బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రేవంత్‌రెడ్డి

11 articles

వాళ్ల తప్పులు ప్రశ్నిస్తున్నందుకే నాపై కుట్రలు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ

వాళ్ల తప్పులు ప్రశ్నిస్తున్నందుకే నాపై కుట్రలు: సీఎం రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాజపా, బీఆర్‌ఎస్‌ పార్టీల తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్రలు జరుగుతున్నాయని కొడంగల్‌లో ఆరోపించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణపై బీఎల్‌ఏల సమావేశంలో మాట్లాడిన ఆయన, కొడంగల్‌లో 78 శాతం ఓటర్లు ఇప్పటికే నమోదు కాగా మిగిలిన 22 శాతం అర్హులైన ఓటర్లను ఈ నెలాఖరుకల్లా తప్పనిసరిగా నమోదు చేసి ఎస్‌ఐఆర్‌ను శాతం వందకు చేర్చాలని ఆదేశించారు.

22, జులై 2026

ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు నేతలు రావొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
తెలంగాణ

ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు నేతలు రావొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 3 వరకు నేతలు గాంధీభవన్‌కు రావొద్దని, పదవుల కోసం వచ్చే వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వకూడదని పార్టీ నేతలకు ఆదేశించారు. సర్‌ కార్యక్రమం అమలులో ఇన్‌ఛార్జి మంత్రులు, నేతలు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండి, వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించారు. బీఎల్‌ఏల రిపోర్టులకు ప్రాధాన్యం ఇచ్చి, పనితీరు ఆధారంగా ఈనెల 30న నేతలను సమీక్షించనున్నట్లు స్పష్టం చేశారు.

19, జులై 2026

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ‘హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌’ యాజమాన్యం
క్రీడలు

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ‘హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌’ యాజమాన్యం

టీజీ 20 లీగ్‌ తొలి సీజన్‌ విజేత ‘హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌’ యాజమాన్యం, జట్టు సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. జట్టు ప్రదర్శన, లీగ్‌ విజయవంతం, రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధిపై చర్చ జరగగా, ముఖ్యమంత్రి జట్టును అభినందించి నగదు బహుమతుల చెక్కులు అందజేశారు. ఈ లీగ్‌ ద్వారా స్థానిక యువ క్రికెటర్లకు పెద్ద వేదిక లభించిందని క్రీడా వర్గాలు అభిప్రాయపడ్డాయి.

17, జులై 2026

ఫ్యూచర్‌సిటీలో అమెజాన్‌ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
తెలంగాణ

ఫ్యూచర్‌సిటీలో అమెజాన్‌ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

హైదరాబాద్‌ ఫ్యూచర్‌సిటీలో అమెజాన్‌ కొత్త డేటా సెంటర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 202 ఎకరాల్లో నిర్మించనున్న ఈ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ కోసం అమెజాన్‌ వచ్చే 12 ఏళ్లలో రూ.60వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఫ్యూచర్‌సిటీ, చందనవెల్లి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు హైదరాబాద్‌ను గ్లోబల్‌ డేటా, క్లౌడ్‌ హబ్‌గా మరింత బలోపేతం చేయనుందని అధికారులు భావిస్తున్నారు.

15, జులై 2026

హైదరాబాద్‌కు ఎమిరేట్స్ A-380 సర్వీసులు.. తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు
తెలంగాణ

హైదరాబాద్‌కు ఎమిరేట్స్ A-380 సర్వీసులు.. తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, Emirates వైస్ ప్రెసిడెంట్ సమావేశంలో హైదరాబాద్‌కు Emirates A-380 సర్వీసులు, రాష్ట్రంలో రెండు కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, ఎంఆర్‌వో కార్యకలాపాలు, స్పోర్ట్స్ యూనివర్సిటీకి స్పాన్సర్‌షిప్ వంటి అంశాలపై ప్రాథమిక చర్చలు జరిగాయి. విమానయాన రంగ విస్తరణ, అంతర్జాతీయ కనెక్టివిటీ, పెట్టుబడుల అవకాశాలపై దృష్టి సారించిన ఈ చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉండగా, అధికారిక ప్రకటన ద్వారా మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.

12, జులై 2026

ఇరవై ఏళ్ల రాజకీయ ప్రయాణం.. జీవితంలో ప్రత్యేక అధ్యాయం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ

ఇరవై ఏళ్ల రాజకీయ ప్రయాణం.. జీవితంలో ప్రత్యేక అధ్యాయం: సీఎం రేవంత్‌రెడ్డి

తన ఇరవై ఏళ్ల రాజకీయ ప్రయాణం జీవితంలో ప్రత్యేక అధ్యాయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్ట్‌ ద్వారా పేర్కొన్నారు. సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన తన ప్రయాణం ప్రజల విశ్వాసంతో ముఖ్యమంత్రిగా, ‘రేవంతన్న’గా నిలిచిందని చెబుతూ, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసి, తెలంగాణ పునర్నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మరింత సేవ చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

4, జులై 2026

మాణిక్కం ఠాగూర్‌కు తమిళనాడు కాంగ్రెస్‌ పగ్గాలు
జాతీయం

మాణిక్కం ఠాగూర్‌కు తమిళనాడు కాంగ్రెస్‌ పగ్గాలు

తమిళనాడు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడిగా సీనియర్‌ నేత, ఎంపీ బీ మాణిక్కం ఠాగూర్‌ నియమితులయ్యారు.

28, జూన్ 2026

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభోత్సవం : హాజరైన ముగ్గురు సీఎంలు
జాతీయం

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభోత్సవం : హాజరైన ముగ్గురు సీఎంలు

కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌,  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు.

25, జూన్ 2026

ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభం
తెలంగాణ

ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభం

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. భవన నిర్మాణం, తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, వంటశాల వంటి సదుపాయాలను ఆయన పరిశీలించి, విద్యార్థులతో మమేకమై క్రీడల్లో పాల్గొన్నారు. ఈ పాఠశాల ద్వారా స్థానిక విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

17, జూన్ 2026

మొదట మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి
తెలంగాణ

మొదట మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొదట ‘మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి మాట్లాడండి’ అంటూ ప్రతి సవాల్ విసిరారు.

15, జూన్ 2026

వచ్చే 24 నెలలు రాజకీయాలకు బ్రేక్ : సీఎం రేవంత్ సందేశం
తెలంగాణ

వచ్చే 24 నెలలు రాజకీయాలకు బ్రేక్ : సీఎం రేవంత్ సందేశం

సైబరాబాద్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 1.34 కోట్ల మందికి మౌలిక వసతులు కల్పించేందుకు మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే 24 నెలలు రాజకీయాలకు పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని, కేసీఆర్ పదేళ్ల పాలన, మోదీ పన్నెండేళ్ల పాలన, తమ 30 నెలల పాలనపై తులనాత్మక చర్చకు సిద్ధమని పేర్కొన్నారు.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters