బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నష్టం

48 articles

నాసిక్‌లో స్వల్ప భూకంపం, ప్రజల్లో ఆందోళన
జాతీయం

నాసిక్‌లో స్వల్ప భూకంపం, ప్రజల్లో ఆందోళన

మహారాష్ట్ర నాసిక్‌లో గురువారం తెల్లవారుజామున 3.8 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించగా, ఎలాంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తినష్టం నమోదు కాలేదు. అకస్మాత్తుగా వచ్చిన ప్రకంపనలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, అధికారులు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

30, జులై 2026

అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు
జాతీయం

అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు

జమ్మూకశ్మీర్‌ గందర్‌బల్ జిల్లాలో ఇవాళ (మంగళవారం) ఉదయం అమర్‌నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తూ బస్సు అదుపుతప్పి ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు గాయపడ్డారు.

28, జులై 2026

ఆటో–మినీ ట్రక్ ఢీకొని 10 మంది కూలీలకు గాయాలు
జిల్లా వార్తలు

ఆటో–మినీ ట్రక్ ఢీకొని 10 మంది కూలీలకు గాయాలు

JMD మండలం గొరిగెనూరు సమీపంలో కూలీలను తీసుకెళ్తున్న ఆటో, ఎదురుగా వచ్చిన మినీ ట్రక్ ఢీకొనడంతో ఆటోలో ఉన్న 10 మంది కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు JMD ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అందరి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

25, జులై 2026

భారీ నష్టాలతో కొనసాగుతున్న దేశీయ సూచీలు
బిజినెస్

భారీ నష్టాలతో కొనసాగుతున్న దేశీయ సూచీలు

దేశీయ సూచీలకు నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటడం సూచీలకు తీవ్ర ప్రతికూలంగా మారింది.

24, జులై 2026

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి.

23, జులై 2026

అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు  : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జాతీయం

అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పేపర్ లీక్ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు.

23, జులై 2026

యువత భవిష్యత్తును నాశనం చేశారు..: ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ తీవ్ర విమర్శలు
జాతీయం

యువత భవిష్యత్తును నాశనం చేశారు..: ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ తీవ్ర విమర్శలు

'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. అంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.

23, జులై 2026

దిష్టిబొమ్మలు తగలబెట్టినా నాకు నష్టం లేదు:  అంబటి రాంబాబు స్పందన
ఆంధ్రప్రదేశ్

దిష్టిబొమ్మలు తగలబెట్టినా నాకు నష్టం లేదు: అంబటి రాంబాబు స్పందన

ఎమ్మార్పీఎస్ నాయకులు తన దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసనలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ, తాను హోంమంత్రి వంగలపూడి అనితపై కులదూషణ చేయలేదని, పరుష పదజాలం ఉపయోగించలేదని స్పష్టం చేశారు. దిష్టిబొమ్మలు తగలబెట్టడం వల్ల తనకు ఎలాంటి నష్టం లేదని, అనితకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, అయితే తన వ్యాఖ్యల వల్ల మందకృష్ణ మాదిగ బాధపడి ఉంటే ఆయనకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

22, జులై 2026

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు..
బిజినెస్

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు..

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర తిరిగి 90 డాలర్లు దాటింది. ప్రస్తుతం 1.2 శాతం పెరిగి 92 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.

22, జులై 2026

వరి సాగులో తెగుళ్లకు చెక్ పెట్టి దిగుబడులు పెంచండి
వ్యవసాయం

వరి సాగులో తెగుళ్లకు చెక్ పెట్టి దిగుబడులు పెంచండి

వ్యవసాయ నిపుణులు వరి పంటలో అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగు, సుడిదోమ వంటి తెగుళ్లను ముందుగానే గుర్తించి నియంత్రిస్తే దిగుబడులు పెరుగుతాయని సూచిస్తున్నారు. నీటి నిర్వహణ, క్రమం తప్పని పర్యవేక్షణతో పాటు త్రిసైక్లోజాలే లేదా కార్బెన్డజిమ్ పిచికారీ, విత్తన శుద్ధి, సరైన ఎరువుల వినియోగం, సమగ్ర యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే తెగుళ్ల ప్రభావం తగ్గి వరి పంటను రక్షించుకోవచ్చని వారు పేర్కొన్నారు.

21, జులై 2026

ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డులో వర్షానికి వేరుశనగ పంట నష్టం
జిల్లా వార్తలు

ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డులో వర్షానికి వేరుశనగ పంట నష్టం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డులో ఆదివారం కురిసిన వర్షంతో 15,757 బస్తాల్లో 4,727 క్వింటాళ్ల వేరుశనగ పంట తీవ్ర నష్టానికి గురైంది. యార్డులో షెడ్లు, సరైన డ్రైనేజ్‌ లేకపోవడంతో వర్షపు నీరు, డ్రైన్‌ నీరు బస్తాల్లోకి చేరి పంట నాణ్యత దెబ్బతినడంతో పాటు కొంత భాగం కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

20, జులై 2026

పాకిస్థాన్ బన్ను జిల్లాలో ఉగ్రవాదుల దాడి కలకలం
అంతర్జాతీయం

పాకిస్థాన్ బన్ను జిల్లాలో ఉగ్రవాదుల దాడి కలకలం

పాకిస్థాన్ కైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్ను జిల్లా మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 14 మంది పోలీసులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ ప్రకటించగా, ఘటన తర్వాత ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొని, భద్రతా దళాలు ముట్టడి చేసి శోధన చర్యలను కఠినతరం చేశాయి.

16, జులై 2026

నందనవనంలో భారీ అగ్నిప్రమాదం
తెలంగాణ

నందనవనంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ మీర్‌పేట్ నందనవనంలో మెట్రో బార్ సమీపంలోని ప్లాస్టిక్ గోదాంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని సమీప గోదాం, పక్క ఇళ్లను కూడా మంటలు ఆవరించాయి. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, భారీ ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం, మంటల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

15, జులై 2026

పారాక్వాట్ గడ్డిమందుపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం
వ్యవసాయం

పారాక్వాట్ గడ్డిమందుపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం

కేంద్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందుపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధిస్తూ జూలై 14 నుంచి అమల్లోకి వచ్చేలా ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. కీటకనాశన చట్టం 1968 ప్రకారం దిగుమతి, తయారీ, రవాణా, పంపిణీపై పూర్తి నిషేధం ఉండగా, కంపెనీల అభ్యంతరాల కోసం ఆగస్టు 13 వరకు గడువు ఇచ్చింది. పారాక్వాట్ వల్ల వేలాది మంది రైతులు మృతి చెందడం, దీనికి నిర్దిష్ట విరుగుడు లేకపోవడం వైద్యులు, నిపుణుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

15, జులై 2026

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 561.46 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో 77,054.94 వద్ద, నిఫ్టీ 158.95 పాయింట్లు లేదా 0.66 శాతం నష్టంతో 24,052.05 వద్ద నిలిచాయి.

14, జులై 2026

రష్యాకు మరో దెబ్బ.. సిజ్రాన్‌ చమురు రిఫైనరీపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి
అంతర్జాతీయం

రష్యాకు మరో దెబ్బ.. సిజ్రాన్‌ చమురు రిఫైనరీపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి

రష్యాలోని సమర రీజియన్‌లో ఉన్న సిజ్రాన్‌ చమురు రిఫైనరీపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో భారీ నష్టం జరిగి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచాయి. అజోవ్‌ సముద్రంలో చమురు రవాణా చేస్తున్న ట్యాంకర్లు, ఫెర్రీలు, లూబ్రికెంట్‌ ఆయిల్‌ రైలు వంటి ఇంధన వసతులపై వరుస దాడుల వల్ల రష్యా చమురు శుద్ధి సామర్థ్యం 20–40% వరకు తగ్గి, ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

12, జులై 2026

జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లో క్లౌడ్ బరస్ట్‌ కలకలం..
జాతీయం

జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లో క్లౌడ్ బరస్ట్‌ కలకలం..

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో క్లౌడ్ బరస్ట్‌ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి హోటళ్లు, ఇళ్లు, రోడ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దెబ్బతిన్నాయి. ఆర్మీ, పోలీసు, BSF, జిల్లా అధికారులు తక్షణమే రెస్క్యూ, రిలీఫ్ పనులు ప్రారంభించి పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వర్షాలు, ల్యాండ్‌స్లైడ్‌ ప్రమాదం దృష్ట్యా స్థానికులు, పర్యాటకులు నదులు, వాగుల దగ్గరికి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

12, జులై 2026

హార్ట్‌అటాక్‌లను ముందుగానే గుర్తించే ‘ఏఐ స్కిన్‌ ప్యాచ్‌’
ఆరోగ్యం

హార్ట్‌అటాక్‌లను ముందుగానే గుర్తించే ‘ఏఐ స్కిన్‌ ప్యాచ్‌’

షికాగో University శాస్త్రవేత్తలు గుండె సంబంధిత సమస్యలను సెకనులోని వందోవంతు సమయంలోనే అత్యంత కచ్చితత్వంతో గుర్తించే ‘ఏఐ స్కిన్‌ ప్యాచ్‌’ను అభివృద్ధి చేశారు. శరీరానికి అతుక్కునే ఈ మృదువైన ప్యాచ్‌లోని ‘ఆర్గానిక్‌ ఎలక్ట్రో కెమికల్‌ ట్రాన్సిస్టర్స్‌’ గుండె స్పందనలో సూక్ష్మ మార్పులను 99 శాతం కచ్చితత్వంతో విశ్లేషించి, అదనపు సర్వర్ల అవసరం లేకుండా వెంటనే వైద్యులకు సమాచారం పంపి హార్ట్‌అటాక్‌, వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ వంటి ప్రాణాంతక పరిస్థితులను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి.

12, జులై 2026

చాదర్‌ఘాట్‌ మూసీ ఒడ్డున అగ్నిప్రమాదం.. రూ.70 లక్షల ఆస్తినష్టం
తెలంగాణ

చాదర్‌ఘాట్‌ మూసీ ఒడ్డున అగ్నిప్రమాదం.. రూ.70 లక్షల ఆస్తినష్టం

చాదర్‌ఘాట్‌ మూసీ ఒడ్డున శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించి, డెకరేషన్‌ యూనిట్లు, వాహనాల విడిభాగాల దుకాణాలు, వర్క్‌షాపులు సహా సుమారు 10–15 షెడ్లు దగ్ధమయ్యాయి. రూ.60–70 లక్షల ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తుండగా, ప్రాణనష్టం ఏదీ జరగలేదు. సుమారు 300 మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

11, జులై 2026

ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు..
జాతీయం

ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు..

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, గుజరాత్‌లోని సూరత్, ఉత్తర్ ప్రదేశ్‌లలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల జనజీవనం అతలాకుతలమైంది, పలువురు మృతి చెందగా రహదారులు, విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నాయి. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించి, Char Dham Yatraకు అంతరాయం కలిగించి, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

10, జులై 2026

మహారాష్ట్రలో భూకంపం  రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రతగా 4.6 గా నమోదు
జాతీయం

మహారాష్ట్రలో భూకంపం రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రతగా 4.6 గా నమోదు

మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత హింగోలి, నాందేడ్, పర్భనీ జిల్లాలలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రగా 4.6 గా నమోదైంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించనట్లు తెలుస్తోంది.

9, జులై 2026

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు .. రూ.8లక్షల కోట్లు ఆవిరి
బిజినెస్

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు .. రూ.8లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఒక్క ప్రకటనతో సూచీలు అమాంతం పతనమయ్యాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 2 శాతానికి పైగా కుంగాయి. ఈ అనూహ్య పరిణామాలతో దాదాపు రూ.8లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది.

8, జులై 2026

విశాఖ శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధం
ఆంధ్రప్రదేశ్

విశాఖ శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధం

విశాఖపట్నం శాంతిపురం వద్ద కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా బస్సు ఆపి ప్రయాణికులను దిగిపోవాలని హెచ్చరించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు, ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు.

8, జులై 2026

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. నౌకలపై ఇరాన్ దాడులు
అంతర్జాతీయం

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. నౌకలపై ఇరాన్ దాడులు

హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ కార్ప్స్ గార్డ్స్ దాడులు చేసింది.

7, జులై 2026

శ్రీలంక జైలులో ఘర్షణలు.. 25 మంది మృతి
అంతర్జాతీయం

శ్రీలంక జైలులో ఘర్షణలు.. 25 మంది మృతి

శ్రీలంక నెగోంబో జైలులో మాదక ద్రవ్యాల వ్యవహారంపై రెండు ఖైదీ గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగి భారీ అల్లర్లకు దారితీసి, మృతుల సంఖ్య 25కి చేరగా మరో 100 మంది గాయపడ్డారు. అధిక జనసాంద్రత, భద్రతా లోపాలు, అంతర్గత విభేదాలు ఈ ఘటనకు కారణమని అధికారులు, విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలను పెంచి, డ్రోన్‌లు, హెలికాప్టర్‌ను మోహరించి, సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

6, జులై 2026

పులివెందులలో వైద్యం వికటించి 11 ఏళ్ల బాలిక మృతి
జిల్లా వార్తలు

పులివెందులలో వైద్యం వికటించి 11 ఏళ్ల బాలిక మృతి

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో 11 ఏళ్ల మోక్షిత అనే బాలిక వైద్యం వికటించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న ఘటనలో మృతి చెందింది. కడుపునొప్పితో రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఆమెకు ఇంజెక్షన్‌ ఇచ్చిన తర్వాత పరిస్థితి విషమించి కడపలో మరణించగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టగా, పోలీసులు దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

3, జులై 2026

పెట్రో ధరలు ఇప్పుడే తగ్గించలేము : కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ
బిజినెస్

పెట్రో ధరలు ఇప్పుడే తగ్గించలేము : కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ

ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ అన్నారు.

2, జులై 2026

ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య
జిల్లా వార్తలు

ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య

మండల పరిధిలోని తాళ్లప్రొద్దుటూరుకు చెందిన పెద్దిరెడ్డి (60) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎస్సై మంజునాథ తెలిపారు.

1, జులై 2026

నాఫ్తా పైప్‌లైన్ పేలుడు: 20 మంది గాయాలు
జాతీయం

నాఫ్తా పైప్‌లైన్ పేలుడు: 20 మంది గాయాలు

పుర్బా మిద్నాపూర్‌లోని హల్దియా పెట్రోకెమికల్స్‌కు చెందిన నాఫ్తా పైప్‌లైన్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించి 20 మంది గాయపడ్డారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ప్రభావంతో హల్దియా మున్సిపాలిటీ 13వ వార్డులో ఇళ్లకు, నిర్మాణాలకు నష్టం జరిగి, రైల్వే సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. నాఫ్తా చోరీ ప్రయత్నం సమయంలోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తూ, సాంకేతిక నిపుణులతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

30, జూన్ 2026

మామిడి రైతులను ఆదుకుంటాం! : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాజకీయాలు

మామిడి రైతులను ఆదుకుంటాం! : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్‌‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఏడాది మామిడి రైతులకు సుమారు రూ.190 కోట్లు చెల్లించి ప్రభుత్వం ఆదుకుందన్నారు.

30, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters