బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మేళా

8 articles

కోడుమూరు లో మెగా కిసాన్ మేళా – రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు
జిల్లా వార్తలు

కోడుమూరు లో మెగా కిసాన్ మేళా – రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు

కర్నూలు జిల్లా కోడుమూరు వాసవి కల్యాణమందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ నిర్వహించిన జిల్లా స్థాయి మెగా కిసాన్ మేళాలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతికత, పంటల నిర్వహణపై నిపుణులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, రైతుల ఆదాయం పెంపు దిశగా పలు చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

6, ఆగ 2026

నంద్యాలలో ఈనెల 30న మెగా జాబ్ మేళా
జిల్లా వార్తలు

నంద్యాలలో ఈనెల 30న మెగా జాబ్ మేళా

నంద్యాల ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 16 కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో టెన్త్ నుంచి డిగ్రీకు మించి చదివిన అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని పేర్కొన్నారు. నంద్యాల పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

27, జులై 2026

కదిరిలో జూలై 24న మెగా జాబ్ మేళా
జిల్లా వార్తలు

కదిరిలో జూలై 24న మెగా జాబ్ మేళా

జూలై 24, శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలున్న 18–35 ఏళ్ల నిరుద్యోగ యువతీ, యువకులకు 11 కంపెనీల్లో నెలకు రూ.15,000–25,000 వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న ఈ మేళాకు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్ తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు.

22, జులై 2026

ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో జాబ్‌మేళా
జిల్లా వార్తలు

ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో జాబ్‌మేళా

తిరుపతిలోని ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో సోమవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టీ శ్రీనివాసులు తెలిపారు. పేరుగాంచిన ఎమ్‌ఎన్‌సీ కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో ఎస్‌ఎస్‌స్సీ నుంచి ఎంబీఏ, ఎంసీఏ వరకు విభిన్న విద్యార్హతలతో ఉన్న అభ్యర్థులకు సుమారు 600 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువత అవసరమైన ధ్రువపత్రాలు, బయోడేటాతో సమయానికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

19, జులై 2026

పారిశ్రామిక అభివృద్ధికి పల్నాడు వేదిక కావాలి : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

పారిశ్రామిక అభివృద్ధికి పల్నాడు వేదిక కావాలి : సీఎం చంద్రబాబు

ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటుచేసిన రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు.

17, జులై 2026

నిరుద్యోగ యువతకు ఊరటగా ఉద్యోగ మేళా
జిల్లా వార్తలు

నిరుద్యోగ యువతకు ఊరటగా ఉద్యోగ మేళా

కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి మూడు నెలలకోసారి ఉద్యోగ మేళాలు నిర్వహించేందుకు నిర్ణయించింది. తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు 34 మినీ, 57 మెగా జాబ్‌మేళాల ద్వారా 10,941 మందికి, చిత్తూరులో 16 మేళాల ద్వారా 475 మందికి ఉద్యోగాలు లభించాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా కోర్సులు, నైపుణ్యాలు అందించి యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

28, జూన్ 2026

మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 25న జాబ్ మేళా
జిల్లా వార్తలు

మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 25న జాబ్ మేళా

ఈ నెల 25న మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి. నారాయణరెడ్డి తెలిపారు. టెన్త్ నుంచి పీజీ, డిప్లొమా వరకు చదివిన నిరుద్యోగులు పాల్గొనవచ్చని, ఏయూస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, ఎయిల్ డిక్సన్ సహా 10 కంపెనీలు నియామకాలు చేపడతాయని చెప్పారు.

23, జూన్ 2026

ఎంఎస్ఎంఈ లతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి టీజీ భరత్
జిల్లా వార్తలు

ఎంఎస్ఎంఈ లతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి టీజీ భరత్

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి, యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో నిర్వహించిన జాబ్‌మేళాలో 19 కంపెనీల ద్వారా 1,460 ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని, ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్‌మేళాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా పెట్టుకుని పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

13, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters