బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#లోక్‌సభలో

14 articles

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌
జాతీయం

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌

హోం మంత్రి అమిత్‌షానుద్దేశిస్తూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌ ఇచ్చారు.

31, జులై 2026

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌
జాతీయం

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాదే బాధ్యతని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు.

29, జులై 2026

లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం
జాతీయం

లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం

లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. NEET పేపర్ లీక్ ఘటనలతో దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, బాధ్యతాయుత వ్యవస్థల అవసరం వంటి అంశాలపై దాదాపు 10 గంటల పాటు చర్చ జరిగింది. బిల్లు ఆమోదంతో ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టేందుకు కఠిన చర్యలకు మార్గం సుగమమైందని పార్లమెంటరీ వర్గాలు భావిస్తున్నాయి.

29, జులై 2026

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?..   అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ
జాతీయం

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?.. అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ

నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ఆమె సూటిగా ప్రశ్నించారు.

28, జులై 2026

లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లు  ప్రవేశపెట్టిన కేంద్రం..
జాతీయం

లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..

దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం-2024లో కీలక సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

27, జులై 2026

యువత భవిష్యత్తును నాశనం చేశారు..: ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ తీవ్ర విమర్శలు
జాతీయం

యువత భవిష్యత్తును నాశనం చేశారు..: ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ తీవ్ర విమర్శలు

'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. అంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.

23, జులై 2026

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా
జాతీయం

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సోమవారం సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి.

20, జులై 2026

డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తాం.. : శివసేన(యూబీటీ)
జాతీయం

డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తాం.. : శివసేన(యూబీటీ)

ఇన్నాళ్లు బిల్లుకు మద్దతు ఇవ్వమని భీష్మించుకుని ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రైత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొచ్చని చెప్పారు.

16, జులై 2026

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?
జాతీయం

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు మళ్లీ చర్చకు రావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

16, జులై 2026

లోక్‌సభలో స్మార్ట్ వాచీలు, పెన్ కెమెరాలకు నో ఎంట్రీ
జాతీయం

లోక్‌సభలో స్మార్ట్ వాచీలు, పెన్ కెమెరాలకు నో ఎంట్రీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ సచివాలయం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాలు వంటి ఆడియో, వీడియో రికార్డింగ్ సామర్థ్యం ఉన్న పరికరాలను సభలోకి తీసుకురావడాన్ని నిషేధించింది. సభ్యుల వ్యక్తిగత గోప్యత, భద్రతను కాపాడటం, సభా కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేందుకు ఈ నియమాలు అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

16, జులై 2026

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ
జాతీయం

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ

భారత్‌లో విద్యా వ్యవస్థ మోసపూరితంగా మారిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్య పేరిట జరుగుతోన్న దోపిడీని నిలువరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

13, జులై 2026

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ
జాతీయం

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ

టీఎంసీ రెబల్‌ ఎంపీలు నేడు ఢిల్లీలో సమావేశం కానుండగా, 15న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీకి సిద్ధమవుతున్నారు. రెబల్‌ శిబిరంలో సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ చేరడంతో అసంతృప్త ఎంపీల సంఖ్య 20కి పెరిగి, పార్టీ అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇదిలా ఉండగా, అక్రమ లావాదేవీల కేసులో అభిషేక్‌ బెనర్జీకి సీఐడీ మళ్లీ సమన్లు జారీ చేసి, ఆయన నివాసంలో సోదాలు జరపడంతో టీఎంసీపై దర్యాప్తు ఒత్తిడి పెరిగింది.

14, జూన్ 2026

మళ్లీ మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లులు తెరపైకి!
జాతీయం

మళ్లీ మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లులు తెరపైకి!

పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ సాధించేందుకు ఎన్‌డీఏ కూటమి టీఎంసీ, డీఎంకే, ఇతర చిన్న పార్టీల మద్దతు కోసం సక్రియంగా కసరత్తు చేస్తోందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. టీఎంసీ, డీఎంకేలో సంభవించే చీలికలు, రాజ్యసభలో టీఎంసీ సభ్యుల పునర్నిర్వచన అవకాశాల నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్‌డీఏ బలం స్పెషల్ మెజారిటీకి చేరువ కావచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

9, జూన్ 2026

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు
జాతీయం

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు

పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతకు, ఇప్పుడు లోక్‌సభ ఎంపీల నుంచి కూడా సవాల్‌ ఎదురైంది. పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించి, ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఇదే సమయంలో, తృణమూల్‌ రాజ్యసభ సభ్యుడు సుకేందు శంకర్‌ రాయ్‌ పార్టీ, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ, మమతా గత ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, RG Kar ఆస్పత్రి ఘటనపై ప్రశ్నలు లేవనెత్తినందుకు తనను పక్కన పెట్టారని ఆరోపించారు.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters