రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహారాన్ని మెరుగుపర్చేందుకు కొత్త ఆహార మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు. వయస్సు ఆధారంగా జూనియర్, సీనియర్ విభజన చేసి బాలామృతం పరిమాణం పెంచడంతో పాటు 3–6 ఏళ్ల పిల్లలకు వారంలో రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్, సాయంత్రం ఉడికించిన శనగలు, వంటకాల్లో మునగాకు వినియోగం పెంచాలని మార్గదర్శకాలు జారీ చేశారు.
CDPOలు, సూపర్వైజర్లు అమలు పరిస్థితులను నియమితంగా తనిఖీ చేస్తారని అధికారులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త ఆహార మెనూ అమలు..
చిన్నారుల పోషకాహారంపై దృష్టి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అందించే ఆహారంలో మార్పులు చేశారు. పిల్లల వయస్సు, ఎదుగుదల దశలను దృష్టిలో పెట్టుకుని కొత్త మెనూను రూపొందించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి