కర్నూలు: కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (IIITDM) క్యాంపస్‌లో ఎనిమిదో స్నాతకోత్సవం శనివారం వేడుకగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్యం ప్రతిష్ఠాత్మకంగా ఆర్గనైజ్‌ చేసింది.

స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ Dr. R. ఏళ్ళ వెంకటేశ్వర రావు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను నిర్వాహకులు సన్మానించి, స్మారక చిహ్నం అందజేశారు. అనంతరం విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు, ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు.

కళాశాల ప్రతినిధుల సమాచారం ప్రకారం 2025-26 విద్యాసంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. అకడమిక్‌ ఫలితాలు, పరిశోధన, ప్రాజెక్టులు, ఇన్నోవేషన్‌ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి మెరిట్‌ మెడల్స్‌ ప్రదానం చేసినట్లు తెలిపారు.

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల విషయంలో కూడా IIITDM కర్నూలు ఈ విద్యాసంవత్సరంలో మంచి ఫలితాలు సాధించింది. 2025-26 సంవత్సరంలో మొత్తం 93 సంస్థలు క్యాంపస్‌ నియామకాలు నిర్వహించగా 101 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందినట్లు కళాశాల వర్గాలు వెల్లడించాయి. దేశీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన్నాయని పేర్కొన్నారు.

స్నాతకోత్సవం సందర్భంగా క్యాంపస్‌లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. డిగ్రీలు అందుకున్న విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. అధ్యాపకులు, నిర్వాహకులు విద్యార్థుల భవిష్యత్‌ కెరీర్‌ పురోగతికి శుభాకాంక్షలు తెలిపారు.

కళాశాల స్థాపన నుంచి ఇప్పటివరకు IIITDM కర్నూలు నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , డిజైన్ , మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో దేశ, విదేశాల్లో వివిధ సంస్థల్లో సేవలందిస్తున్నారని యాజమాన్యం పేర్కొంది. ఈ స్నాతకోత్సవం ద్వారా మరో బ్యాచ్‌ విద్యార్థులు పరిశ్రమలలోకి అడుగుపెడుతున్నారని, వారి విజయాలు సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమం ముగింపులో జాతీయ గీతం ఆలపించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులు క్యాంపస్‌ పరిసరాల్లో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ స్నాతకోత్సవ వేడుకను జ్ఞాపకంగా నిలుపుకున్నారు.