రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: రాబోయే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మెగా టోర్నీల ఫార్మాట్లలో కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్లలో నాకౌట్ దశకు ముందు కొత్త రౌండ్లను ప్రవేశపెట్టాలని ఐసీసీ నిర్ణయించింది. టోర్నీలపై ఆసక్తిని పెంచడంతో పాటు జట్ల మధ్య పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చే లక్ష్యంతో ఈ మార్పులు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
2027 వన్డే ప్రపంచకప్లో సెమీఫైనల్స్కు ముందు ‘సూపర్-7’ దశను నిర్వహించనున్నారు. 2023 వన్డే ప్రపంచకప్లో 10 జట్లు పోటీపడగా, 2027 టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొననున్నాయి. వీటిలో 10 జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో నాలుగు జట్లు ఎంపికవుతాయి.
క్వాలిఫయర్స్ నుంచి 11వ స్థానంతో ప్రపంచకప్కు వచ్చే జట్టు నేరుగా గ్రూప్ దశలోకి ప్రవేశిస్తుంది. 12, 13, 14వ స్థానాలతో అర్హత సాధించిన జట్లు గ్రూప్ దశకు ముందు ‘సూపర్ సిరీస్’ రౌండ్ ఆడాల్సి ఉంటుంది. ఈ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు మాత్రమే గ్రూప్ దశకు చేరుతుంది.
గ్రూప్ దశలో మొత్తం 12 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడతాయి. ప్రతి గ్రూప్లో ఆరు జట్లు ఉండగా, అక్కడి నుంచి మూడు జట్లు చొప్పున మొత్తం ఆరు జట్లు సూపర్-7 దశకు అర్హత సాధిస్తాయి. అదనంగా, గ్రూప్ దశలో నాలుగో ఉత్తమ జట్టును ఎంపిక చేసి సూపర్-7లోకి పంపుతారు. ఈ దశలో అన్ని జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒకదానితో ఒకటి తలపడతాయి. సూపర్-7లో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు చేరుకుంటాయి.
ఈ ప్రపంచకప్కు సంయుక్త ఆతిథ్య దేశాలైన South Africa, Zimbabwe నేరుగా టోర్నీకి అర్హత పొందుతాయి. Namibia అసోసియేట్ సభ్యదేశం కావడంతో అర్హత టోర్నీ ద్వారా మాత్రమే ప్రపంచకప్లోకి ప్రవేశించాలి. South Africa, Zimbabweలను తప్పించి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఉన్న టాప్-8 జట్లు నేరుగా ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంటాయి.
టీ20 ఫార్మాట్లో కూడా ఐసీసీ మార్పులు చేసింది. 2028 టీ20 ప్రపంచకప్లో ఇప్పటి వరకు అమలులో ఉన్న సూపర్-8 విధానానికి బదులు ‘సూపర్-10’ దశను ప్రవేశపెట్టింది. మొదట 20 జట్లను ఐదు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్-10 దశకు అర్హత సాధిస్తాయి.
సూపర్-10లో 10 జట్లను రెండు గ్రూపులుగా విడగొడతారు. ప్రతి గ్రూప్లో ఐదు జట్లు ఉంటాయి. ఈ దశలో ప్రతి గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీఫైనల్స్కు చేరతాయి. మిగతా రెండు సెమీస్ బెర్తుల కోసం ప్రతి గ్రూప్లో రెండో స్థానంలో ఉన్న జట్లు ప్రత్యర్థి గ్రూప్లో మూడో స్థానంలో ఉన్న జట్లతో తలపడతాయి. ఈ నాకౌట్ మ్యాచ్ల్లో గెలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.
ఈ కొత్త ఫార్మాట్లతో వన్డే, టీ20 ప్రపంచకప్లు మరింత పోటీాత్మకంగా, ఆసక్తికరంగా మారనున్నాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.







