రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలి: మల్లెల లింగారెడ్డి

మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రిని కలసి కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు వరి సహా అన్ని పంటలకు తక్షణంగా సాగునీరు విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. సాగునీటి ఆలస్యం వల్ల పంటలు ఎండిపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరిస్తూ, నీటి విడుదల షెడ్యూల్‌ను రైతుల అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని కోరగా, మంత్రి సమస్యను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకు

కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలి: మల్లెల లింగారెడ్డి ప్రొద్దుటూరు: కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని వరి పంటతో పాటు అన్ని రకాల పంటలకు అవసరమైన సాగునీటిని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కోరారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని జలవనరుల శాఖ మంత్రి కార్యాలయంలో ఆయన మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేసీ కెనాల్ పరిధిలోని స్థానిక రైతాంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను, వారి అవసరాలను మల్లెల లింగారెడ్డి మంత్రికి కూలంకషంగా వివరించారు. కెనాల్ ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న పరిస్థితిని ఆయన మంత్రికి తెలియజేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →