బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#విపత్తు

15 articles

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో వర్షాలు: పలు జిల్లాలకు APSDMA హెచ్చరికలు
వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో వర్షాలు: పలు జిల్లాలకు APSDMA హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో APSDMA పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉండగా, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA హెచ్చరించింది.

5, ఆగ 2026

వాతావరణ ఆధారిత పంటల బీమా పథకానికి చివరి తేదీ జూలై 31
వ్యవసాయం

వాతావరణ ఆధారిత పంటల బీమా పథకానికి చివరి తేదీ జూలై 31

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (RWBCIS) కింద అర్హులైన రైతులు తమ పంటలను జూలై 31, 2026 లోపు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని సూచించింది. వర్షాభావం, అధిక వర్షాలు, గాలివానలు, వడగండ్ల వానల వంటి వాతావరణ కారణాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ పొందేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని, గడువు లోపు బీమా చేయించుకున్న పంటలకే ప్రయోజనాలు వర్తిస్తాయని శాఖ స్పష్టం చేసింది.

30, జులై 2026

అస్సాంలో వరద విపత్తు: మృతుల సంఖ్య 78కి పెరుగుదల
జాతీయం

అస్సాంలో వరద విపత్తు: మృతుల సంఖ్య 78కి పెరుగుదల

అస్సాంలో వరదలతో మృతుల సంఖ్య 78కి చేరగా, ఏడు జిల్లాల్లో 3 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు, 551 గ్రామాలు, 21,523 హెక్టార్ల వ్యవసాయ భూములు నీటమునిగాయి. చరాయిదేవు, శివసాగర్, జోర్హాట్ జిల్లాలు అత్యంత తీవ్రంగా దెబ్బతినగా, పునరావాస కేంద్రాలు, సహాయ కేంద్రాల ద్వారా వేలాది మందికి ఆశ్రయం, నిత్యావసరాలు అందిస్తున్నారు. మరోవైపు IMD జులై 30–ఆగస్టు 1 మధ్య అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో భారీ వర్షాల హెచ్చరికతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, విపత్తు నిర్వహణ సంస్థలు అదనపు బృందాలను సిద్ధంగా ఉంచాయి.

30, జులై 2026

రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు..
వాతావరణం

రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు..

రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ హెచ్చరించాయి. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండి చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని సూచించారు.

21, జులై 2026

ఏపీలో నాలుగు రోజుల పాటు మేఘావృత వాతావరణం, పలుచోట్ల వర్షాలు
వాతావరణం

ఏపీలో నాలుగు రోజుల పాటు మేఘావృత వాతావరణం, పలుచోట్ల వర్షాలు

రానున్న నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో మేఘావృత వాతావరణం కొనసాగి, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వాతావరణ మార్పులు, ఉరుములు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

19, జులై 2026

జమ్మూకశ్మీర్ రాజౌరీలో వరదలు..   వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
జాతీయం

జమ్మూకశ్మీర్ రాజౌరీలో వరదలు.. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దర్హాలీ సహా ప్రధాన నదులు ఉగ్రరూపం దాల్చడంతో రక్షణ గోడలు దెబ్బతిని వాహనాలు, ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, భారీ ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టం లేకుండా ఉండేందుకు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.

19, జులై 2026

రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం
వాతావరణం

రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం

రాష్ట్రంలో వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం, కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

17, జులై 2026

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు  : మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు : మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అనేక మంది మత్స్యకారులు చనిపోయారని అన్నారు.

14, జులై 2026

కేరళలో భారీ వర్షాలు
జాతీయం

కేరళలో భారీ వర్షాలు

కేరళలోని వయనాడ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. రహదారి మార్గాలు దెబ్బతినడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు అంతరాయం కలిగింది. స్థానిక పరిపాలన, పోలీసు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందాలు కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి, పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.

7, జులై 2026

యూపీ మధుర జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి
జాతీయం

యూపీ మధుర జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి

ఉత్తర్‌ప్రదేశ్ మధుర జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రక్కు, బస్సు ఢీకొని నలుగురు ప్రయాణికులు మృతిచెందారు.

30, జూన్ 2026

వెనెజువెలా జంట భూకంపాలు.. 40వేల మంది గల్లంతు
అంతర్జాతీయం

వెనెజువెలా జంట భూకంపాలు.. 40వేల మంది గల్లంతు

వెనెజువెలాలో సెకన్ల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాల వల్ల కనీసం 235 మంది మృతి, 4,300 మంది గాయాలు కాగా, దాదాపు 40వేల మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. రాజధాని కారకాస్‌తో పాటు లా గువేరా నగరంలో వందలాది భవనాలు కూలిపోగా, శిథిలాల తొలగింపు, చిక్కుకున్న వారి రక్షణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు భారీ మానవతా సాయం, సహాయక బృందాలను పంపేందుకు సిద్ధమవుతున్నాయి.

26, జూన్ 2026

వెనెజువెలా భూకంపాలకు క్షణాల ముందే గూగుల్‌ అలర్ట్‌ . నెటిజన్ల స్క్రీన్‌షాట్ల వైరల్‌
అంతర్జాతీయం

వెనెజువెలా భూకంపాలకు క్షణాల ముందే గూగుల్‌ అలర్ట్‌ . నెటిజన్ల స్క్రీన్‌షాట్ల వైరల్‌

వెనెజువెలాలో వరుసగా సంభవించిన భారీ భూకంపాలకు క్షణాల ముందే గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలర్ట్‌ సిస్టమ్‌ ద్వారా అనేక స్మార్ట్‌ఫోన్లకు హెచ్చరికలు వెళ్లినట్టు నెటిజన్లు స్క్రీన్‌షాట్లతో వెల్లడిస్తున్నారు. ఫోన్లలోని యాక్సిలరోమీటర్‌ సెన్సార్‌ భూమి ప్రైమరీ వేవ్స్‌ను గుర్తించి గూగుల్‌ సర్వర్లకు పంపడంతో, సెకండరీ వేవ్స్‌ చేరుకునేలోపే అలర్ట్‌లు పంపే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫీచర్‌ ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లోనూ ఆండ్రాయిడ్‌ 5 పై వెర్షన్లలో అందుబాటులో ఉంది.

25, జూన్ 2026

భూకంపాల ధాటికి వణికిన వెనెజువెలా : భారీగా మరణాలు : యూఎస్‌జీఎస్‌
అంతర్జాతీయం

భూకంపాల ధాటికి వణికిన వెనెజువెలా : భారీగా మరణాలు : యూఎస్‌జీఎస్‌

వెనెజువెలా భూకంపాల ధాటికి చిగురుటాకులా వణికింది. 39 సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. మృతుల సంఖ్య 10వేల నుంచి లక్ష వరకు ఉండవచ్చు’’ అని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.

25, జూన్ 2026

ఏపీలో పిడుగుల హెచ్చరిక..  : ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!
వ్యవసాయం

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. : ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!

ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

22, జూన్ 2026

ఏపీలో రేపు పిడుగులతో భారీ వర్షాలు :  APSDMA హెచ్చరిక
వాతావరణం

ఏపీలో రేపు పిడుగులతో భారీ వర్షాలు : APSDMA హెచ్చరిక

రేపు ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు తదితర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అదే సమయంలో అనేక జిల్లాల్లో 40–42 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో, పిడుగులు, ఈదురుగాలులు, వేడి తీవ్రత నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters