రాయలసీమ న్యూస్ - తిరుపతి
కేవీబీపురం మండలంలోని గుంటమెట్టు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏర్పేడు మండలం పెనుమల్లం గ్రామానికి చెందిన పెమ్ముగారి సెల్వ కుమార్ (50) ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించే మార్గమధ్యంలో మృతిచెందారు. సెంట్రింగ్ పనితో కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన అకాల మరణంతో కుటుంబం ఆర్థిక, సామాజిక ఇబ్బందుల్లోకి వెళ్లగా, పోలీసులు కేసు నమోదు చేసి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు కొన
కేవీబీపురం మండలంలో రోడ్డు ప్రమాదం ఒకరి మృతి కేవీబీపురం మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. ఏర్పేడు మండలం, పెనుమల్లం గ్రామానికి చెందిన పెమ్ముగారి సెల్వ కుమార్ (50) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఆదవరం గ్రామానికి చెందిన అక్క పార్వతమ్మ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి సెల్వ కుమార్ ద్విచక్ర వాహనంపై హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆయన ద్విచక్ర వాహనంపై కేవీబీపురం మండలం పరిధిలోని గుంటమెట్టు వద్దకు చేరుకున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి