బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కల్పించడం

8 articles

బాలికల రక్షణపై అవగాహన – లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ర్యాలీ
జిల్లా వార్తలు

బాలికల రక్షణపై అవగాహన – లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ర్యాలీ

ప్రొద్దుటూరు వైఎంజర్ కాలనీలో సర్వోదయ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బాలికల రక్షణ, లింగ సమానత్వంపై అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. PCPNDT యాక్ట్–1994 నిబంధనలు, లింగ నిర్ధారణ పరీక్షల చట్టవిరుద్ధత, శిక్షలు, ఆడపిల్లల విద్య ప్రాధాన్యం, లింగ వివక్ష నిర్మూలనపై ప్రజలకు వివరించారు. బాలికలకు సమాన గౌరవం, అవకాశాలు కల్పించాలంటూ నిర్వాహకులు పిలుపునిచ్చారు.

24, ఆగ 2026

అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యపై చర్చించాలి: AIYF డిమాండ్
జిల్లా వార్తలు

అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యపై చర్చించాలి: AIYF డిమాండ్

All India Youth Federation రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యను ప్రాధాన్యంగా చర్చించి, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, నియామకాల్లో పారదర్శకత పాటించడం, నిరుద్యోగ భృతి పథకం రూపొందించడం ద్వారా యువతకు ఉపశమనం కల్పించాలని AIYF నాయకత్వం ప్రభుత్వాన్ని కోరింది.

18, ఆగ 2026

ప్రొద్దుటూరులో 10 వేల షాపులపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో 10 వేల షాపులపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు 10 వేల షాపులపై ఒక్కరోజులో ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 200 మంది సిబ్బందిని 12 టీములుగా విభజించి ప్లాస్టిక్ నిల్వలు, వినియోగం, విక్రయాలపై వివరాలు సేకరించి, అవసరమైన చోట్ల చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాపారులకు అవగాహన కల్పించనున్నారు. స్వచ్చ సంకల్ప దీక్షలో భాగంగా ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్య సాధనకు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని మున్సిపాలిటీ కోరుతోంది.

7, ఆగ 2026

పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
జిల్లా వార్తలు

పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

తిరుపతి జిల్లా పుత్తూరులోని ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్న ఈ సదస్సులో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండడం, వాహన పత్రాలు చెల్లుబాటులో ఉంచుకోవడం వంటి అంశాలపై పోలీసులు సూచనలు ఇచ్చారు. రోడ్డు భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

21, జులై 2026

నంద్యాల శక్తి టీం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన
జిల్లా వార్తలు

నంద్యాల శక్తి టీం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన

నంద్యాలలో నంద్యాల శక్తి టీం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలు, ప్రయాణికుల ప్రాణ భద్రతపై అవగాహన సెమినార్ నిర్వహించారు. మీటర్ వినియోగం, నిర్దేశిత చార్జీల వసూలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థుల పట్ల మర్యాద, రాత్రి వేళల్లో మహిళా ప్రయాణికుల రక్షణ, చట్టపరమైన నిబంధనలు పాటించకపోతే ఎదురయ్యే సమస్యలపై వివరించారు.

11, జులై 2026

తప్పు చేసిన వారు తప్పించుకోలేరు! : మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
రాజకీయాలు

తప్పు చేసిన వారు తప్పించుకోలేరు! : మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ఆడుదాం ఆంధ్రా’ అక్రమాలపై విజిలెన్స్‌ నివేదిక త్వరలోనే  బయటకు వస్తుందని క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.  రూ.100 కోట్లకుపైగా ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయన్న ఆయన.. తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు.

24, జూన్ 2026

ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
విద్య

ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. ఈసారి రెండో ఏడాది విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్‌ సదుపాయం కల్పించడంతో, ఇప్పటికే ఉత్తీర్ణులైన వారు సహా అనేక మంది మార్కులు మెరుగుపరుచుకునే అవకాశం పొందారు. ఫలితాలు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండగా, ఉన్నత విద్య ప్రవేశాల దృష్ట్యా ఇవి కీలకంగా మారాయి.

18, జూన్ 2026

వచ్చే 24 నెలలు రాజకీయాలకు బ్రేక్ : సీఎం రేవంత్ సందేశం
తెలంగాణ

వచ్చే 24 నెలలు రాజకీయాలకు బ్రేక్ : సీఎం రేవంత్ సందేశం

సైబరాబాద్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 1.34 కోట్ల మందికి మౌలిక వసతులు కల్పించేందుకు మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే 24 నెలలు రాజకీయాలకు పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని, కేసీఆర్ పదేళ్ల పాలన, మోదీ పన్నెండేళ్ల పాలన, తమ 30 నెలల పాలనపై తులనాత్మక చర్చకు సిద్ధమని పేర్కొన్నారు.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters