రాయలసీమ న్యూస్ - చిత్తూరు
చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్గా మల్లికార్జున మూర్తి బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేసిన అనుభవంతో చిత్తూరులో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని అధికారులు, సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.
పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈగా మల్లికార్జున మూర్తి బాధ్యతల స్వీకరణ చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ)గా మల్లికార్జున మూర్తి బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఇటీవల పదోన్నతి లభించడంతో చిత్తూరు జిల్లాకు ఎస్ఈగా బదిలీ అయ్యారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది మల్లికార్జున మూర్తిని కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. శాఖలోని వివిధ విభాగాల ఇంజినీర్లు, సిబ్బంది ఆయనతో సమావేశమై జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వివరించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి