రాయలసీమ న్యూస్ ఇంటర్నేషనల్ డెస్క్
ఇంటర్నేషనల్ విమాన ప్రయాణికులకు ఇకపై ఫిజికల్ బోర్డింగ్ పాస్ అవసరం లేకుండా, స్మార్ట్ ఫోన్లో ఉన్న ఈ-బోర్డింగ్ పాస్ చూపిస్తే సరిపోతుందని కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి బోర్డింగ్ పాస్ స్టాంపింగ్ను పూర్తిగా రద్దు చేస్తూ, ఇమిగ్రేషన్ కౌంటర్లలో డిజిటల్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేసి, క్యూలు తగ్గించి క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు ఇక ఫిజికల్ బోర్డింగ్ పాస్ అవసరం లేదు ఇంటర్నేషనల్ విమాన ప్రయాణికులు ఇకపై ఫిజికల్ బోర్డింగ్ పాస్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్మార్ట్ ఫోన్లలో ఉండే ఈ-బోర్డింగ్ పాస్ చూపిస్తే ప్రయాణానికి సరిపోతుందని వెల్లడించింది.
ఈ మేరకు సంబంధిత శాఖలు, ఇమిగ్రేషన్ విభాగానికి సూచనలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సెప్టెంబర్ 1 నుంచి బోర్డింగ్ పాస్పై స్టాంపింగ్ ప్రక్రియను పూర్తిగా ఎత్తివేయాలని ఇమిగ్రేషన్ అధికారులకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి