రాయలసీమ న్యూస్ బిజినెస్ డెస్క్
RBI ఆర్థిక విద్య కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచుతూ, ఫైనాన్సియల్ లిటరసీ వీక్ 2026ను “KYC - యువర్ ఫస్ట్ స్టెప్ టూ సేఫ్ బ్యాంకింగ్ ” అంశంతో ఫిబ్రవరి 9–13 వరకు నిర్వహిస్తోంది. KYC పేరుతో నకిలీ సందేశాలు, లింకుల ద్వారా జరుగుతున్న ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, తొందరపడకుండా ఆలోచించి, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా OTP, PIN, పాస్వర్డ్ వంటి గోప్య వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని R
కేవైసీ పేరుతో మోసాలు పెరుగుదలపై RBI హెచ్చరిక రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఆర్థిక విద్య కార్యక్రమాల భాగంగా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు విస్తృత చర్యలు చేపట్టింది. ఆర్థిక సమావేశం, ఆర్థిక విద్య అనే రెండు అంశాలను అభివృద్ధి బాధ్యతలో కీలక భాగాలుగా RBI పరిగణిస్తోంది.
ఈ దిశగా బ్యాంకులు, ఇతర భాగస్వామ్య సంస్థలు ఉపయోగించుకునేలా 13 భాషల్లో సమాచార పత్రాలు, విజ్ఞప్తులు, ప్రచార సామగ్రిని RBI తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఆర్థిక ఉత్పత్తులు, సేవలు, మంచి ఆర్థిక అలవాట్లు, డిజిటల్ లావాదేవీలు, వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి