లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హిందీ చిత్రం ‘ఈఠ’ ఇటీవల టైటిల్‌ వివాదంలో చిక్కుకుంది. మరాఠీ ‘లవాణి’ కళాకారిణి విఠాబాయి నారాయణ్‌ గావ్‌కర్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా పేరుపై రాజకీయ పార్టీ ఎన్‌సీపీ, విఠాబాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

జూన్‌ 23న విడుదలైన ‘ఈఠ’ టీజర్‌ తర్వాత ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. విఠాబాయి నారాయణ్‌ గావ్‌కర్‌ వంటి ప్రముఖ జానపద కళాకారిణి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీస్తున్న చిత్రానికి ఆమె పేరును టైటిల్‌గా పెట్టకపోవడంపై ఎన్‌సీపీ సినిమా, సాంస్కృతిక విభాగం ప్రశ్నలు లేవనెత్తింది.

సాంస్కృతిక విభాగం తమ అభ్యంతరాన్ని వెల్లడించింది. ఈ డిమాండ్‌కు విఠాబాయి కుటుంబ సభ్యులు కూడా మద్దతు తెలుపుతూ, బయోపిక్‌లో ఆమె వ్యక్తిత్వం, కళను గౌరవంగా ప్రతిబింబించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సాంస్కృతిక విభాగం మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు బాబాసాహెబ్‌ పాటిల్‌ పేర్కొన్నారు. అయితే టైటిల్‌పై కొనసాగుతున్న ఈ వివాదంపై దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

1957, 1990 సంవత్సరాల్లో భారత రాష్ట్రపతి నుంచి సత్కారం అందుకున్న విఠాబాయి, లవాణి, తమాషా ప్రదర్శనల ద్వారా పలు తరాల ప్రేక్షకులను అలరించారు. ఆమె కళాజీవితంలోని అత్యంత ప్రభావవంతమైన ఘట్టాల్లో ఒకదాన్ని ‘ఈఠ’ టీజర్‌లో చూపించినట్లు చిత్రబృందం తెలిపింది.

ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలో విడుదల కానుంది. ‘స్త్రీ’ సినిమా తర్వాత శ్రద్ధా కపూర్‌, దినేశ్‌ విజన్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇదే. అలాగే ‘ఛావా’ విజయానంతరం దినేశ్‌ విజన్‌, లక్ష్మణ్‌ ఉటేకర్‌ జంటగా మరోసారి కలిసి పనిచేస్తున్న ప్రాజెక్ట్‌గా ‘ఈఠ’ ప్రత్యేకతను సంతరించుకుంది.

బయోపిక్‌ టైటిల్‌ మార్పు, విఠాబాయి పేరును చేర్చాలన్న డిమాండ్‌పై చిత్రబృందం తదుపరి నిర్ణయం ఏదన్నది సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.