బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అవకతవకలపై

9 articles

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం
జిల్లా వార్తలు

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం

తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఆగస్టు 9 వరకు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన విభాగాలు మద్దతు తెలుపుతూ, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.

6, ఆగ 2026

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
జిల్లా వార్తలు

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలలో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను దెబ్బతీస్తోందని విమర్శించిన ఆయన, ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, 10న నియోజకవర్గ స్థాయిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి డీఎస్సీ అవకతవకలపై పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.

5, ఆగ 2026

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్
జాతీయం

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపినట్లు తెలిపారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు, దేశవ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకునే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ, జాతీయ ఐక్యత కోసం రాజీనామా చేశానని ఆయన వివరించారు.

25, జులై 2026

నీట్, టెట్ పరీక్షల అవకతవకలపై యుటిఎఫ్ నిరసన
జిల్లా వార్తలు

నీట్, టెట్ పరీక్షల అవకతవకలపై యుటిఎఫ్ నిరసన

కదిరి అంబేద్కర్ సర్కిల్ వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యంలో నీట్, టెట్ పరీక్షల అవకతవకలపై నిరసన జరిగింది. నీట్ పేపర్ లీకేజీ, టెట్ నిర్వహణలో అవ్యవస్థల వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయ అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నాయకులు పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖలు నైతిక బాధ్యత వహించాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

21, జులై 2026

నీట్ అవకతవకలపై నిరాహార దీక్ష : క్షీణించిన సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం
జాతీయం

నీట్ అవకతవకలపై నిరాహార దీక్ష : క్షీణించిన సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం

నీట్ అవకతవకలకు నిరసనగా జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం 19వ రోజుకు తీవ్రంగా క్షీణించింది. బరువు, రక్తపోటు, చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పడిపోవడంతో 24 గంటల వైద్య పర్యవేక్షణలో ఉంటూనే దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించమని అడగొద్దని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగించాలని, జూలై 20న ‘చలో సంసద్’ యాత్రలో పాల్గొనాలని ఆయన వీడియో సందేశంలో పిలుపునిచ్చారు.

16, జులై 2026

ఓట్ల లూటీపై సీజేఐకి విపక్షాల ఉమ్మడి ఫిర్యాదు
జాతీయం

ఓట్ల లూటీపై సీజేఐకి విపక్షాల ఉమ్మడి ఫిర్యాదు

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ (సర్‌) ప్రక్రియ, ఇతర ఎన్నికల అవకతవకలపై ఇండియా కూటమి నేతలు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌కు ఒక ఉమ్మడి లేఖను పంపారు.

30, జూన్ 2026

దిల్లీ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ నిరసన
జాతీయం

దిల్లీ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ నిరసన

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్‌ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ధర్నాకి దిగింది. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

20, జూన్ 2026

పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
జిల్లా వార్తలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి

రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి పేదల సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గత ప్రభుత్వ హౌసింగ్ పథకంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రామేశ్వరం, బొల్లవరం, మీనాపురం లేఅవుట్లలో వేలాది ప్లాట్లు, ఇళ్లను కేటాయించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు పూర్తి చేసి అందజేశామని, మరో 4 లక్షల ఇళ్లను త్వరలో పూర్తి చేసి పేదలకు తాళాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

13, జూన్ 2026

టీఎస్ఎమ్‌ఏసీ దుకాణాలపై విస్తృత తనిఖీలు, ఆడిట్లు: ఆదాయ లీకేజీలను అరికట్టే దిశగా సీఎం విజయ్ అడుగులు
తమిళనాడు

టీఎస్ఎమ్‌ఏసీ దుకాణాలపై విస్తృత తనిఖీలు, ఆడిట్లు: ఆదాయ లీకేజీలను అరికట్టే దిశగా సీఎం విజయ్ అడుగులు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ తొలి కేబినెట్‌ సమావేశంలోనే టీఎస్ఎమ్‌ఏసీ వ్యవస్థలో అవకతవకలు, ఆదాయ లీకేజీలపై కఠిన చర్యలకు సంకేతాలు ఇచ్చారు. టీఎస్ఎమ్‌ఏసీ దుకాణాల నిర్వహణలో పారదర్శకత, నిల్వల లెక్కలు, విక్రయాల గణాంకాల పర్యవేక్షణకు విస్తృత తనిఖీలు, ఆడిట్లు, నిర్మాణాత్మక సంస్కరణలపై చర్చ జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters