రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు నుంచి లెఫ్ట్ కెనాల్కు, ఎస్ఆర్-2 డ్యామ్ నుంచి మిట్టమానుపల్లె చెరువుకు సాగునీటిని విడుదల చేసి మైదుకూరు నియోజకవర్గంలో ఖరీఫ్ సీజన్ సాగుకు అనుకూల పరిస్థితులు కల్పించారు. ప్రతి ఎకరాకు అవసరమైన నీరు అందేలా పంపిణీ షెడ్యూల్ను సమర్థంగా ప్రణాళిక చేసి, పారదర్శకంగా అమలు చేయాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులు సూచనలు చేశారు.
బ్రహ్మం సాగర్ నుంచి లెఫ్ట్ కెనాల్కు సాగునీటి విడుదల మైదుకూరు నియోజకవర్గంలో రైతులకు సకాలంలో సాగునీరు అందించాలనే లక్ష్యంతో బ్రహ్మంగారిమఠంలోని బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు నుంచి లెఫ్ట్ కెనాల్కు సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, బద్వేల్ టీడీపీ ఇన్చార్జ్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
రైతుల వ్యవసాయాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, ప్రతి ఎకరాకు అవసరమైన నీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు నుంచి లెఫ్ట్ కెనాల్కు నీటి విడుదలను అధికారులు సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగా శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొని నీటి విడుదల ప్రక్రియను పర్యవేక్షించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి