బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మెట్రో

11 articles

చెన్నై మెట్రోని ముఖ్యమంత్రి విజయ్ పరిశీలించారు
తమిళనాడు

చెన్నై మెట్రోని ముఖ్యమంత్రి విజయ్ పరిశీలించారు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం చెన్నై మెట్రోలో ఒమందూరార్ నుంచి నందనం వరకు సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొనుగోలు చేసి ప్రయాణిస్తూ సేవల పనితీరును పరిశీలించారు. ఆయనను చూసేందుకు మెట్రో స్టేషన్‌లు, రైల్లో అభిమానులు భారీగా గుమిగూడగా, విజయ్ వారిని అభివాదం చేస్తూ ప్రయాణికులతో ఆత్మీయంగా మాట్లాడి, అనంతరం మెట్రో కంట్రోల్ రూమ్‌లో నిర్వహణ వ్యవస్థను పరిశీలించారు.

30, జులై 2026

చెన్నై కొయంబేడు మూడో దశ శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్
తమిళనాడు

చెన్నై కొయంబేడు మూడో దశ శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి తీరు . S. జోసెఫ్ విజయ్ చెన్నై కొయంబేడు మూడో దశ నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించి, నెగటివ్ ప్రెషర్ మెంబ్రేన్ ఫిల్టరేషన్ మెథడ్ ద్వారా నీటి శుద్ధి విధానాలు, యంత్రాంగం పనితీరు, నీటి నాణ్యత ప్రమాణాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రోజుకు 45 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో పనిచేస్తున్న ఈ కేంద్రం ద్వారా చెన్నై నగరానికి నాణ్యమైన తాగునీటి సరఫరా, శుద్ధి సామర్థ్య విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

28, జులై 2026

భద్రతా కారణాలతో దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత
జాతీయం

భద్రతా కారణాలతో దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత

దిల్లీలో భద్రతా కారణాల వల్ల రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్‌, మండీ హౌస్‌ సహా 16 మెట్రో స్టేషన్లను DMRC తాత్కాలికంగా మూసివేసింది. స్టేషన్లలో ప్రవేశం, నిష్క్రమణ నిలిపివేసినా, రాజీవ్ చౌక్, మండీ హౌస్‌, సెంట్రల్ సెక్రటేరియట్‌లో ఇంటర్‌ఛేంజ్‌ సౌకర్యం కొనసాగుతుంది. నిరసన కార్యక్రమాల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

22, జులై 2026

ఢిల్లీలో ఆందోళనలు: 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత
జాతీయం

ఢిల్లీలో ఆందోళనలు: 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత

ఢిల్లీలో యువత నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో లోక్ కళ్యాణ్ మార్గ్ , రాజీవ్ చౌక్ , Supreme Court సహా 16 మెట్రో స్టేషన్లు తాత్కాలికంగా మూసివేశారు, కీలక ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. జంతర్‌మంతర్‌లో విద్యార్థుల నిరసనలపై సుమోటో విచారణ కోరిన పిటిషన్‌తో పాటు, పోలీసుల దౌర్జన్యంపై మరో పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించి, ఇతర చట్టపర న్యాయ మార్గాలను ఆశ్రయించాలని సూచించింది.

22, జులై 2026

అస్సాంలో భారీ వర్షాలు.. 10 మంది మృతి
జాతీయం

అస్సాంలో భారీ వర్షాలు.. 10 మంది మృతి

అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వానల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతిచెందగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

21, జులై 2026

కాక్రోచ్‌ నిరసన.. ఢిల్లీలో హై అలర్ట్ .. కీలక మెట్రో స్టేషన్లు మూసివేత..
జాతీయం

కాక్రోచ్‌ నిరసన.. ఢిల్లీలో హై అలర్ట్ .. కీలక మెట్రో స్టేషన్లు మూసివేత..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.. కీల బిల్లులు తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. వివిధ సమస్యలపై నిలదీసేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి..

20, జులై 2026

నందనవనంలో భారీ అగ్నిప్రమాదం
తెలంగాణ

నందనవనంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ మీర్‌పేట్ నందనవనంలో మెట్రో బార్ సమీపంలోని ప్లాస్టిక్ గోదాంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని సమీప గోదాం, పక్క ఇళ్లను కూడా మంటలు ఆవరించాయి. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, భారీ ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం, మంటల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

15, జులై 2026

హైద‌రాబాద్ మెట్రో రుణంపై చ‌ర్చ‌లు సానుకూలం: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ

హైద‌రాబాద్ మెట్రో రుణంపై చ‌ర్చ‌లు సానుకూలం: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌తో హైద‌రాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం మంజూరు అంశంపై జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. మెట్రో విస్తరణ, నగర రవాణా సౌకర్యాల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు కొనసాగుతున్నాయని, మంగళవారం పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌తో కూడా ఈ విషయాలపై చర్చించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

23, జూన్ 2026

‘కాక్‌టైల్ 2’ తొలి వీకెండ్‌లోనే భారీ వసూళ్లు
సినిమా

‘కాక్‌టైల్ 2’ తొలి వీకెండ్‌లోనే భారీ వసూళ్లు

దర్శకుడు హోమీ అదజానియా తీసిన ‘కాక్‌టైల్ 2’ తొలి వారాంతానికే రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి ఈ ఏడాది హిందీ చిత్రాల్లో ముందంజలో నిలిచింది. పెద్ద హిందీ సినిమాల పోటీ లేకపోవడంతో మెట్రో నగరాలు, అర్బన్ సెంటర్లలో యువత భారీగా థియేటర్లకు వెళ్లి, శుక్రవారం నుంచి ఆదివారం వరకు స్థిరమైన వసూళ్లు సాధించడంతో రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

22, జూన్ 2026

తితిదే ఆలయాల్లో సిబ్బంది కొరత.. సేవల నిర్వహణకు సవాళ్లు
జిల్లా వార్తలు

తితిదే ఆలయాల్లో సిబ్బంది కొరత.. సేవల నిర్వహణకు సవాళ్లు

తిరుమలతో పాటు దేశవ్యాప్తంగా తితిదే ఆధ్వర్యంలోని 65 ఆలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతున్నా, అర్చకులు, పరిచారకులు, వేద పారాయణదారులు, కార్యాలయ సిబ్బంది వంటి మానవ వనరులు తీవ్రంగా తక్కువగా ఉన్నాయి. తితిదే బోర్డు రెండు విడతలుగా మొత్తం 640 కొత్త పోస్టుల సృష్టికి ఆమోదం తెలిపినా, అవి అమల్లోకి రాకపోవడంతో ఉన్న కొద్దిపాటి సిబ్బందే ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని సేవలు నిర్వహిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

9, జూన్ 2026

మెట్రోలో ప్రయాణించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

మెట్రోలో ప్రయాణించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులోని విధాన సౌధ నుంచి కనకపుర వరకు మెట్రోలో ప్రయాణించి, తన నియోజకవర్గం తొలి పర్యటనను ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే మెట్రోను ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. కనకపురలో రోజంతా ప్రజలతో సమావేశాలు, అభివృద్ధి పనుల సమీక్ష వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించగా, ఆయన సాధారణ ప్రయాణం సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు పొందుతోంది.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters