బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#తృణమూల్

25 articles

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
జాతీయం

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

28, జులై 2026

అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా..
రాజకీయాలు

అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీఎంసీ రెబల్ ఎంపీలకు ప్రత్యేక టేబుల్ కేటాయించడంపై ఇండియా కూటమి పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వాకౌట్ చేశాయి. అధికారిక గుర్తింపు లేని NCPI పార్టీ ఎంపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడాన్ని ప్రతిపక్షం ప్రశ్నించగా, కొంతసేపు గందరగోళం తర్వాత తిరిగి సమావేశంలో పాల్గొని వర్షాకాల బిల్లులు, చర్చలపై సమన్వయం కొనసాగించారు.

19, జులై 2026

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?
జాతీయం

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు మళ్లీ చర్చకు రావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

16, జులై 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
జాతీయం

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టీఎంసీకి చెందిన రూ. 440.42 కోట్ల నిధులు ఉన్న మూడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫ్రీజ్ చేసింది.

9, జులై 2026

నన్ను ఆపాలంటే చంపాలి.. :      టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

నన్ను ఆపాలంటే చంపాలి.. : టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయగా, తాజగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రెబల్ వర్గంపై తీవ్రంగా స్పందించారు.

5, జులై 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా రాజీనామా
జాతీయం

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా రాజీనామా

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ ఊపుడు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలైన బెంగాల్ టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా భట్టాచార్య తన పదవికి, అలాగే పార్టీలోని అన్ని రకాల బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ హఠాత్ పరిణామం టీఎంసీ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.

4, జులై 2026

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?
జాతీయం

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాజకీయంగా కలకలం రేపుతున్న రెండు విలీన వివాదాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

4, జులై 2026

మమతా బెనర్జీకి ఈసీ లేఖ..   4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
జాతీయం

మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో కొనసాగుతున్న అంతర్గత రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. పార్టీ అసలు నాయకత్వం విషయంలో మమతా బెనర్జీ వర్గం, రితబ్రత బెనర్జీ వర్గం పరస్పరం విభిన్న వాదనలు వినిపిస్తుండటంతో భారత ఎన్నికల సంఘం (ECI) జోక్యం చేసుకుంది.

3, జులై 2026

మమతా బెనర్జీపైనే వేటు?:  టీఎంసీ తిరుగుబాటు వర్గం బాస్‌గా అరూప్ రాయ్
జాతీయం

మమతా బెనర్జీపైనే వేటు?: టీఎంసీ తిరుగుబాటు వర్గం బాస్‌గా అరూప్ రాయ్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై పట్టు కోసం సాగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది.

23, జూన్ 2026

సంకెళ్ల నుంచి బెంగాల్‌ విముక్తి పొందింది: ప్రధాని మోదీ
జాతీయం

సంకెళ్ల నుంచి బెంగాల్‌ విముక్తి పొందింది: ప్రధాని మోదీ

బెంగాల్‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, గత ప్రభుత్వాల పాలనలో బందీగా ఉన్న బెంగాల్‌ ఇప్పుడు సంకెళ్ల నుంచి బయటపడిందని, సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తోందని అన్నారు. కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌లను ప్రజలు తిరస్కరించారని, భారత్–బంగ్లాదేశ్‌ సరిహద్దు భద్రతను బలోపేతం చేయడంలో ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

20, జూన్ 2026

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్
జాతీయం

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ రథిన్ బసు తీసుకున్న నిర్ణయంపై తాత్కాలిక నిలుపుదల చేయాలని అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

18, జూన్ 2026

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. బీజేపీ వైపు చూస్తోన్న ఎంపీలు!
జాతీయం

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. బీజేపీ వైపు చూస్తోన్న ఎంపీలు!

దేశంలో ప్రస్తుతం ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారీ చీలిక జరిగింది. అనంతరం మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు షిండే వర్గంలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ వంతు వచ్చింది. యూపీలో కూడా సమాజ్‌వాదీ పార్టీ నుంచి భారీ చీలిక జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.

17, జూన్ 2026

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్
జాతీయం

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్

తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న వేళ భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ మమతాబెనర్జీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేత 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆమె, ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

16, జూన్ 2026

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ
జాతీయం

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ

టీఎంసీ రెబల్‌ ఎంపీలు నేడు ఢిల్లీలో సమావేశం కానుండగా, 15న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీకి సిద్ధమవుతున్నారు. రెబల్‌ శిబిరంలో సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ చేరడంతో అసంతృప్త ఎంపీల సంఖ్య 20కి పెరిగి, పార్టీ అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇదిలా ఉండగా, అక్రమ లావాదేవీల కేసులో అభిషేక్‌ బెనర్జీకి సీఐడీ మళ్లీ సమన్లు జారీ చేసి, ఆయన నివాసంలో సోదాలు జరపడంతో టీఎంసీపై దర్యాప్తు ఒత్తిడి పెరిగింది.

14, జూన్ 2026

టీఎంసీ విలీనం ప్రచారం నిరాధారం: కేసీ వేణుగోపాల్
జాతీయం

టీఎంసీ విలీనం ప్రచారం నిరాధారం: కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం జరుగుతుందనే ప్రచారం పూర్తిగా పుకార్లేనని, అలాంటి చర్చలు లేదా ప్రతిపాదనలు లేవని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, అధికారికంగా ప్రకటించని విషయాలను నిజాలుగా తీసుకుని ప్రచారం చేయడం తగదని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు తమ తమ స్వతంత్ర వ్యూహాలతోనే ముందుకు సాగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

11, జూన్ 2026

మమతా బెనర్జీని మోసం చేయలేను : శతృఘ్న సిన్హా
జాతీయం

మమతా బెనర్జీని మోసం చేయలేను : శతృఘ్న సిన్హా

తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు జోరు మధ్యలో కూడా తాను మమతా బెనర్జీకి అండగా నిలుస్తానని, టీఎంసీని విడిచిపెట్టే ప్రశ్నే లేదని శతృఘ్న సిన్హా స్పష్టం చేశారు. అసన్ సోల్ ఎంపీగా గెలిపించిన ప్రజలకు, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన మమతా బెనర్జీకి నిబద్ధుడిగా ఉంటానని, తిరుగుబాటు ఎంపీలు, BJP ఆహ్వానాలను తిరస్కరించినట్లు తెలిపారు.

11, జూన్ 2026

తృణమూల్‌లో కల్లోలం: అభిషేక్‌పై కల్యాణ్‌ బెనర్జీ మండిపాటు
జాతీయం

తృణమూల్‌లో కల్లోలం: అభిషేక్‌పై కల్యాణ్‌ బెనర్జీ మండిపాటు

తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అభిషేక్ బనెర్జీ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కళ్యాణ్ బనెర్జీ, తనను అవమానించారని ఆరోపిస్తూ మమతా బనెర్జీ ముందే ఆమె ఎవరిపక్షంలో ఉన్నారో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ బారైక్ రాజీనామా చేయడంతో పార్టీ బలం తగ్గి, తృణమూల్‌ భవిష్యత్తుపై ప్రశ్నలు మరింతగా ముదురుతున్నాయి.

11, జూన్ 2026

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామా
జాతీయం

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామా

టీఎంసీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామాలతో మమతా బెనర్జీ నాయకత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే 19 మంది లోకసభ ఎంపీలు, సుమారు 64 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తగా, టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని సోనియాగాంధీ ప్రతిపాదించగా, దీనిపై స్పందించేందుకు కొంత సమయం కావాలని మమతా కోరినట్టు సమాచారం.

11, జూన్ 2026

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. జోరుగా చర్చలు
జాతీయం

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. జోరుగా చర్చలు

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఎదురవుతున్న సంక్షోభం మధ్య, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశంపై జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇండియా కూటమి సమావేశం, ఢిల్లీలో టీఎంసీ ఎంపీలు–రాహుల్ గాంధీ భేటీతో ఈ ఊహాగానాలు బలపడినా, ఇరు పార్టీలు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. మమతా బెనర్జీ సానుకూలంగా ఉన్నారనే సమాచారం ఉన్నప్పటికీ, విలీనంపై స్పష్టత కోసం వేచి చూడాల్సి ఉంది.

11, జూన్ 2026

మమతకు మరో షాక్ .. తృణమూల్ కు మరో ఎంపీ రాజీనామా
జాతీయం

మమతకు మరో షాక్ .. తృణమూల్ కు మరో ఎంపీ రాజీనామా

టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా చేయడం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ వారంలో రాజీనామా చేసిన రెండో రాజ్యసభ సభ్యురాలిగా ఆమె నిలవగా, ఇప్పటికే తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీఎంసీ అంతర్గత సంక్షోభం మరింత తీవ్రమవుతున్న సంకేతంగా ఈ పరిణామాన్ని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

10, జూన్ 2026

తృణమూల్ కార్యాలయానికి సీఐడీ
జాతీయం

తృణమూల్ కార్యాలయానికి సీఐడీ

ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ బృందం ఖాళీఘాట్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్లగా, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ లు లేరనే కారణంతో లోపలికి అనుమతించలేదని సమాచారం. అభిషేక్ బెనర్జీకి జారీ చేసిన నోటీసు గడువు ముగిసినా ఆయన విచారణకు హాజరుకాలేదని, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకత్వ నియామకాల పత్రాలపై నకిలీ సంతకాల ఆరోపణలపై కేసు కొనసాగుతోంది.

9, జూన్ 2026

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు
జాతీయం

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు

పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతకు, ఇప్పుడు లోక్‌సభ ఎంపీల నుంచి కూడా సవాల్‌ ఎదురైంది. పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించి, ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఇదే సమయంలో, తృణమూల్‌ రాజ్యసభ సభ్యుడు సుకేందు శంకర్‌ రాయ్‌ పార్టీ, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ, మమతా గత ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, RG Kar ఆస్పత్రి ఘటనపై ప్రశ్నలు లేవనెత్తినందుకు తనను పక్కన పెట్టారని ఆరోపించారు.

9, జూన్ 2026

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ
రాజకీయాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ

తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం తీవ్రంగా ముదిరి, లోక్‌సభలో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడే ప్రయత్నాలు ప్రారంభించారు. సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా, రితబ్రతకు మద్దతు, అలాగే కాకోలి ఘోష్ దస్తిదార్ సహా సుమారు 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు నిర్ణయంతో టీఎంసీ భవిష్యత్ రాజకీయ దిశపై జాతీయ స్థాయిలో చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

8, జూన్ 2026

ఆపరేషన్‌ బెంగాల్‌ వేగం పెరిగింది
జాతీయం

ఆపరేషన్‌ బెంగాల్‌ వేగం పెరిగింది

న్యూఢిల్లీ లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ నివాసంలో సువేందు ఆధికారితో టీఎంసీ ఎంపీలు సమావేశం కావడం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీలో చీలిక సంకేతాలుగా భావిస్తున్నారు. 20 మందికి పైగా ఎంపీలు సువేందు టచ్‌లో ఉన్నారని, వీరు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరే యోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

8, జూన్ 2026

ఆ పార్టీల మధ్య ఐక్యత ఏదీ?
జాతీయం

ఆ పార్టీల మధ్య ఐక్యత ఏదీ?

జూన్ 8, న్యూ ఢిల్లీలో INDIA కూటమి కీలక సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంటు వర్షాకాల సమావేశ వ్యూహం, రాబోయే ఎన్నికల ప్రణాళికలతో పాటు కూటమి అంతర్గత విభేదాల పరిష్కారం, సంయుక్త ప్రచార కార్యక్రమాలపై చర్చించి, సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన వెలువడే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters