బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#విశాఖపట్నంలో

18 articles

విశాఖపట్నంలో స్వల్ప  భూకంపం
ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నంలో స్వల్ప భూకంపం

ఆదివారం తెల్లవారుజామున 5.08 గంటలకు విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించి, సాగర్ నగర్, పెదవాల్తేరు, గాజువాక తదితర ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బంగాళాఖాతంలో, కాకినాడకు సుమారు 225 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రం నమోదైందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టం సమాచారం లేకపోయినా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

12, జులై 2026

యువత పరిశోధనల వైపు అడుగులు వేయాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
రాజకీయాలు

యువత పరిశోధనల వైపు అడుగులు వేయాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్

యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్‌. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.

11, జులై 2026

దేశ ఆర్థిక స్థిరత్వానికి అండగా 'ఆపరేషన్ ఊర్జా సురక్ష'    :  రాజ్‌నాథ్ సింగ్
జాతీయం

దేశ ఆర్థిక స్థిరత్వానికి అండగా 'ఆపరేషన్ ఊర్జా సురక్ష' : రాజ్‌నాథ్ సింగ్

పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల నడుమ భారత నౌకాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. 18 నౌకల్లో రూ.9వేల కోట్ల సరకును సురక్షితంగా భారత్‌కు చేర్చిందని తెలిపారు.

11, జులై 2026

విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన
ఆంధ్రప్రదేశ్

విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజులపాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నేడు జరిగే JNTU స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేయనున్నారు. గవర్నర్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని జిల్లా పరిపాలన, పోలీసు శాఖలు భద్రతా, ట్రాఫిక్, ఇతర ఏర్పాట్లను కట్టుదిట్టం చేసి, వివిధ అధికారిక సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి.

11, జులై 2026

విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్లు   సీఎం బాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఆమోదం
రాజకీయాలు

విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్లు సీఎం బాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఆమోదం

వెలగపూడి సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు మెట్ట భూములకు ఎకరాకు రూ.40 వేల, జరీబు భూములకు రూ.60 వేల వార్షిక కౌలు పెంపు, నిర్వాసితులకు నెలకు రూ.10 వేల అద్దె సాయం, వ్యవసాయ రుణమాఫీ ప్రతిపాదనలపై ముందడుగు వేసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా ఫౌండేషన్, CII సహా పలు సంస్థలకు భూ కేటాయింపులు, SIPB ఆమోదించిన 11 మెగా ప్రాజెక్టులకు క్లియరెన్స్ ద్వారా రూ.9,076 కోట్ల పెట్టుబడులు, 10,531 ఉద్యోగాలు సృష్టించే దిశగా నిర్ణయాలు తీసుకోనుంది.

10, జులై 2026

రుషికొండ భవనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్

రుషికొండ భవనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన ఈ భవనాలను లీజుకు కేటాయించాలని నిర్ణయించిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ఆసక్తి వ్యక్తీకరణ (EOI) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

3, జులై 2026

విద్యార్థులు భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
జాతీయం

విద్యార్థులు భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

విశాఖపట్నంలో జరిగిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొని 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు, 13 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. గిరిజన సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన సాధనమని, విద్యార్థులు స్పష్టమైన భవిష్యత్‌ లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగుతూ నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని ఆమె సూచించారు.

30, జూన్ 2026

విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు రానున్న రాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్

విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు రానున్న రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు కేంద్ర విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు భారత రాష్ట్రపతి హాజరుకానున్నారు. జూన్ 30న విశాఖపట్నంలోని ట్రైబల్ యూనివర్శిటీ, జూలై 1న అనంతపురంలోని సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో స్నాతకోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్శనలు రాష్ట్ర ఉన్నత విద్యా రంగానికి కేంద్ర స్థాయిలో లభిస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయని విద్యా వర్గాలు భావిస్తున్నాయి.

29, జూన్ 2026

ఆర్ఆర్ఆర్ స్థలం కబ్జా యత్నం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం!
నేరాలు

ఆర్ఆర్ఆర్ స్థలం కబ్జా యత్నం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం!

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఒక ముఠా ప్రయత్నించడం సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

26, జూన్ 2026

ఏఐ మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్..   ట్యూషన్ టీచర్ అరెస్ట్
నేరాలు

ఏఐ మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. ట్యూషన్ టీచర్ అరెస్ట్

విశాఖపట్నంలో మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేసిన ట్యూషన్ టీచర్ షణ్ముఖ్ హితేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు చెందిన సాధారణ ఫొటోలను ఏఐ సహాయంతో నగ్నచిత్రాలుగా మార్ఫింగ్ చేసి, వాటిని చూపిస్తూ ఆమెను బెదిరించాడు.

22, జూన్ 2026

ఏపీఎల్‌ రెండో అంచెలో విజయవాడ సన్‌షైనర్స్‌ శుభారంభం
జిల్లా వార్తలు

ఏపీఎల్‌ రెండో అంచెలో విజయవాడ సన్‌షైనర్స్‌ శుభారంభం

ఏపీఎల్‌ రెండో అంచెలో కడపలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయవాడ సన్‌షైనర్స్‌ 19 పరుగుల తేడాతో తుంగభద్ర వారియర్స్‌పై విజయం సాధించింది. విశాఖపట్నంలో ముగిసిన తొలి అంచె తర్వాత కడప వేదికగా మారిన ఈ లీగ్‌ రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటూ, యువ క్రికెటర్లకు ప్రతిభ ప్రదర్శనకు మంచి అవకాశంగా మారుతోంది.

18, జూన్ 2026

నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నంలోని రాడిసన్ బ్లు రిసార్ట్ లో జరిగిన ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై నేతలు చర్చించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల ద్వారానే ఆంధ్రప్రదేశ్ పోటీ సామర్థ్యం పెరుగుతుందని, ఇందుకోసం ప్రత్యేక విధానాలు, శిక్షణ కార్యక్రమాలు, పరిశ్రమలు–విద్యాసంస్థల సమన్వయం అవసరమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిజిటల్ రంగం, సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా యువతకు అవకాశాలు సృష్టించడంలో ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ వంటి వేదికలు కీలకమని అభిప్రాయపడ్డారు.

13, జూన్ 2026

ఏపీ టూరిజానికి బిగ్ బూస్ట్‌: IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్

ఏపీ టూరిజానికి బిగ్ బూస్ట్‌: IATOతో చారిత్రాత్మక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, Indian Association of Tour Operators మధ్య అవగాహన ఒప్పందం కుదిరి, సెప్టెంబర్ 10-12 తేదీల్లో విశాఖపట్నంలో 41వ IATO వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. మంత్రి కందుల దుర్గేష్ ప్రకారం ఈ సదస్సుతో రాష్ట్ర పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుందని, స్థానిక టూర్ ఆపరేటర్లకు రాయితీల ద్వారా ఊరట లభిస్తుందని తెలిపారు.

10, జూన్ 2026

దర్యాప్తులో సంచల విషయాలు?  తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్

దర్యాప్తులో సంచల విషయాలు? తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. Argon గ్యాస్ లీక్, రసాయనిక ప్రతిచర్య, భారీ పేలుడు, 150 టన్నుల ద్రవ ఉక్కు పొంగిపడటం వంటి అంశాలు ప్రాథమిక నివేదికలో వెల్లడయ్యాయి. సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాల అమలు, మెటీరియల్ నాణ్యతపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగిస్తుండగా, కార్మిక సంఘాలు నిర్లక్ష్యం, నాసిరక మెటీరియల్ వినియోగంపై ఆరోపణలు చేస్తున్నాయి.

10, జూన్ 2026

కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం

విశాఖ ప్రమాదం నేపథ్యంలో కార్మిక సంఘాల నేతల రాజకీయీకరణపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విషాద సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోపే ప్రతి బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు జమ చేసే చర్యలు తీసుకున్నామని, ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం మాత్రమే కాక దీర్ఘకాలిక పునరావాసం, భవిష్యత్ భద్రతపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు.

9, జూన్ 2026

విశాఖ స్టీల్ ప్లాంట్  మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరామర్శ
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్ మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరామర్శ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ భరత్ తదితరులు కేజీహెచ్‌లో పరామర్శించి సానుభూతి తెలిపారు. బాధితులకు మెరుగైన పరిహారం, అన్ని విధాలా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు వెల్లడించాయి.

9, జూన్ 2026

కడపలో ఏపీఎల్‌ టీ20 క్రికెట్‌ సందడి
జిల్లా వార్తలు

కడపలో ఏపీఎల్‌ టీ20 క్రికెట్‌ సందడి

ఏపీఎల్‌–2026 ఐదో సీజన్‌లో రెండో విడత మ్యాచ్‌లు జూన్‌ 17 నుంచి 21 వరకు కడప వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో జరగనున్నాయి. ఏడు జట్లతో 32 మ్యాచ్‌ల టోర్నీలో తొమ్మిది లీగ్‌ మ్యాచ్‌లు కడపలో జరుగుతాయి. హనుమ విహారి , రికీ భూఈ, KS భారత్ వంటి ప్రముఖులతో పాటు యువ క్రికెటర్లు బరిలోకి దిగనుండగా, విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించి క్రికెట్‌ను మరింత చేరువ చేయాలని ఏసీఏ లక్ష్యంగా పెట్టుకుంది.

9, జూన్ 2026

మండుటెండలో ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కిన సీఎం బాబు   విశాఖలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు: సీఎం
రాజకీయాలు

మండుటెండలో ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కిన సీఎం బాబు విశాఖలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు: సీఎం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, నగరంలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఏయూ క్యాంపస్‌ను నెట్‌ జీరో లక్ష్యాలతో, సోలార్‌ ప్యానెల్స్‌, వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి వంటి చర్యలతో ఆదర్శ పచ్చని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం ఏయూ నుంచి నోవొటెల్ వరకు సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా సందేశం ఇచ్చారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters