రాయలసీమ న్యూస్ - అనంతపురం
అనంతపురం జిల్లా శెట్టూరు ఎస్సీ హాస్టల్ పక్కన ఉన్న పాడుబడిన షెడ్ గోడ కూలి 8వ తరగతి విద్యార్థి హర్షవర్దన్ తేజ మృతి చెందగా, మరో విద్యార్థి అక్షయ్ తీవ్రంగా గాయపడ్డాడు. హాస్టల్ పక్కనే శిథిలావస్థలో ఉన్న షెడ్ గోడను తొలగించకపోవడం, భద్రతా చర్యలు తీసుకోకపోవడమే కారణమని తల్లిదండ్రులు హాస్టల్ సిబ్బందిపై నిర్లక్ష్య ఆరోపణలు చేస్తున్నారు.
ఘటనపై శెట్టూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శెట్టూరులో ఎస్సీ హాస్టల్ పక్కనే గోడ కూలి విద్యార్థి మృతి అనంతపురం జిల్లా శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహం పక్కనే ఉన్న పాడుబడిన షెడ్ గోడ కూలిన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శెట్టూరు ఎస్ఐ సుమన్ వెల్లడించిన వివరాల ప్రకారం, కళ్యాణదుర్గం మండలం మల్లేపల్లికి చెందిన హర్షవర్దన్ తేజ (13) శెట్టూరు ఎస్సీ హాస్టల్లో నివసిస్తూ 8వ తరగతి చదువుతున్నాడు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి