దళాలు ఒక అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్ చేసి, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఇదే సమయంలో కుల్గాం జిల్లాలో ఇద్దరు వలస కార్మికుల హత్య ఘటన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భద్రతా సమీక్ష నిర్వహించి, వలస కార్మికులు, సాధారణ ప్రజల భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.
జమ్మూ కాశ్మీర్లో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్ జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలకు మరో కీలక విజయం లభించింది. బారాముల్లా జిల్లాలోని షేరీ సెక్టార్లో ఒక అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం ఫతాగఢ్ ప్రాంతంలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి