రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆ నెలలో రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసిన రెండో దేశంగా భారత్ నిలిచిందని ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తన తాజా నివేదికలో వెల్లడించింది.
నివేదిక ప్రకారం జూన్లో భారత్ రష్యా నుంచి మొత్తం 5.5 బిలియన్ యూరోల విలువైన ఇంధనం, బొగ్గును దిగుమతి చేసుకుంది. మే నెలతో పోలిస్తే ఈ విలువ 34 శాతం ఎక్కువ. రష్యా నుంచి భారత్ దిగుమతి చేస్తున్న ఇంధనంలో 83 శాతం ముడి చమురే ఉండటం ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలైన భారత్, తుర్కీయే , బ్రూనై , జార్జియా లు జూన్లో కలిపి దాదాపు 814 మిలియన్ యూరోల విలువైన చమురును ఎగుమతి చేశాయని అదే నివేదిక పేర్కొంది. ఈ చమురు నుంచి తయారైన ఉత్పత్తులకు యునైటెడ్ స్టేట్స్ , ఎఉరోపెయన్ యూనియన్ వంటి దేశాలు ప్రధాన దిగుమతిదారులుగా ఉన్నాయని వెల్లడించింది.
రష్యా చమురు ఆధారంగా తయారు చేసిన జెట్ ఫ్యూయల్ , డీజిల్ ఫ్యూయల్ దిగుమతులకు బ్రిటన్ మినహాయింపు ఇవ్వడం ఈ పరిణామాలకు నేపథ్యమైంది. ఈ సడలింపుల తర్వాత జాంనగర్ రిఫైనరీ నుంచి తయారైన జెట్ ఫ్యూయల్ కార్గో మొదటిసారిగా బ్రిటన్ కు చేరినట్లు నివేదికలో వివరించారు.
రష్యా పై కొనసాగుతున్న అంతర్జాతీయ ఆంక్షల మధ్య భారత్ సహా కొన్ని దేశాలు అక్కడి ముడి చమురును కొనుగోలు చేసి, తమ రిఫైనరీల్లో ప్రాసెస్ చేసి, వివిధ దేశాలకు ఉత్పత్తుల రూపంలో ఎగుమతి చేస్తున్నాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ విశ్లేషించింది. ఈ ధోరణి కారణంగా రష్యా నుంచి నేరుగా చమురు దిగుమతులు తగ్గించిన కొన్ని పాశ్చాత్య దేశాలు, పరోక్షంగా ఆ చమురు నుంచి తయారైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నాయనే అంశాన్ని నివేదిక ఉద్దేశించింది.
జూన్ నెల గణాంకాలు రష్యా చమురు సరఫరా శృంఖలలో భారత్ కీలక పాత్రను మరోసారి స్పష్టంచేశాయని, భవిష్యత్తులో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ఈ ధోరణి ప్రభావం ఎలా ఉండబోతుందో గమనించాల్సి ఉందని నివేదిక సూచించింది.







