రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దటూరు బొల్లవరం పురపాలక ప్రాథమిక పాఠశాలకు వెళ్లే రహదారి గుంతలతో, బురదతో నిండిపోయి చిన్నపిల్లలు, వృద్ధులు, వాహనదారులు తరచూ కిందపడుతూ గాయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వర్షాల సమయంలో గుంతల్లో నీరు నిలిచి ప్రమాదం మరింత పెరుగుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ కీలక మార్గానికి పురపాలక అధికారులు తక్షణ మరమ్మతులు చేపట్టాలని గట్టిగా కోరుతున్నారు.
ప్రొద్దటూరు బొల్లవరం పురపాలక పాఠశాల దారి గుంతలమయం ప్రొద్దటూరు పట్టణంలోని ఒకటవ వార్డు బొల్లవరం పురపాలక ప్రాథమిక పాఠశాలకు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి అధ్వాన్న స్థితికి చేరుకుంది. పాఠశాల ప్రధాన ద్వారం ముందు నుంచే ఈ దారి తీవ్రంగా దెబ్బతినడంతో ప్రతిరోజూ బడికి వెళ్లే చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.
అదే మార్గంలో ఉన్న ఒకటవ వార్డు సచివాలయానికి వెళ్లే ప్రజలకూ ఈ పరిస్థితి ఇరకాటంగా మారింది. బొల్లవరం పురపాలక ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి