రాయలసీమ న్యూస్ - కర్నూలు
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాయలసీమ ప్రజలకు న్యాయం చేరువ కావాలంటే కర్నూలులోనే బెంచ్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ఇక నిర్లక్ష్యం చేయకూడదని న్యాయవాదులు కోరుతూ స్పందన రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదుల రాస్తారోకో కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో జరిగింది. రాజ్విహార్ వద్ద పెద్ద సంఖ్యలో న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
రాయలసీమ ప్రాంత ప్రజలకు న్యాయం మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు న్యాయవాదులు తెలిపారు. కర్నూలు నగరం రాయలసీమకు కేంద్రంగా ఉండటంతో ఇక్కడ శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం సముచితమని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి