రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ఎర్రగుంట్ల అర్బన్ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపిన ప్రకారం, అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 10 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ప్రతి నిందితుడికి 10 వేల రూపాయల చొప్పున, మొత్తం లక్ష రూపాయల జరిమానా కమలాపురం JFCM కోర్టు విధించింది. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున, ఇలాంటి కేసులపై కోర్టు కఠినంగా వ్యవహరిస్తోందని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 10 మందికి లక్ష రూపాయల జరిమానా ఎర్రగుంట్ల: మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మందికి కోర్టు మొత్తం లక్ష రూపాయల జరిమానా విధించినట్లు ఎర్రగుంట్ల అర్బన్ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 10 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నిందితులను కమలాపురం JFCM కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన వివరించారు.
ప్రతి కేసులో ఒక్కో నిందితుడికి 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధించడంతో మొత్తం జరిమానా మొత్తం ఒక లక్ష రూపాయలకు చేరిందని సీఐ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కోర్టు కఠినంగా వ్యవహరిస్తోందని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఇలాంటి చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి