బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#తీసుకుంది

86 articles

బద్వేల్ లో స్టీమ్ బియ్యం విక్రయాలు ప్రారంభం
జిల్లా వార్తలు

బద్వేల్ లో స్టీమ్ బియ్యం విక్రయాలు ప్రారంభం

ఎల్‌నినో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరట కల్పించేందుకు ప్రతి కార్డుకు 10 కిలోల బియ్యాన్ని మార్కెట్ ధరల కంటే తక్కువకు రైతుబజారు కేంద్రాల్లో విక్రయించాలని నిర్ణయించింది. బద్వేలు రైతుబజారులో స్టీమ్ బియ్యం కిలోను రూ.52కు, సాధారణ బియ్యం కిలోను రూ.50కు విక్రయాలు ప్రారంభమయ్యాయి. అధికారులు ఈ చర్యతో కరువు సమయంలో ప్రజల ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.

9, ఆగ 2026

కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ: తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల
తమిళనాడు

కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ: తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల

కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ తగిలింది. కావేరీ జల నిర్వహణ అథారిటీ, కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ జూలై 29 నుంచి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కర్ణాటకలో, ముఖ్యంగా మాండ్యలో ఆందోళనలు ఉద్ధృతమవగా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం కోసం చర్చించాలని నిర్ణయించారు.

31, జులై 2026

UPIలో ప్రైవసీకి కొత్త కవచం: ఫోన్ నంబర్‌కి బదులు చివరి నాలుగు అంకెలే దర్శనం
టెక్నాలజీ

UPIలో ప్రైవసీకి కొత్త కవచం: ఫోన్ నంబర్‌కి బదులు చివరి నాలుగు అంకెలే దర్శనం

NPCI, UPI చెల్లింపుల్లో యూజర్ల ప్రైవసీ బలోపేతం కోసం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై UPI లావాదేవీల్లో పూర్తి ఫోన్ నంబర్‌కి బదులు చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేలా, అలాగే ఫోన్ నంబర్ ఆధారిత UPI IDల స్థానంలో యూజర్ నేమ్ ఆధారిత IDలను ప్రోత్సహించాలనే సూచనలు చేసింది. బ్యాంకులు, UPI యాప్ సంస్థలు నిర్దేశిత గడువులోపు సాంకేతిక మార్పులు పూర్తి చేయాలి.

29, జులై 2026

కొత్తపల్లె గ్రామసభకు భారీ బందోబస్తు
జిల్లా వార్తలు

కొత్తపల్లె గ్రామసభకు భారీ బందోబస్తు

కొత్తపల్లె గ్రామపంచాయితీని సమీప మున్సిపాలిటీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై గ్రామస్థులలో అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడటంతో మంగళవారం జరిగే గ్రామసభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ASP విభుకృష్ణ పర్యవేక్షణలో రూరల్ సీఐ నాగభూషణ్ ఆధ్వర్యంలో అదనపు పోలీసు బలగాలు, బ్యారికేడ్లు, వాహనాల నియంత్రణ వంటి చర్యలు తీసుకుని, ప్రజల అభిప్రాయాలను సేకరించే ఈ సమావేశం ప్రశాంతంగా ముగిసేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

29, జులై 2026

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేర్లు స్వయంచాలకంగా నమోదు అవుతాయి, రూ.10 లక్షల లోపు విలువైన భూములకు స్టాంప్ డ్యూటీని రూ.100గా తగ్గించారు. వీలునామా లేకుండా జరిగే బదలాయింపుల్లో Family Member Certificate తప్పనిసరి చేసి, నకిలీ క్లెయిమ్‌లు, ఆలస్యాలు తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

29, జులై 2026

ఇంటి నిర్మాణ సామాగ్రి సరఫరా బంద్‌! : విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు..
బిజినెస్

ఇంటి నిర్మాణ సామాగ్రి సరఫరా బంద్‌! : విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు..

తమిళనాడులో టీవీకే విజయ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగానికి కీలకమైన రఫ్ స్టోన్, ఎం-శాండ్, మెటల్ జెల్లీ వంటి నిర్మాణ సామగ్రిని పొరుగు రాష్ట్రాలకు తరలించడంపై తమిళనాడు ప్రభుత్వం మూడు నెలలు తాత్కాలిక నిషేధం విధించింది.

29, జులై 2026

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ :  వెంటనే తొలగించాలని ఆదేశం.!
తెలంగాణ

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ : వెంటనే తొలగించాలని ఆదేశం.!

హైదరాబాద్‌ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ‘హైడ్రా’ కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. వరుస కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

27, జులై 2026

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం
జాతీయం

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం

దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా మరో వీడియో రిలీజ్ చేశారు.

26, జులై 2026

మైనర్ బాలిక కిడ్నాప్ కేసు ఛేదన: ముగ్గురు నిందితుల అరెస్ట్
జిల్లా వార్తలు

మైనర్ బాలిక కిడ్నాప్ కేసు ఛేదన: ముగ్గురు నిందితుల అరెస్ట్

అనంతపురం జిల్లా రాప్తాడు పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు వేగంగా ఛేదించి, ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాలికను సురక్షితంగా రక్షించి తల్లిదండ్రుల సంరక్షణలోకి అప్పగించగా, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇటువంటి నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

25, జులై 2026

ఇన్సూరెన్స్ డబ్బులతో తండ్రి చికిత్స చేయించాలని సూసైడ్ లెటర్‌లో యువతి విజ్ఞప్తి
జిల్లా వార్తలు

ఇన్సూరెన్స్ డబ్బులతో తండ్రి చికిత్స చేయించాలని సూసైడ్ లెటర్‌లో యువతి విజ్ఞప్తి

తిరుపతి జిల్లాలో ANM‌గా పనిచేస్తున్న సాయిచందన (27) తండ్రి అనారోగ్య చికిత్స కోసం ఇన్సూరెన్స్ డబ్బులు వినియోగించాలని సూసైడ్ లెటర్ రాసి కార్యాలయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రూ.60 లక్షల ఇన్సూరెన్స్ పాలసీపై క్లెయిమ్ సులభం కావడానికి తన మరణాన్ని పాముకాటు లేదా కరెంట్ షాక్‌గా నమోదు చేయాలని లేఖలో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వైద్య ఖర్చుల అంశాలను పరిశీలిస్తున్నారు.

24, జులై 2026

ఆగస్టు 1 నుండి రైతు బజార్లలో సబ్సిడీ బియ్యం విక్రయం
ఆంధ్రప్రదేశ్

ఆగస్టు 1 నుండి రైతు బజార్లలో సబ్సిడీ బియ్యం విక్రయం

ఆగస్టు 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్‌లెట్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ బియ్యం విక్రయించనున్నారు. ఆధార్, బయోమెట్రిక్ విధానాలతో పారదర్శకంగా పంపిణీ చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా చర్యలు తీసుకున్నారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి రావడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

24, జులై 2026

గోదావరి పుష్కరాల కోసం రూ.150 కోట్లకు పరిపాలనా అనుమతి
ఆంధ్రప్రదేశ్

గోదావరి పుష్కరాల కోసం రూ.150 కోట్లకు పరిపాలనా అనుమతి

గోదావరి పుష్కరాలు–2027 విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.150 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు, కొవ్వూరు, నర్సాపురం తదితర మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించి ఘాట్ల అభివృద్ధి, రహదారి, పార్కింగ్, పారిశుద్ధ్య, తాగునీరు, వైద్య, భద్రతా ఏర్పాట్లకు వినియోగించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

23, జులై 2026

రెవెన్యూ శాఖ ఆధునికీకరణకు ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఉద్యోగాలు

రెవెన్యూ శాఖ ఆధునికీకరణకు ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధునికీకరణకు భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 53 ఇ-డివిజనల్ మేనేజర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆర్‌డీఓ, CCLA కార్యాలయాల్లో పనిచేసే ఈ సిబ్బంది ద్వారా డిజిటల్ సేవల విస్తరణ, భూ రికార్డుల పారదర్శక నిర్వహణ, రీసర్వే, రిజిస్ట్రేషన్ వ్యవస్థల్లో సాంకేతికత వినియోగాన్ని బలోపేతం చేయడంతో పాటు, ఇప్పటివరకు అనధికారికంగా పనిచేస్తున్న ఐటీ సిబ్బందికి అధికారిక గుర్తింపు లభించనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

22, జులై 2026

కరోనా రక్కసి.. 26కి చేరిన పాజిటివ్ కేసులు..
ఆరోగ్యం

కరోనా రక్కసి.. 26కి చేరిన పాజిటివ్ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కు చేరింది. ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, వారంతా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 10 జిల్లాలకు వైరస్ విస్తరించగా, ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యశాఖ సూచిస్తోంది.

22, జులై 2026

మణికొండలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. ఫ్యాకల్టీ వేధింపులపై సూసైడ్ నోట్ కలకలం
తెలంగాణ

మణికొండలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. ఫ్యాకల్టీ వేధింపులపై సూసైడ్ నోట్ కలకలం

హైదరాబాద్ మణికొండలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో బీటెక్ సెకండియర్ విద్యార్థిని శ్రేయ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో వాసవి ఇంజినీరింగ్ కాలేజీ ఫ్యాకల్టీ నిరంతర వేధింపులు, అవమానాలు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడంతో విద్యార్థి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

21, జులై 2026

NBK111 షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం
సినిమా

NBK111 షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం

NBK111 చిత్రీకరణలో కాకినాడ పోర్ట్‌లో యాక్షన్‌ సన్నివేశం సమయంలో నందమూరి బాలకృష్ణ మోకాలికి స్వల్ప గాయం అయ్యింది. సెట్లో జరిగిన ప్రమాదంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం బాలకృష్ణ అక్కడే విశ్రాంతి తీసుకుంటుండగా, ప్రమాదం వివరాలు, తదుపరి షూటింగ్‌ షెడ్యూల్‌పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

21, జులై 2026

శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో ప్రసాదాల ఆఫ్‌లైన్ విక్రయాలకు అనుమతి
జిల్లా వార్తలు

శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో ప్రసాదాల ఆఫ్‌లైన్ విక్రయాలకు అనుమతి

శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో ఇప్పటివరకు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతున్న ప్రసాదాల విక్రయాలకు దేవాదాయ శాఖ ఆఫ్‌లైన్ అనుమతిని కూడా ఇచ్చింది. ఇకపై భక్తులు నేరుగా ఆలయ ప్రసాద కౌంటర్ల వద్ద నగదు చెల్లించి ప్రసాదాలు పొందవచ్చు. ఈ మార్పుతో సాంకేతిక సమస్యలు, ముందస్తు బుకింగ్ ఇబ్బందులు తగ్గి, భక్తులకు సేవల అందుబాటు మరింత విస్తరించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.

21, జులై 2026

‘సర్‌ప్రైజ్‌ ఇస్తానంటూ’ ఉరేసుకుని బాలిక ఆత్మహత్య
నేరాలు

‘సర్‌ప్రైజ్‌ ఇస్తానంటూ’ ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

ఛత్రపురం ఠాణా పరిధిలో 12 ఏళ్ల బాలిక తమ్ముడితో రూ.30 విషయంలో జరిగిన చిన్న గొడవ అనంతరం ఇంటి పెరట్లోని నిర్మాణంలో ఉన్న గదిపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మరణించగా, తల్లి హైదరాబాద్‌లో వలస కార్మికురాలిగా పనిచేస్తుండగా, పెద్ద తాతయ్య ఇంట్లో తమ్ముడితో కలిసి ఉంటూ చదువుకుంటున్న ఆమె మృతి స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ పరిస్థితులు, బాలిక మానసిక స్థితిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

20, జులై 2026

డార్క్ ప్యాటర్న్స్‌పై స్పైస్‌జెట్‌కు సీసీపీఏ రూ. లక్ష జరిమానా
బిజినెస్

డార్క్ ప్యాటర్న్స్‌పై స్పైస్‌జెట్‌కు సీసీపీఏ రూ. లక్ష జరిమానా

సీసీపీఏ విచారణలో స్పైస్‌జెట్ ఫ్లైట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో ముందే టిక్ చేసిన చెక్‌బాక్స్‌లు, డిఫాల్ట్ సెట్టింగ్‌ల ద్వారా వినియోగదారుల స్పష్టమైన సమ్మతి లేకుండానే SpiceClub లాయల్టీ ప్రోగ్రామ్, ప్రమోషనల్ సేవలకు చేర్చినట్లు తేలింది. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే ఈ డార్క్ ప్యాటర్న్స్ కారణంగా సంస్థపై రూ. లక్ష జరిమానా విధించి, సమ్మతి ప్రక్రియను పారదర్శకంగా మార్చాలని ఆదేశించింది.

18, జులై 2026

పునర్విభజనపై ఒంటరిగా ముందుకు! : పార్టీ ఎంపీలతో డీఎంకే అధినేత అత్యవసర సమావేశం
తమిళనాడు

పునర్విభజనపై ఒంటరిగా ముందుకు! : పార్టీ ఎంపీలతో డీఎంకే అధినేత అత్యవసర సమావేశం

దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై డీఎంకే పార్టీ కీలకమైన, స్వతంత్ర నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్‌తో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే, సొంతంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది.

17, జులై 2026

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్‌
జాతీయం

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్‌

దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైష్‌ ఏ మహ్మద్‌ (JeM)తో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్ట్‌ చేసింది.

17, జులై 2026

డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తాం.. : శివసేన(యూబీటీ)
జాతీయం

డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తాం.. : శివసేన(యూబీటీ)

ఇన్నాళ్లు బిల్లుకు మద్దతు ఇవ్వమని భీష్మించుకుని ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రైత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొచ్చని చెప్పారు.

16, జులై 2026

లోక్‌సభలో స్మార్ట్ వాచీలు, పెన్ కెమెరాలకు నో ఎంట్రీ
జాతీయం

లోక్‌సభలో స్మార్ట్ వాచీలు, పెన్ కెమెరాలకు నో ఎంట్రీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ సచివాలయం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాలు వంటి ఆడియో, వీడియో రికార్డింగ్ సామర్థ్యం ఉన్న పరికరాలను సభలోకి తీసుకురావడాన్ని నిషేధించింది. సభ్యుల వ్యక్తిగత గోప్యత, భద్రతను కాపాడటం, సభా కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేందుకు ఈ నియమాలు అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

16, జులై 2026

రూ.2.19 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…
జాతీయం

రూ.2.19 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…

కేంద్ర కేబినెట్‌ మొత్తం రూ.2.19 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి, సెమీకాన్‌ 2.0 పథకానికి రూ.1.27 లక్షల కోట్లు, మొబైల్‌ తయారీ స్కీమ్‌కు రూ.62,500 కోట్లు కేటాయించింది. దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో భారత్‌ స్థాయిని బలోపేతం చేయడం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు, స్థానిక విలువ జోడింపును పెంచడం ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యాలుగా అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

15, జులై 2026

ఫీజు రెగ్యులేటరీ కమిటీ సభ్యుల నియామకానికి  ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్

ఫీజు రెగ్యులేటరీ కమిటీ సభ్యుల నియామకానికి ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ (APHEFRMC) సభ్యుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసి, పదవీకాలాన్ని మూడు సంవత్సరాలు లేదా 70 ఏళ్ల వయస్సు వరకు, ఏది ముందుగా వస్తే అది వర్తించేలా నిర్ణయించింది. ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసి, 2019 చట్టం ఆధారంగా ఉన్నత విద్యా సంస్థల ఫీజు నిర్మాణాన్ని సమీక్షించి, అధిక ఫీజుల భారాన్ని తగ్గిస్తూ పారదర్శక నియంత్రణ వ్యవస్థను బలపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

15, జులై 2026

హైదరాబాద్‌లో చెరువుల అభివృద్ధికి పునరుత్తేజం
తెలంగాణ

హైదరాబాద్‌లో చెరువుల అభివృద్ధికి పునరుత్తేజం

హైదరాబాద్‌లోని Fox Sagar, Aminpur, Ambir, Saroor Nagar చెరువులను Hussain Sagar తరహాలో ట్యాంక్‌బండ్లు, నడక మార్గాలు, వినోద, పర్యాటక మౌలిక వసతులతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.536 కోట్ల సమగ్ర ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. IIT Hyderabad సహకారంతో మూడు దశల్లో అమలు చేసే ఈ ప్రణాళిక ద్వారా చెరువుల శుభ్రత, కాలుష్య నియంత్రణతో పాటు పచ్చదనం, పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు ఆరోగ్యకరమైన విశ్రాంతి వాతావరణం కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.

15, జులై 2026

దాతలకు తిరుమలలో కొత్త రూల్స్‌.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
రాజకీయాలు

దాతలకు తిరుమలలో కొత్త రూల్స్‌.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

తిరుమలలో సామాన్య భక్తుల దర్శనాలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దాతలకు కల్పించే సౌకర్యాలను హేతుబద్ధీకరిస్తూ కొత్త డోనర్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర వెల్లడించారు.

14, జులై 2026

తెలంగాణలోత్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ

తెలంగాణలోత్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం పాత కాగితం రేషన్ కార్డులకు బదులుగా పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనుంది. తొలి దశలో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియను దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఆధార్ అనుసంధానం, క్యూఆర్ కోడ్, భద్రతా లక్షణాలతో నకిలీ కార్డులు, డూప్లికేట్ లబ్ధిదారుల సమస్యలను తగ్గించి పేద కుటుంబాలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.

14, జులై 2026

ఏపీలో ‘సర్’ గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ‘సర్’ గడువు పొడిగింపు

ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పొడిగించింది. నేటితో గడువు ముగియనుండగా.. మరో 10 రోజుల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

14, జులై 2026

తెలంగాణలో మరో రెండు  ఎయిర్‌పోర్ట్‌లు
తెలంగాణ

తెలంగాణలో మరో రెండు ఎయిర్‌పోర్ట్‌లు

కేంద్ర పౌర విమానయాన శాఖ తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ను 2028 జూన్ 2 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని టెర్మినల్ భవనం టెండర్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్‌లో డిఫెన్స్-సివిలియన్ ఎయిర్‌పోర్ట్, అలాగే దేశవ్యాప్తంగా ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగించడం ద్వారా ప్రాంతీయ విమాన కనెక్టివిటీ బలోపేతం కానుంది.

14, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters