బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఖరీఫ్

13 articles

ఎల్ నినో పరిస్థితులపై కడపలో సమీక్షా సమావేశం
జిల్లా వార్తలు

ఎల్ నినో పరిస్థితులపై కడపలో సమీక్షా సమావేశం

కడప జిల్లా కలెక్టరేట్‌లో ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో వర్షపాతం, భూగర్భ జలాలు, జలాశయాల నీటి నిల్వలు, ఖరీఫ్ సాగు, ఇప్పటికే అమలులో ఉన్న ప్రత్యామ్నాయ చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ల ద్వారా సమగ్రంగా సమీక్షించారు. ఎల్ నినో ప్రభావం తక్కువగా ఉండేలా ముందస్తు ప్రణాళికలు, నీటి నిర్వహణ, రైతులకు అవగాహన, విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు.

6, ఆగ 2026

పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు అవగాహన
జిల్లా వార్తలు

పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు అవగాహన

వేంపల్లె మండలంలోని కుమ్మరాంపల్లి గ్రామంలో ఖరీఫ్ సీజన్ సందర్భంగా నిర్వహించిన "పొలం పిలుస్తోంది" కార్యక్రమంలో వరి పంట సమస్యలు, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నీటి వినియోగం, సస్యరక్షణ, జింక్ సల్ఫేట్, జిప్సం వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. పీఎంఎఫ్‌బీవై కింద పంట బీమా, ఈ-పంట, రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదులు ఆగస్టు 15లోపు పూర్తి చేసి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని అధికారులు సూచించారు.

6, ఆగ 2026

కర్నూలు జిల్లాలో ఖరీఫ్ పంటల బీమా గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు
జిల్లా వార్తలు

కర్నూలు జిల్లాలో ఖరీఫ్ పంటల బీమా గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా నమోదు, ప్రీమియం చెల్లింపు గడువును జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగించారు. వరి మినహా అన్ని నోటిఫై చేసిన ఖరీఫ్ పంటలకు ఇది వర్తిస్తుందని, రుణగ్రహీత, రుణేతర రైతులు బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు, రైతు సేవా కేంద్రాలు, NCIP మొబైల్ యాప్ ద్వారా గడువు ముగిసేలోపు తప్పనిసరిగా బీమా నమోదు పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు.

1, ఆగ 2026

బీమా బకాయిల విడుదలకు  కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ :  మంత్రి  అచ్చెన్నాయుడు
రాజకీయాలు

బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ : మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో బీమా బకాయిలు విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సుమారు 1,900 కోట్ల పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతలవారీగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

27, జులై 2026

ఎల్ నినో ప్రభావంతో కడప జిల్లాలో కరువు భయం, రైతుల్లో ఆందోళన
జిల్లా వార్తలు

ఎల్ నినో ప్రభావంతో కడప జిల్లాలో కరువు భయం, రైతుల్లో ఆందోళన

ఎల్ నినో ప్రభావంతో కడప జిల్లాలో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో ఖరీఫ్ సీజన్‌లో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి, ఇప్పటికే వేసిన పంటలు కూడా ఎండుదశకు చేరుకుంటున్నాయి. బోర్లలో నీటి మట్టం పడిపోవడం, నేలలో తేమ లేకపోవడం వల్ల రైతులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేస్తూ, పంటల దిగుబడి, ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

26, జులై 2026

ఎండలతో ఖరీఫ్ పంటలు ఎండిపోతున్న రైతులు ఆందోళనలో
జిల్లా వార్తలు

ఎండలతో ఖరీఫ్ పంటలు ఎండిపోతున్న రైతులు ఆందోళనలో

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో వర్షాభావం తీవ్రతరం కావడంతో గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల్లో ఖరీఫ్ పత్తి, కంది, వేరుశెనగ పంటలు మొలక దశలోనే ఎండిపోతున్నాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు ఆర్థిక, మానసిక ఒత్తిడిలో నిలిచిపోయి, తక్షణ వర్షాలు, ప్రభుత్వ సహాయం, నష్టపరిహారం కోసం ప్రభుత్వం పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

15, జులై 2026

రైతు భరోసా నిధుల తుది విడత విడుదలకు సిద్ధం
తెలంగాణ

రైతు భరోసా నిధుల తుది విడత విడుదలకు సిద్ధం

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల తుది విడతగా రూ.1,009 కోట్లను ఈరోజు విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయంగా ఇప్పటివరకు మొత్తం 74 లక్షల మంది రైతులకు, 1.45 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి నిధులు చేరగా, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఖాతాలకు కూడా త్వరలోనే నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

10, జులై 2026

నీరు లేక ఎండిన వరి  నేలలు… రైతుల్లో ఆందోళన
వ్యవసాయం

నీరు లేక ఎండిన వరి నేలలు… రైతుల్లో ఆందోళన

ఎల్‌నినో ప్రభావం, వర్షాల లోపం, చెరువులు–కాలువల్లో నీటి కొరత కారణంగా ఆరుద్ర కార్తె ముగిసినా జిల్లాలో వరి సాగు ఆశించిన స్థాయికి చేరకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. ఇప్పటివరకు కేవలం 1.94 లక్షల ఎకరాల్లోనే వరి సాగు జరగగా, ఇతర పంటల విత్తనాలు కూడా నీటి అనిశ్చితితో మందగించాయి. నీటి లభ్యతపై స్పష్టత లేక రైతులు పంట ఎంపికలో సందిగ్ధానికి గురై ప్రభుత్వ సహాయం, సమయానికి విత్తనాలు, ఎరువుల సరఫరా, నీటి నిర్వహణపై స్పష్టమైన కార్యాచరణ కోసం ఎదురుచూస్తున్నారు.

6, జులై 2026

పుట్టపర్తిలో వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
జిల్లా వార్తలు

పుట్టపర్తిలో వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై వ్యవసాయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, సబ్సిడీ వేరుశనగ విత్తనాలు, ఎరువులు సమయానికి, తగిన మోతాదులో రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందస్తు ప్రణాళిక, పారదర్శక పంపిణీ, గ్రామ స్థాయిలో సమస్యల గుర్తింపు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తూ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.

30, జూన్ 2026

రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు.. : మంత్రి అచ్చెన్న వార్నింగ్
వ్యవసాయం

రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు.. : మంత్రి అచ్చెన్న వార్నింగ్

రైతులను ఇబ్బంది పెడితే డీల‌ర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీల‌పై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో ఖరీఫ్-2026 ఎరువుల లభ్యత, పంపిణీపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

22, జూన్ 2026

రైతులకు ఆర్థిక బలం, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

రైతులకు ఆర్థిక బలం, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్లు జమ చేసి, ఖరీఫ్ సీజన్‌కు ముందే ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నం చేస్తోంది. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర లక్ష్యాలతో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి రెండు Waste to Energy ప్లాంట్లకు శంకుస్థాపన చేసి, మొత్తం ఎనిమిది ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో వంట ప్రక్రియను ఆధునీకరించేందుకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ ప్రారంభించి, పిల్లల పోషణ, ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

21, జూన్ 2026

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
వ్యవసాయం

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2026 సీజన్‌లో పచ్చిరొట్ట పంటల సాగు ప్రోత్సాహానికి రూ.62.20 కోట్ల సబ్సిడీ కేటాయించి, 91,918 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలకు పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు 19,667 మంది రైతులకు 5,687 క్వింటాళ్ల విత్తనాలు అందజేసి రూ.4.76 కోట్ల సబ్సిడీ ప్రయోజనం కల్పించగా, భూసార పరిరక్షణ, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, అధిక దిగుబడులే ప్రభుత్వ లక్ష్యంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

3, జూన్ 2026

ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోడంతో రాయలసీమ రైతులకు పెరుగుతున్న ఇబ్బందులు
రాజకీయాలు

ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోడంతో రాయలసీమ రైతులకు పెరుగుతున్న ఇబ్బందులు

కర్నూలు: రాబోయే ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు వేయడానికి రాయలసీమ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎరువులు, ఇంధనం, కూలి తదితర ఇన్పుట్ వ్యయాలు భారీగా పెరగడం, దిగుబడిపై అనిశ్చితి నెలకొనడం వల్ల సాగు చేయ

28, మే 2026

We Are Hiring – Anchors + Copywriters