బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పాకిస్తాన్

18 articles

యువత అసంతృప్తిని తేలికగా తీసుకుంటే ప్రమాదం: పాకిస్తాన్ హోం మంత్రి
అంతర్జాతీయం

యువత అసంతృప్తిని తేలికగా తీసుకుంటే ప్రమాదం: పాకిస్తాన్ హోం మంత్రి

పాకిస్తాన్ హోం మంత్రి మోసిన్ నఖ్వీ, దేశంలో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, అవినీతి కారణంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రభుత్వం తేలికగా తీసుకుంటే ప్రమాదమని హెచ్చరించారు. ప్రస్తుత పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, ప్రతిభ ఆధారిత ఉద్యోగాలు, సమాన అవకాశాలు కల్పించే విధంగా వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలని, కొత్త పరిపాలనా విభాగాలు, ప్రావిన్సులు ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజలకు దగ్గర చేయాలని ఆయన సూచించారు.

31, జులై 2026

బలూచిస్థాన్‌లో బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మైనర్ల మృతి
అంతర్జాతీయం

బలూచిస్థాన్‌లో బొగ్గు గనిలో పేలుడు.. 32 మంది మైనర్ల మృతి

పాకిస్తాన్‌ బలూచిస్థాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ వాయువు పేలుడు సంభవించి కనీసం 32 మంది మైనర్లు మృతిచెందగా, 29 మృతదేహాలను ఇప్పటివరకు బయటకు తీశారు. శిథిలాలు పేరుకుపోవడంతో రక్షణ చర్యలు కష్టంగా మారి, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రతా ప్రమాణాల అమలుపై ప్రశ్నలు తలెత్తడంతో ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

31, జులై 2026

‘పాకిస్తానీ కాశ్మీర్’ పద ప్రయోగంపై భారత్ అభ్యంతరం
జాతీయం

‘పాకిస్తానీ కాశ్మీర్’ పద ప్రయోగంపై భారత్ అభ్యంతరం

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌పై New York Times కథనంలో ‘‘Pakistani Kashmir’’ అనే పదాన్ని ఉపయోగించినందుకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతాన్ని ‘‘పాకిస్తానీ కాశ్మీర్’’గా పేర్కొనడం తప్పుదారి పట్టించే ప్రయత్నమని, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమేనని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్, లడఖ్ భారతదేశంలో విడదీయరాని భాగాలని భారత్ మరోసారి గుర్తుచేసింది.

30, జులై 2026

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉద్రిక్తతలు తీవ్రం
అంతర్జాతీయం

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉద్రిక్తతలు తీవ్రం

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రజలు ప్రభుత్వం, సైన్యం దమనకాండకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తుండగా, భద్రతా బలగాల కాల్పుల్లో ఇప్పటివరకు 80 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పాక్ ప్రభుత్వం నిర్వహించబోయే ఎన్నికలను PoK ప్రజలు బహిష్కరిస్తుండగా, గతంలో ముజాహిదీన్‌లుగా తయారు చేసిన శక్తులే ఇప్పుడు పాక్‌కు సవాలుగా మారాయని రాణా సనావుల్లా వ్యాఖ్యలు ఆ ప్రాంతంలో సంక్షోభం మరింత తీవ్రమైందని సూచిస్తున్నాయి.

29, జులై 2026

అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కోరిన పాకిస్తాన్
అంతర్జాతీయం

అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కోరిన పాకిస్తాన్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, అమెరికా నుంచి ఐదేళ్ల కాలపరిమితితో 10 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక ఆర్థిక సహాయాన్ని కోరింది. IMF, China, Saudi Arabia వంటి వనరులపై ఆధారపడుతున్న పాక్‌కు విదేశీ మారక నిల్వలు, కరెన్సీ స్థిరీకరణ, చెల్లింపుల సమతుల్యత సమస్యల పరిష్కారానికి ఈ సహాయం కీలకమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

22, జులై 2026

పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్‌ ప్రయత్నం..
అంతర్జాతీయం

పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్‌ ప్రయత్నం..

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్‌కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా ఇవ్వాలని అక్కడి అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. దీతో పాకిస్తాన్‌లో ఐదో ప్రావిన్స్‌గా రాజ్యాంగంలో చేర్చే దిశగా అడుగు పడగా, దీనిని భారత్ తన జమ్మూ కాశ్మీర్, లడఖ్‌పై సార్వభౌమాధికారానికి సవాలుగా చూస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేక నిరసనల నడుమ ఈ చర్య రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

17, జులై 2026

మధ్యవర్తి దేశాలపైనా ఇరాన్ దాడులు తీవ్రం..
అంతర్జాతీయం

మధ్యవర్తి దేశాలపైనా ఇరాన్ దాడులు తీవ్రం..

అమెరికా, ఇజ్రాయిల్‌లను ప్రధాన శత్రువులుగా చూస్తున్న ఇరాన్, ఇప్పుడు ఖతార్, పాకిస్తాన్, ఒమన్ వంటి మధ్యవర్తి, మిత్ర దేశాలపైనా క్షిపణి, డ్రోన్ దాడులు జరుపుతూ ఒత్తిడి పెంచుతోంది. గల్ఫ్ ప్రాంతంలో మధ్యవర్తిత్వం, రవాణా భద్రత దెబ్బతినడంతో పాటు, ఈ దాడులు కొనసాగితే ఇరాన్ అంతర్జాతీయ వేదికపై మరింత ఒంటరై, యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

17, జులై 2026

పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
అంతర్జాతీయం

పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రావల్ కోట్ ప్రాంతంలో పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు సాధారణ పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అక్కడి స్థానికుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది.

15, జులై 2026

సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే!  ..రంకెలేస్తున్న పాక్
అంతర్జాతీయం

సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే! ..రంకెలేస్తున్న పాక్

సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, నీటి ప్రవాహాన్ని ఆపడం లేదా మళ్లించడం యుద్ధ చర్యగా పరిగణిస్తామని NSC, సైన్యం హెచ్చరిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఒప్పందం నిలిపివేత, సింధు బేసిన్‌లో భారత్ వేగంగా జలవిద్యుత్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తుండటం, వ్యవసాయం పూర్తిగా సింధు నదిపై ఆధారపడిన పాకిస్తాన్‌లో భయాందోళనలను మరింత పెంచుతోంది.

7, జులై 2026

ప్లీజ్ మాకు సాయం చేయండి..  : భారత్‌ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీరీలు
అంతర్జాతీయం

ప్లీజ్ మాకు సాయం చేయండి.. : భారత్‌ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీరీలు

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీ్ర్(పీఓకే)లో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ అణచివేతకు నిరసనగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. రోజురోజుకు ఈ ఉద్యమం తీవ్రమవుతోంది. 26 రోజులుగా ప్రజలు పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు.

7, జులై 2026

పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 40 మంది మృతి
అంతర్జాతీయం

పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 40 మంది మృతి

పాకిస్తాన్‌లోని బలోచిస్థాన్‌ డాన సార్‌ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో కనీసం 40 మంది మృతిచెందారు. మార్గమధ్యంలో మరో వాహనంలోని ప్రయాణికులను కూడా ఎక్కించుకోవడంతో బస్సులో జనసంచారం ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెబుతూ, గల్లంతైన వారి కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.

3, జులై 2026

ఢిల్లీలో భారీ ఉగ్రదాడి యత్నం భగ్నం
జాతీయం

ఢిల్లీలో భారీ ఉగ్రదాడి యత్నం భగ్నం

ఢిల్లీలోభారీ ఉగ్రదాడి చేయాలనే కుట్రను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధానిపై ఉగ్రవాదులు పెద్ద స్థాయిలో దాడి చేయాలనే ప్రయత్నం చేసిన నేపథ్యంలో, స్పెషల్ సెల్ ముందస్తు చర్యలతో ఈ యత్నాన్ని అడ్డుకున్నట్లు సమాచారం.

2, జులై 2026

కరాచీ ఘటనపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్
అంతర్జాతీయం

కరాచీ ఘటనపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్

పాక్‌లోని కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయ ఏజెంట్ల హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం తీవ్రంగా ఖండించింది.

29, జూన్ 2026

సింధు జలాల వివాదం : నీటి కోసం పాకిస్తాన్ కొత్త వాదన..
అంతర్జాతీయం

సింధు జలాల వివాదం : నీటి కోసం పాకిస్తాన్ కొత్త వాదన..

భారత్ – పాకిస్థాన్ మధ్య ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సింధు జలాల వివాదం ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు కేవలం చట్టపరమైన, సాంకేతిక పరిధిలోనే సాగిన ఈ నీటి యుద్ధంలోకి పాకిస్థాన్ ఇప్పుడు ‘నాగరికత, సంస్కృతి’ అనే సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది.

24, జూన్ 2026

భారత్‌తో యుద్ధానికైనా రెడీ..  : పాక్ మంత్రి సంచలన ప్రకటన
అంతర్జాతీయం

భారత్‌తో యుద్ధానికైనా రెడీ.. : పాక్ మంత్రి సంచలన ప్రకటన

భారత్–పాకిస్తాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ చేసిన తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య కొత్త రాజకీయ, దౌత్య ఉద్రిక్తతలకు దారితీశాయి. సింధూ జలాల విషయంలో పాకిస్తాన్ హక్కులను దెబ్బతీసే ఏ చర్యనైనా తమ దేశం సహించదని, అవసరమైతే భారత్‌తో యుద్ధానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

22, జూన్ 2026

చేతులు కలిపిన అమెరికా-ఇరాన్‌!
అంతర్జాతీయం

చేతులు కలిపిన అమెరికా-ఇరాన్‌!

ఓవైపు హెచ్చరికలు, మరోవైపు శాంతి చర్చలు.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా-ఇరాన్‌ సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్విట్జర్లాండ్‌లో జరిగిన తొలి విడత చర్చల అనంతరం 60 రోజుల్లో తుది శాంతి ఒప్పందానికి చేరుకోవాలనే రోడ్‌మ్యాప్‌ను ఇరు దేశాలు ఆమోదించాయి. ఖతర్‌, పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో.. ఇందుకు ఇరు దేశాల ప్రతినిధులు చేతులు కలపడం గమనార్హం.

22, జూన్ 2026

చినాబ్–బియాస్ లింక్ ప్రాజెక్టు వైపు కేంద్రం… సింధు జలాల ఒప్పందం తర్వాత మరో వ్యూహాత్మక అడుగు
అంతర్జాతీయం

చినాబ్–బియాస్ లింక్ ప్రాజెక్టు వైపు కేంద్రం… సింధు జలాల ఒప్పందం తర్వాత మరో వ్యూహాత్మక అడుగు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై దౌత్య, వ్యూహాత్మక ఒత్తిడి పెంచే భాగంగా కేంద్రం చినాబ్–బియాస్ లింక్ ప్రాజెక్టును వేగవంతం చేయాలని చూస్తోంది. సుమారు రూ.2,300 కోట్ల వ్యయంతో ప్రతిపాదితమైన ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర భారత రాష్ట్రాలకు నీటి సరఫరా, సాగు, విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో పాటు, సింధు జలాల ఒప్పందంపై భారత్ కఠిన వైఖరిని మరింత బలపరచే సంకేతం ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

5, జూన్ 2026

ఫ్రాంచైజీ క్రికెట్‌ విస్తరణపై ఆందోళన వ్యక్తం చేసిన ICC
క్రీడలు

ఫ్రాంచైజీ క్రికెట్‌ విస్తరణపై ఆందోళన వ్యక్తం చేసిన ICC

దుబాయ్‌: ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్‌ల విస్తరణపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ఆందోళన వ్యక్తం చేసింది. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశంపై సభ్య బోర్డులతో కలిసి సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని ICC భావిస్తోంది. .

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters