బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నిర్వాహకులు

35 articles

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తో ఎరువుల పంపిణీ ప్రారంభం
జిల్లా వార్తలు

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తో ఎరువుల పంపిణీ ప్రారంభం

ప్రొద్దుటూరు మండలం లింగాపురం PACS ఆధ్వర్యంలో యూరియా, DAPతో పాటు రాయితీ ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. DBT, APAIMS 2.0 విధానాల ద్వారా పారదర్శకంగా ఎరువులు అందించడంతో పాటు ఎల్ నినో ప్రభావ నివారణపై రైతుల అవగాహన కోసం ప్రత్యేక కరపత్రాలను విడుదల చేసి, మండలంలోని రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

8, ఆగ 2026

ప్రొద్దుటూరులో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్

ప్రొద్దుటూరులో ఏపీ యన్ జి జి ఓ స్ అసోసియేషన్ తాలూకా యూనిట్ మరియు Holistic Hospital సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9న NGO Homeలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. గుండె, ఎముకలు, కీళ్ళు, కంటి మరియు జనరల్ మెడిసిన్ విభాగాల్లో ECG, 2D Echo, రక్తపోటు, షుగర్ వంటి పరీక్షలు చేసి, అవసరమైన మందులు, వైద్య సలహాలు ఉచితంగా అందించనున్నారు.

8, ఆగ 2026

మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం
జిల్లా వార్తలు

మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం

మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయ నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలను ఖండిస్తూ అభ్యర్థులు ‘ఛలో కర్నూల్ మెగా డీఎస్సీ–2025 ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి 42 మంది అభ్యర్థులు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ర్యాలీలో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయుల ఐక్యత, న్యాయమైన నియామకాలకు మద్దతు ప్రకటిస్తూ, నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వడం ఈ ర్యాలీ లక్ష్యంగా ఉంది.

8, ఆగ 2026

నంద్యాలలో అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి పోటీలు ప్రారంభం
జిల్లా వార్తలు

నంద్యాలలో అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి పోటీలు ప్రారంభం

నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల, కళాశాల స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, రాష్ట్రస్థాయి తిరుపతి పోటీలకు ఎంపిక చేసే అవకాశం లభించనుందని అధికారులు తెలిపారు.

8, ఆగ 2026

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యానికి ఇస్కాన్ మద్దతు
జిల్లా వార్తలు

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యానికి ఇస్కాన్ మద్దతు

ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పురపాలక సంఘం చేపట్టిన కార్యక్రమాలకు ఇస్కాన్ మద్దతు ప్రకటించింది. ఆగస్టు 15న జరగనున్న స్వచ్ఛ సంకల్ప దీక్షలో ఇస్కాన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, ప్రత్యామ్నాయాల వినియోగం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిషనర్‌కు సహకారం హామీ ఇచ్చారు.

8, ఆగ 2026

ప్రొద్దుటూరులో ఆగస్టు 8న కలశాభిషేక మహోత్సవం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో ఆగస్టు 8న కలశాభిషేక మహోత్సవం

ప్రొద్దుటూరు పట్టణంలోని పోతురాజు గడ్డ వద్ద ఆగస్టు 8, శనివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 108 కలశాలతో కలశాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. వర్షాభివృద్ధి, పంటల పుష్కల దిగుబడి, కరువు నివారణ, ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం శోభాయాత్ర, జలాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించి, అనంతరం తీర్థప్రసాదం పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

7, ఆగ 2026

ప్రొద్దుటూరులో నశాముక్త భారత్ అభియాన్ ప్రారంభం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో నశాముక్త భారత్ అభియాన్ ప్రారంభం

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఉటుకూరు వీరయ్య ఉన్నత పాఠశాలలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువతను మాదకద్రవ్యాలు, సెల్‌ఫోన్, టీవీ వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉంచి, విలువలతో కూడిన సమాజ నిర్మాణం, ఆరోగ్యకర జీవన విధానం, రాజయోగ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని నిర్వాహకులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.

7, ఆగ 2026

రాయచోటిలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
జిల్లా వార్తలు

రాయచోటిలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

రాయచోటి పట్టణంలో బస్టాండ్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ చాంద్‌బాషా, ట్రాఫిక్ విభాగం ప్రతినిధులు ప్రమాదాల నివారణ, మీటర్లు, వాహన పత్రాలు, మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని సూచించారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని యూనియన్, నాయకులు అభిలషించారు.

7, ఆగ 2026

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, నియమ నిబంధనలతో నిర్వహించాలి:  పోలీసు శాఖ
జిల్లా వార్తలు

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, నియమ నిబంధనలతో నిర్వహించాలి: పోలీసు శాఖ

రానున్న వినాయక చవితి, నవరాత్రి సందర్భంగా హిందూపురం పట్టణంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖలు సూచించాయి. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు, నిర్దేశిత సమయాల్లో ప్రతిష్ఠాపన, నిమజ్జనం, శబ్ద కాలుష్య నియంత్రణ, భద్రత, పారిశుధ్యం, సోషల్ మీడియా వినియోగంపై కఠిన నియమాలు అమలు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

6, ఆగ 2026

పామిడిలో ఎల్ నినో సన్నద్ధతపై రైతులకు అవగాహన సదస్సు
జిల్లా వార్తలు

పామిడిలో ఎల్ నినో సన్నద్ధతపై రైతులకు అవగాహన సదస్సు

అనంతపురం జిల్లా పామిడిలో ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. శాస్త్రవేత్తలు తక్కువ నీటితో సాగు చేయగలిగే ఆముదం, పెసర, అలసంద, పప్పుశనగ, ఉలవ, సజ్జ, జొన్న వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీర్ఘకాలిక పంటలను ఈ ఖరీఫ్‌లో నివారించాలని సూచించారు. ఆగస్టు 3 నుంచి 10 వరకు జిల్లావ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

6, ఆగ 2026

ప్రకాశం జిల్లా దర్శిలో దివ్యాంగులకు బ్యాటరీ వాహనాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా దర్శిలో దివ్యాంగులకు బ్యాటరీ వాహనాల పంపిణీ

ప్రకాశం జిల్లా దర్శిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో అలెంకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు, అవసరమైన పరికరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాజాబాబు, గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొని, దివ్యాంగుల జీవనోపాధి, సామాజిక–ఆర్థిక స్థితి మెరుగుపరచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

1, ఆగ 2026

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ విస్తృత సోదాలు
జాతీయం

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ విస్తృత సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

31, జులై 2026

జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు హేమశ్రీ, నేత్ర ఎంపిక
జిల్లా వార్తలు

జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు హేమశ్రీ, నేత్ర ఎంపిక

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చారాల ఉన్నత పాఠశాల విద్యార్థినులు హేమశ్రీ, నేత్ర అమరావతి ఛాంపియన్షిప్ పుంగనూరు నియోజకవర్గ స్థాయి కబడ్డీ సెలక్షన్స్‌లో మెరుగైన ప్రదర్శనతో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గ్రామీణ బాలికలు క్రీడల్లో ముందుకు రావడం పట్ల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

31, జులై 2026

14వ నెక్సా సైమా అవార్డ్స్ నామినేషన్స్ విడుదల
సినిమా

14వ నెక్సా సైమా అవార్డ్స్ నామినేషన్స్ విడుదల

14వ నెక్సా SIIMA అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్స్‌ను అధికారికంగా ప్రకటించారు. 2025లో విడుదలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల నుంచి ఎంపికైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల పేర్లు వెల్లడించగా, తెలుగు నుంచి ‘మిరాయ్’, తమిళం నుంచి ‘డ్రాగన్’, కన్నడ నుంచి ‘కాంతార: చాప్టర్ 1’, మలయాళం నుంచి ‘లోకా’ అత్యధిక నామినేషన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోషల్ మీడియాలో నామినేషన్స్ జాబితా వైరల్ అవుతుండగా, ఎవరు అవార్డులు గెలుచుకుంటారన్న ఆసక్తి సినీ అభిమానుల్లో పెరుగుతోంది.

31, జులై 2026

ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలో 2కే రన్
జిల్లా వార్తలు

ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలో 2కే రన్

ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలో Nature Welfare Council ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. టవర్ క్లాక్ నుంచి (SSBN) కళాశాల వరకు సాగిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రారంభించి, El Nino ప్రభావాన్ని తట్టుకోవాలంటే ప్రకృతి సంరక్షణ, వృక్షారోపణ, స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతోనే స్థిరమైన మార్పు సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు.

28, జులై 2026

బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో ఓటమి..   ఏకంగా తుపాకీతో కాల్పులు
నేరాలు

బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు

ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఓటమిని తట్టుకోలేక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన పని కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపింది. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో ఓడిపోయామన్న ఆవేశంతో.. మాజీ ఎంపీ ఎదుటే ఏకంగా తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం రావడంతో ప్రేక్షకులు భయాందోళన చెందారు.

27, జులై 2026

కర్నూలు ఆదిత్యనగర్‌లో అసాంఘిక కార్యకలాపాలపై దాడులు: ముగ్గురు అరెస్ట్
జిల్లా వార్తలు

కర్నూలు ఆదిత్యనగర్‌లో అసాంఘిక కార్యకలాపాలపై దాడులు: ముగ్గురు అరెస్ట్

కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దాడులు నిర్వహించి, ఇద్దరు నిర్వాహకులు, ఒక విటుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. సంఘటన స్థలంలో నుంచి ఆధారాలను స్వాధీనం చేసుకుని, సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చారు. నిందితుల నెట్‌వర్క్, కార్యకలాపాల విస్తృతి పై దర్యాప్తు కొనసాగుతుండగా, ఇలాంటి సమాచారం లభించిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు.

25, జులై 2026

ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల..   నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి టీమిండియా

జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ పోటీల షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో క్రికెట్ నాలుగోసారి చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

24, జులై 2026

నందవరంలో శ్రీ చౌడేశ్వరి దేవి శాకంబరీ మహోత్సవాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆహ్వానం
జిల్లా వార్తలు

నందవరంలో శ్రీ చౌడేశ్వరి దేవి శాకంబరీ మహోత్సవాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆహ్వానం

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో శ్రీ చౌడేశ్వరి దేవి శాకంబరీ మహోత్సవాలు ఈ నెల 27 నుంచి 29 వరకు తొలిసారిగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహోత్సవాలకు ఆహ్వానం అందుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భక్తుల సౌకర్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించగా, జూలై 31, ఆగస్టు 12 తేదీల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

24, జులై 2026

వికలాంగ క్రికెటర్ల కోసం జిల్లా జట్టు ఎంపికలు జూలై 26న కడపలో
జిల్లా వార్తలు

వికలాంగ క్రికెటర్ల కోసం జిల్లా జట్టు ఎంపికలు జూలై 26న కడపలో

కలయిక వైఎస్సార్ జిల్లాకు చెందిన వికలాంగ క్రికెటర్ల కోసం జిల్లా జట్టు ఎంపిక పరీక్షలు జూలై 26న కడపలోని YSR ACA స్టేడియం నెట్స్ లో నిర్వహించనున్నారు. అమరావతి ఇంక్లూసివ్ క్రికెట్ కప్ - 2026 కోసం పోటీ సామర్థ్యమున్న జిల్లా జట్టును ఎంపిక చేయడం లక్ష్యంగా పెట్టుకున్న నిర్వాహకులు, అభ్యర్థులు వ్యక్తిగత క్రికెట్ కిట్, ఆధార్ కార్డు, SADAREM సర్టిఫికెట్ , UDID Card ఫోటోకాపీ, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో నిర్ణయించిన సమయానికి తప్పనిసరిగా హాజరుకావాలని సూచిస్తున్నారు.

23, జులై 2026

కదిరిలో జూలై 24న మెగా జాబ్ మేళా
జిల్లా వార్తలు

కదిరిలో జూలై 24న మెగా జాబ్ మేళా

జూలై 24, శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలున్న 18–35 ఏళ్ల నిరుద్యోగ యువతీ, యువకులకు 11 కంపెనీల్లో నెలకు రూ.15,000–25,000 వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న ఈ మేళాకు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్ తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు.

22, జులై 2026

16 నుంచి జగన్నాథ రథయాత్ర.. ఏర్పాట్లు పూర్తి
జాతీయం

16 నుంచి జగన్నాథ రథయాత్ర.. ఏర్పాట్లు పూర్తి

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో  అత్యంత వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్రకు  సన్నాహాలు పూర్తయ్యాయి. జూలై 16, గురువారం నుంచి జూలై 24, శుక్రవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

15, జులై 2026

వేడుకగా ట్రిపుల్‌ఐటీడీఎం కర్నూలు 8వ స్నాతకోత్సవం
జిల్లా వార్తలు

వేడుకగా ట్రిపుల్‌ఐటీడీఎం కర్నూలు 8వ స్నాతకోత్సవం

కర్నూలులోని IIITDMలో ఎనిమిదో స్నాతకోత్సవాన్ని శనివారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. పద్మశ్రీ Dr. R. ఏళ్ళ వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు, బంగారు పతకాలు, మెరిట్‌ మెడల్స్‌ ప్రదానం చేశారు. 2025-26 విద్యాసంవత్సరంలో 93 సంస్థలు క్యాంపస్‌ నియామకాలు నిర్వహించగా 101 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందగా, దేశీయ, అంతర్జాతీయ కంపెనీల్లో IIITDM ఉత్తీర్ణులు సేవలందిస్తున్నారని యాజమాన్యం తెలిపింది.

12, జులై 2026

నంద్యాల శక్తి టీం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన
జిల్లా వార్తలు

నంద్యాల శక్తి టీం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన

నంద్యాలలో నంద్యాల శక్తి టీం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలు, ప్రయాణికుల ప్రాణ భద్రతపై అవగాహన సెమినార్ నిర్వహించారు. మీటర్ వినియోగం, నిర్దేశిత చార్జీల వసూలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థుల పట్ల మర్యాద, రాత్రి వేళల్లో మహిళా ప్రయాణికుల రక్షణ, చట్టపరమైన నిబంధనలు పాటించకపోతే ఎదురయ్యే సమస్యలపై వివరించారు.

11, జులై 2026

ప్రొద్దుటూరు గంగమ్మ దేవాలయంలో పునఃప్రతిష్ఠ ఉత్సవాలు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు గంగమ్మ దేవాలయంలో పునఃప్రతిష్ఠ ఉత్సవాలు

ప్రొద్దుటూరు పప్పుల బజారులోని గంగమ్మ దేవాలయంలో పునఃప్రతిష్ఠ ఉత్సవాలు సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జరుగుతున్నాయి. ధ్వజస్తంభ ప్రతిష్ఠ, గ్రామోత్సవం, విగ్రహ ప్రతిష్ఠా కుంభాభిషేకం, మహాకలశాభిషేకం వంటి కార్యక్రమాలకు భక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు భారీగా హాజరుకానుండగా, భక్తుల సౌకర్యాల కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులు కోరారు.

29, జూన్ 2026

బిగ్ బాస్ తెలుగు 10లో చాన్స్ ఇవ్వాలని ఎస్సై సెల్ఫీ వీడియో..
జిల్లా వార్తలు

బిగ్ బాస్ తెలుగు 10లో చాన్స్ ఇవ్వాలని ఎస్సై సెల్ఫీ వీడియో..

నంద్యాల జిల్లా గడివేములకు చెందిన ఎస్సై నాగార్జున రెడ్డి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని పోలీసు యూనిఫామ్‌లోనే తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను కొందరు సరదాగా తీసుకుంటుండగా, యూనిఫామ్‌లో ఉండగానే వినోద కార్యక్రమాల కోసం ఇలా విజ్ఞప్తులు చేయడం పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగమని మరికొందరు విమర్శిస్తున్నారు.

25, జూన్ 2026

కర్నూలులో 28న ఒలింపిక్‌ డే రన్‌
జిల్లా వార్తలు

కర్నూలులో 28న ఒలింపిక్‌ డే రన్‌

కర్నూలులో ఈ నెల 28న ఒలింపిక్‌ డే రన్‌ నిర్వహించనున్నట్లు ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు తెలిపారు. ఒలింపిక్‌ డేను పురస్కరించుకొని స్థానిక స్టేడియంలో బాస్కెట్‌బాల్‌, కబడ్డీ, బాక్సింగ్‌, ఖోఖోతో పాటు మాంటిస్సోరి పాఠశాలలో బాక్సింగ్‌ పోటీలను ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, శారీరక దృఢత్వంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

25, జూన్ 2026

మంగళగిరిలో APL సీజన్–5 క్రికెట్ టోర్నీ ప్రారంభం
క్రీడలు

మంగళగిరిలో APL సీజన్–5 క్రికెట్ టోర్నీ ప్రారంభం

మంగళగిరిలో APL సీజన్–5 క్రికెట్ టోర్నమెంట్‌ నేటి నుంచి ఈ నెల 30 వరకు జరుగుతోంది. ప్రారంభ మ్యాచ్‌కు సినీ నటుడు రామ్‌చరణ్‌, ఫైనల్‌కు మంత్రి నారా లోకేష్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానుండగా, వివిధ జట్లు పాల్గొనే ఈ టోర్నీ స్థానిక యువ క్రీడాకారులకు ప్రతిభ ప్రదర్శనకు మంచి వేదికగా నిలవనుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

24, జూన్ 2026

భూమయ్యగారిపల్లెలో ఆలయ ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

భూమయ్యగారిపల్లెలో ఆలయ ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌

పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమయ్యగారిపల్లెలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి చేరుకుని కలశ స్థాపన, సుదర్శన హోమం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బండలాగుడు మైదానంలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించి, తరువాత ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేయనున్నారు.

24, జూన్ 2026

సెరెనా విలియమ్స్ పునరాగమనం.. వింబుల్డన్‌కు వైల్డ్ కార్డు
క్రీడలు

సెరెనా విలియమ్స్ పునరాగమనం.. వింబుల్డన్‌కు వైల్డ్ కార్డు

నాలుగేళ్ల విరామం తర్వాత అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో వైల్డ్ కార్డు ద్వారా మళ్లీ గ్రాండ్‌స్లామ్‌ రంగప్రవేశం చేయబోతోంది. ఇటీవల డబుల్స్‌లో వరుస పరాజయాలు ఎదురైనా, 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్ల విజేతగా ఆమె పునరాగమనంపై టెన్నిస్‌ ప్రపంచం, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

22, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters