బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#డిపోకు

8 articles

సెల్‌ఫోన్‌ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్‌ విధుల నుంచి తొలగింపు
జిల్లా వార్తలు

సెల్‌ఫోన్‌ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్‌ విధుల నుంచి తొలగింపు

పలమనేరు–మదనపల్లె మార్గంలో బస్సు నడుపుతూ సెల్‌ఫోన్‌ చూస్తూ ప్రయాణం కొనసాగించిన పలమనేరు డిపోకు చెందిన డ్రైవర్‌ కె. గణేష్‌కుమార్‌ను వీడియో ఆధారంగా గుర్తించి విధుల నుంచి వెంటనే తొలగించారు. ప్రయాణికుల భద్రతపై రాజీ ఉండదని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేయగా, ఇటువంటి నిర్లక్ష్యానికి పాల్పడే ఆర్టీసీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

1, ఆగ 2026

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
తెలంగాణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర విమర్శలు

బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. రైతుల పొలాలకు సాగునీరు ఇవ్వాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై స్పందించకుండా, అసభ్యకర పదజాలం, బెదిరింపులు ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. షాబాద్ ఘటనపై స్పందించకపోవడం, ప్రతిపక్షాల రక్తం పారిస్తామని మాట్లాడడం బాధాకరమని, రేవంత్ రెడ్డి ప్రజలకు, ప్రతిపక్షాలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

12, జులై 2026

నిర్లక్ష్యంగా నడిపిన బస్సు.. ప్రయాణికుణ్ని తొక్కి హతం చేసిన డ్రైవర్‌
నేరాలు

నిర్లక్ష్యంగా నడిపిన బస్సు.. ప్రయాణికుణ్ని తొక్కి హతం చేసిన డ్రైవర్‌

విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఒడిశా రాష్ట్రం గోవిందనగర్‌కు చెందిన బులు సాహు అనే ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు చక్రాలు అతని తలపైకి ఎక్కడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, డ్రైవర్‌ పులి లక్ష్మీవరప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

9, జులై 2026

తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు
జిల్లా వార్తలు

తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు

తిరుమల ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు సర్వీసులు అలిపిరి ఆర్టీసీ డిపో డ్రైవర్ల ఆందోళన కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రతి డ్యూటీలో ఐదు ట్రిప్పులు తప్పనిసరి చేసే యాజమాన్యం నిర్ణయాన్ని డ్రైవర్లు శారీరక, మానసిక ఒత్తిడి, ప్రమాదాల అవకాశాలు, బ్యాటరీ పరిమితులు వంటి కారణాలతో వ్యతిరేకిస్తున్నారు. దీంతో యాత్రికులు సాధారణ డీజిల్ బస్సులు, ఇతర వాహనాలపై ఆధారపడుతూ, సమస్య పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం–డ్రైవర్ల సంఘాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

7, జులై 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే....
క్రీడలు

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే....

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో నేడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లు అజేయ రికార్డులతో తలపడుతున్నాయి. ఆరుసార్లు టైటిల్‌ గెలుచుకున్న ఆస్ట్రేలియా ఏడో కిరీటాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, హోం‌ అడ్వాంటేజ్‌తో ఇంగ్లాండ్‌ గత పరాజయాల జ్ఞాపకాలను చెరిపేసి రెండోసారి చాంపియన్‌గా నిలవాలని చూస్తోంది. రెండు జట్లు సమతూక బలంతో ఉండటంతో ఫలితం ఏ దిశగా మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం.

5, జులై 2026

కుప్పంలో ఆధునిక బస్ స్టేషన్–డిపోకు శంకుస్థాపన
జిల్లా వార్తలు

కుప్పంలో ఆధునిక బస్ స్టేషన్–డిపోకు శంకుస్థాపన

చిత్తూరు జిల్లా కుప్పంలో ఆధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని, కొత్త ప్రాజెక్టుతో కుప్పం పట్టణం, పరిసర గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార అభివృద్ధి కలుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

4, జులై 2026

పుల్లంపేట వద్ద రోడ్డుప్రమాదం  ఇద్దరి మృతి, 15మందికి గాయాలు..
జిల్లా వార్తలు

పుల్లంపేట వద్ద రోడ్డుప్రమాదం ఇద్దరి మృతి, 15మందికి గాయాలు..

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. 15మంది తీవ్రంగా గాయపడ్డారు.

22, జూన్ 2026

కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుకు అగ్ని ప్రమాదం
తెలంగాణ

కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుకు అగ్ని ప్రమాదం

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలుగునూరు సమీపంలో కరీంనగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు శనివారం ఉదయం అకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్‌ అప్రమత్తంతో బస్సులో ఉన్న 41 మంది ప్రయాణికులను సమయానికి కిందకు దింపడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత విభాగాలు దర్యాప్తు చేపట్టగా, ఆర్టీసీకి లక్షల రూపాయల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

21, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters