రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
స్థానిక 22వ వార్డులో డీజే ఎలక్ట్రికల్ సప్లయర్స్ నిర్వాహకుడు మాబు హుస్సేన్ కుటుంబంతో పాటు సుమారు 50 ముస్లిం కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరడంతో అక్కడ తెలుగుదేశానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా చేరిన వారు వైఎస్సార్సీపీనే పేద, బలహీన వర్గాలకు అండగా నిలిచే పార్టీగా అభివర్ణించగా, రాచమల్లు రానున్న స్థానిక సంస్థల
22వ వార్డులో టీడీపీకి ఎదురుదెబ్బ: వైఎస్సార్సీపీలోకి 50 కుటుంబాల చేరిక కడప : స్థానిక 22వ వార్డులో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వార్డు పరిధిలోని డీజే ఎలక్ట్రికల్ సప్లయర్స్ నిర్వాహకుడు మాబు హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 50 ముస్లిం కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, మాజీ కౌన్సిలర్ జాఫర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నూతనంగా చేరిన వారికి వైఎస్సార్సీపీ నేతలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్లో చదవండి