బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఘటనలో

77 articles

కర్నూలులో టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
జిల్లా వార్తలు

కర్నూలులో టిప్పర్ ఢీకొని యువకుడి మృతి

కర్నూలు పట్టణంలో కొత్త అయ్యప్పస్వామి గుడి సమీపంలోని మలుపు వద్ద టిప్పర్ ఢీకొట్టడంతో బుధవారపేటకు చెందిన బంగి పరమేశ్ (25) మృతి చెందగా, అతని స్నేహితుడు గణేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. టిప్పర్ డ్రైవర్‌పై నిర్లక్ష్యంగా వాహనం నడిపిన కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదకర మలుపు వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, హెచ్చరిక బోర్డులు అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

8, ఆగ 2026

చిత్తూరు జిల్లా వీకోట ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళల మృతి
జిల్లా వార్తలు

చిత్తూరు జిల్లా వీకోట ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళల మృతి

చిత్తూరు జిల్లా వీకోట మండలం రామాపురం సమీపంలోని ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి వాస్తవ్యులైన గౌతమి, మానస అనే ఇద్దరు మహిళలు మృతి చెందగా, భర్త అనిల్‌తో పాటు మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న కారు టైర్ పంచర్ కావడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

7, ఆగ 2026

రాయచోటి వద్ద గంజాయి పట్టివేత: బీహార్ వ్యక్తి అరెస్ట్
జిల్లా వార్తలు

రాయచోటి వద్ద గంజాయి పట్టివేత: బీహార్ వ్యక్తి అరెస్ట్

అన్నమయ్య జిల్లా రాయచోటి వద్ద గంజాయి అక్రమ విక్రయంపై పోలీసులు దాడి చేసి బీహార్‌కు చెందిన హర్మోద్ కుమార్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 1.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా, మాదక ద్రవ్యాలపై సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, రాయచోటి పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

5, ఆగ 2026

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది దుర్మరణం
అంతర్జాతీయం

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది దుర్మరణం

పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

3, ఆగ 2026

బ్రహ్మపుత్ర నదిలో కడప జిల్లా IIT విద్యార్థిని గల్లంతు
జిల్లా వార్తలు

బ్రహ్మపుత్ర నదిలో కడప జిల్లా IIT విద్యార్థిని గల్లంతు

అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో కడప జిల్లా పెదముడియం మండలం కొట్టాల గ్రామానికి చెందిన గువాహటి IIT విద్యార్థిని చేతన గల్లంతయ్యింది. స్నేహితులతో కలిసి నది పరిసరాలు సందర్శిస్తుండగా బ్రహ్మపుత్రను ఆనుకుని ఉన్న ఇంటి నుంచి నదిని చూస్తున్న సమయంలో ఆ ఇల్లు అకస్మాత్తుగా నీటిలో కొట్టుకుపోయింది. చేతన కోసం అస్సాం పోలీసులు శోధక బృందాలతో గాలింపు కొనసాగిస్తుండగా, కుటుంబ సభ్యులు, స్థానికులు ఆత్రుతగా సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు.

2, ఆగ 2026

వరదలో కొట్టుకుపోయిన కారు.. తల్లీకూతుళ్ల మృతి
జాతీయం

వరదలో కొట్టుకుపోయిన కారు.. తల్లీకూతుళ్ల మృతి

మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.

31, జులై 2026

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట
రాజకీయాలు

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట

మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్‌ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

31, జులై 2026

పుత్తూరు రైలులో రూ.1.5 లక్షల నిషేధిత పొగాకు స్వాధీనం
జిల్లా వార్తలు

పుత్తూరు రైలులో రూ.1.5 లక్షల నిషేధిత పొగాకు స్వాధీనం

తిరుపతి జిల్లా పుత్తూరు ఆర్‌పీఎఫ్ ప్రత్యేక తనిఖీల్లో నగరి–తిరుత్తణి రైలు నెం.16058లో అక్రమంగా తరలిస్తున్న 63.5 కిలోల నిషేధిత పొగాకు ఉత్పత్తులను (499 ప్యాకెట్లు) స్వాధీనం చేసి, ఒడిశాకు చెందిన చిత్తరంజన్ మహాపాత్ర, తమిళనాడుకు చెందిన శరవణన్‌ను అదుపులోకి తీసుకుంది. ఆహార భద్రత శాఖ ఈ ఉత్పత్తుల విలువను రూ.1.5 లక్షలుగా అంచనా వేసి, నిబంధనల ఉల్లంఘనపై రూ.25 వేల జరిమానా విధించి, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తోంది.

30, జులై 2026

గుత్తి మండలంలో కారు దగ్ధం.. డ్రైవర్‌ సజీవ దహనం
జిల్లా వార్తలు

గుత్తి మండలంలో కారు దగ్ధం.. డ్రైవర్‌ సజీవ దహనం

అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు సమీపంలో లారీని ఢీకొన్న కారు మంటలకు ఆహుతై, డ్రైవర్‌ సజీవదహనమై మృతి చెందాడు. కారు పూర్తిగా దగ్ధమవడంతో వాహనం నంబరు, డ్రైవర్‌ వివరాలు గుర్తించడం కష్టంగా మారగా, గుత్తి సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ రామారావు కేసు నమోదు చేసి, ప్రమాద కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

30, జులై 2026

సుండుపల్లిలో ప్రైవేటు ఉద్యోగిపై దాడి, హత్యాయత్నం ఆరోపణలు
జిల్లా వార్తలు

సుండుపల్లిలో ప్రైవేటు ఉద్యోగిపై దాడి, హత్యాయత్నం ఆరోపణలు

వైఎస్సార్ జిల్లా సుండుపల్లిలో ఓ ప్రైవేటు ఉద్యోగిపై జరిగిన దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటనలో టీడీపీ నేత మహేష్ నాయుడు అనుచరులు పాల్గొన్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. బాధితుడు మహమ్మద్ ప్రస్తుతం కడపలోని RIMS ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

29, జులై 2026

అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు
జాతీయం

అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు

జమ్మూకశ్మీర్‌ గందర్‌బల్ జిల్లాలో ఇవాళ (మంగళవారం) ఉదయం అమర్‌నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తూ బస్సు అదుపుతప్పి ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు గాయపడ్డారు.

28, జులై 2026

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం: అభిమానులకు కీలక విజ్ఞప్తి
సినిమా

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం: అభిమానులకు కీలక విజ్ఞప్తి

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, అవసరమైనప్పుడు అధికారిక సమాచారం తమ నుంచే వస్తుందని ఎన్టీఆర్ బృందం అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటుండగా, షూటింగ్ షెడ్యూల్స్ మార్పుపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

28, జులై 2026

నంద్యాలలో పోలీసుల అప్రమత్తతతో తప్పిపోయిన చిన్నారి గుర్తింపు
జిల్లా వార్తలు

నంద్యాలలో పోలీసుల అప్రమత్తతతో తప్పిపోయిన చిన్నారి గుర్తింపు

నంద్యాల పట్టణంలోని వైఎస్సార్ నగర్‌కు చెందిన నాలుగేళ్ల ప్రణవి తప్పిపోయిన ఘటనలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ASP సుస్మిత ఆధ్వర్యంలో పోలీసులు రాత్రంతా విస్తృత గాలింపు నిర్వహించి ఆమెను తెల్లవారుజామున పొలాల్లో సురక్షితంగా గుర్తించారు. డయల్-112 ద్వారా తక్షణ సమాచారం అందించడంతో సీసీ కెమెరాలు, డ్రోన్, డాగ్ స్క్వాడ్ సహాయంతో చేపట్టిన చర్యలు ఫలించి చిన్నారిని తల్లికి క్షేమంగా అప్పగించారు.

27, జులై 2026

డ్రగ్స్ మత్తులో  కారుతో  పోలీసులపైకే..
నేరాలు

డ్రగ్స్ మత్తులో కారుతో పోలీసులపైకే..

డ్రగ్స్ కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులపై ఓ యువకుడు కారుతో దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. డ్రగ్స్ కొనుగోలు జరుగుతోందన్న సమాచారంతో నిఘా పెట్టిన హెచ్-న్యూ పోలీసులపై నిందితుడు కారును దూసుకెళ్లడంతో ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

27, జులై 2026

ఢిల్లీలో లాఠీఛార్జ్‌ ఘటనకు స్పందించిన సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
సినిమా

ఢిల్లీలో లాఠీఛార్జ్‌ ఘటనకు స్పందించిన సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్

పేపర్ లీక్ నిరసనల సందర్భంగా ఢిల్లీలో జరిగిన లాఠీఛార్జ్‌పై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇది శాంతియుతంగా సాగుతున్న ఉద్యమానికి హింసాత్మక మలుపు తిప్పిందని వ్యాఖ్యానించారు. పేపర్ లీక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే తీవ్రమైన సమస్య అని, మెరుగైన విద్యావ్యవస్థ కోసం దేశ యువత కలిసికట్టుగా పోరాడటం, తల్లిదండ్రుల అండతో చదువుకు పెరుగుతున్న ప్రాధాన్యత సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.

23, జులై 2026

రామగుండం ఎన్టీపీసీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం… నిలిచిన లారీని ఢీకొట్టిన డీసీఎం, ఇద్దరు మృతి
తెలంగాణ

రామగుండం ఎన్టీపీసీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం… నిలిచిన లారీని ఢీకొట్టిన డీసీఎం, ఇద్దరు మృతి

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ క్రషర్‌నగర్‌ వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చత్తీస్‌గఢ్‌ నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్‌ నిలిచివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్‌, క్లీనర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల గుర్తింపు, డీసీఎం తీసుకువస్తున్న సరుకు వివరాలు, లారీ నిలిపిన విధానం, అతివేగం కారణమా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

22, జులై 2026

అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి.. పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి
జాతీయం

అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి.. పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకొని బుధవారం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆషిఖ్‌ హుస్సేన్‌ ప్రాణాలు కోల్పోయారు.

22, జులై 2026

సిక్కిం సొరంగ దుర్ఘటనలో 20 మంది మృతి
జాతీయం

సిక్కిం సొరంగ దుర్ఘటనలో 20 మంది మృతి

సిక్కిం నామ్‌చీ జిల్లాలో తీస్తా స్టేజ్-6 హైడ్రోపవర్ ప్రాజెక్టు సొరంగం కూలిన ఘటనలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందగా, మరో ఐదుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. రాళ్లలోని మీథేన్ వాయువు ఆకస్మిక పేలుడు కారణంగా సొరంగం కూలి విషపూరిత వాయువులు వ్యాపించాయని అధికారులు నిర్ధారించారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం ప్రకటించగా, ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.

22, జులై 2026

మణికొండలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. ఫ్యాకల్టీ వేధింపులపై సూసైడ్ నోట్ కలకలం
తెలంగాణ

మణికొండలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. ఫ్యాకల్టీ వేధింపులపై సూసైడ్ నోట్ కలకలం

హైదరాబాద్ మణికొండలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో బీటెక్ సెకండియర్ విద్యార్థిని శ్రేయ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో వాసవి ఇంజినీరింగ్ కాలేజీ ఫ్యాకల్టీ నిరంతర వేధింపులు, అవమానాలు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడంతో విద్యార్థి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

21, జులై 2026

సిక్కింలో కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి
జాతీయం

సిక్కింలో కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి

సిక్కింలో భారీ విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్‌దుంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు.

21, జులై 2026

నాగాలాండ్‌లో విరిగిపడ్డ భారీ కొండచరియలు : నలుగురు మృతి
జాతీయం

నాగాలాండ్‌లో విరిగిపడ్డ భారీ కొండచరియలు : నలుగురు మృతి

నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రహదారి రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలాల తొలగింపు, చిక్కుకున్న వారి రక్షణ, మృతుల గుర్తింపు పనులు కొనసాగుతుండగా, ఇంకా వర్షాలు కొనసాగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు.

20, జులై 2026

సముద్రంలో స్నానానికి దిగి ఇద్దరి మృతి.. మరొకరు గల్లంతు
నేరాలు

సముద్రంలో స్నానానికి దిగి ఇద్దరి మృతి.. మరొకరు గల్లంతు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు బీచ్‌లో స్నానానికి దిగిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. మాచవరానికి చెందిన సూదా అరవింద్‌ వెంకటసాయి, మంచాల షణ్ముఖ్‌ శ్రీరాం మృతదేహాలను మత్స్యకారులు వెలికితీశారు. మంచాల నాగసాయి సత్యభాస్కర్‌ కోసం పోలీసులు, మత్స్యకారులు గాలింపు కొనసాగిస్తుండగా, ఈ ఘటనతో మాచవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

20, జులై 2026

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
నేరాలు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన ఘటనలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడికి ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిస్తుంది.

20, జులై 2026

పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..ముగ్గురు విద్యార్థులు మృతి..
నేరాలు

పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..ముగ్గురు విద్యార్థులు మృతి..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

17, జులై 2026

అమెరికాలో భారతీయ ముస్లింపై కత్తి దాడి కలకలం
అంతర్జాతీయం

అమెరికాలో భారతీయ ముస్లింపై కత్తి దాడి కలకలం

అమెరికాలో జాతి, మత వివక్ష మరోసారి భయానక రూపం దాల్చింది. ఉటా రాష్ట్రంలోని ఒక షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న భారతీయ ముస్లింను గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో పొడవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. "మీరు ముస్లిమా?" అని ప్రశ్నించిన ఆ వ్యక్తి, "అవును" అనే సమాధానం వచ్చిన వెంటనే దాడికి దిగడం అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

16, జులై 2026

విశాఖలో అలల ఉధృతికి బోటు బోల్తా..  ఆందోళనలో మత్స్యకారులు
ఆంధ్రప్రదేశ్

విశాఖలో అలల ఉధృతికి బోటు బోల్తా.. ఆందోళనలో మత్స్యకారులు

విశాఖపట్నం హార్బర్ సమీపంలో చేపల వేటకు వెళ్లిన బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.

16, జులై 2026

పాకిస్థాన్ బన్ను జిల్లాలో ఉగ్రవాదుల దాడి కలకలం
అంతర్జాతీయం

పాకిస్థాన్ బన్ను జిల్లాలో ఉగ్రవాదుల దాడి కలకలం

పాకిస్థాన్ కైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్ను జిల్లా మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 14 మంది పోలీసులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ ప్రకటించగా, ఘటన తర్వాత ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొని, భద్రతా దళాలు ముట్టడి చేసి శోధన చర్యలను కఠినతరం చేశాయి.

16, జులై 2026

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం, ఇద్దరి మృతి
జాతీయం

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం, ఇద్దరి మృతి

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్‌ 66లో మముర గ్రామంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఛార్జింగ్‌ సమయంలో మంటలు చెలరేగి బహుళ అంతస్తుల భవనానికి వ్యాపించడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 100 మందిని భవనం నుంచి ఖాళీ చేయగా, పొగను పీల్చుకోవడంతో ఒక మహిళ సహా ఇద్దరు మృతి చెందారు. నిర్లక్ష్యంపై పోలీసులు కేసు నమోదు చేసి, ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ సమయంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

15, జులై 2026

తిరుపతిలో మేస్త్రీపై దారుణ హత్యాయత్నం కేసు ఛేదన
జిల్లా వార్తలు

తిరుపతిలో మేస్త్రీపై దారుణ హత్యాయత్నం కేసు ఛేదన

తిరుపతి నగరంలో మేస్త్రీ దాసరి శ్రీనివాసులుపై మద్యం సేవిస్తున్న సమయంలో బైక్‌ ఇవ్వనందుకు ఇద్దరు యువకులు బీరు సీసాలు, బండరాయితో పాశవికంగా దాడి చేసిన కేసును పోలీసులు ఛేదించారు. దాడి వీడియో చిత్రీకరణ, ఆధారాల నాశనంలో సహకరించిన జయవేలు రాజతో పాటు ఉప్పుసెట్టి ఆకాష్‌, రాఘవేంద్రను అరెస్టు చేసి, ద్విచక్ర వాహనం, మూడు చరవాణులను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

15, జులై 2026

ప్రభుత్వ నిర్లక్ష్యమే మత్స్యకారుల ప్రాణాలు బలిగొంది :  మాజీ సీఎం వైయ‌స్ జగన్
రాజకీయాలు

ప్రభుత్వ నిర్లక్ష్యమే మత్స్యకారుల ప్రాణాలు బలిగొంది : మాజీ సీఎం వైయ‌స్ జగన్

విశాఖ బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి, ఈ దుర్ఘటనలో ప్రభుత్వ స్పందన తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.

14, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters