రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని మిస్టర్ రెడ్డి ఈ.ఎం. ప్రైమరీ స్కూల్లో చిన్నారులకు పాఠ్యాంశాలతో పాటు మతపరమైన బోధనలు, అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ వీడియోలు, ఫోటోలు ఆధారంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన తేలితే తగిన చర్యలు తీసుకోవాలని వారు DEO, MEOలకు విజ్ఞప్తి చేశారు. మదనపల్లె ప్రైవేట్ పాఠశాలపై మతబోధనల ఆరోపణలు..
విచారణకు తల్లిదండ్రుల డిమాండ్ మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారులకు పాఠ్యాంశాలతో పాటు మతపరమైన బోధనలు నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు, స్థానికులు విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి