ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీతో విమానంలో దక్షిణాది ఆలయాల దర్శనం
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించిన ‘ సౌత్ ఇండియా టెంపుల్ రన్’ విమాన ప్యాకేజీ ద్వారా హైదరాబాద్ నుంచి ప్రారంభమై 6 రాత్రులు, 7 పగళ్లపాటు తిరువనంతపురం , కన్యాకుమారి , రామేశ్వరం, తంజావూర్ , తిరుచిరప్పల్లి, మదురై ప్రాంతాల ఆలయాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. టికెట్ ధరలు Triple ఆక్కుపెన్సీకి కనిష్ఠంగా రూ.37,700 నుంచి ప్రారంభమై, విమాన ప్రయాణం, హోటల్ బస, భోజనాలు, AC Bus, ట్రావెల్ Insurance సౌకర్యాలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.