రాయలసీమ న్యూస్ - నంద్యాల
నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని అమకతాడు టోల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డోన్కు చెందిన యువకుడు రసూల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.
రసూల్ మృతి ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపగా, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డోన్ సమీపంలో రోడ్డు ప్రమాదం: యువకుడి మృతి నంద్యాల జిల్లా డోన్ పట్టణ సమీపంలోని అమకతాడు టోల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
డోన్ పట్టణానికి చెందిన లారీ భాష గారి కుమారుడు రసూల్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి