బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#జట్టు

236 articles

శ్రీలంక 284 ఆలౌట్‌.. భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం
క్రీడలు

శ్రీలంక 284 ఆలౌట్‌.. భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం

గాలె టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 462 పరుగులకు ఆలౌట్‌ కాగా, శ్రీలంక 284 పరుగులకు మూడో రోజు ఆలౌట్‌ అయింది. మానవ్‌ సుతార్‌ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి శ్రీలంకను కట్టడి చేశారు. దీంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించగా, మేఘావృత వాతావరణం, వర్ష సూచనల కారణంగా మూడో రోజు ఆటను అంపైర్లు ముందుగానే నిలిపివేశారు.

18, ఆగ 2026

కెప్టెన్ కుర్చీ కోసం హార్దిక్ డిమాండ్‌… గుజరాత్ టైటాన్స్‌ చర్చలకు బ్రేక్‌
క్రీడలు

కెప్టెన్ కుర్చీ కోసం హార్దిక్ డిమాండ్‌… గుజరాత్ టైటాన్స్‌ చర్చలకు బ్రేక్‌

హార్దిక్ పాండ్యను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి గుజరాత్ టైటాన్స్ మొదట సానుకూలంగా ఉన్నా, అతడు కెప్టెన్సీ బాధ్యతలు తనకే ఇవ్వాలని పెట్టిన షరతును ఫ్రాంచైజీ అంగీకరించకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. ప్రస్తుతం హార్దిక్ పాండ్య భవిష్యత్తు, అతడు ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడతాడు అన్నది స్పష్టంగా లేకపోగా, ముంబయి ఇండియన్స్‌తో ఒప్పందంపై నిర్ణయం తీసుకునే వరకు ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని అతడి ప్రతినిధులు సూచిస్తున్నారు.

12, ఆగ 2026

వార్మప్ మ్యాచ్‌లో భారత బౌలర్లకు వికెట్లు దొరకలేదు
క్రీడలు

వార్మప్ మ్యాచ్‌లో భారత బౌలర్లకు వికెట్లు దొరకలేదు

శ్రీలంక XIతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ తొలి రోజు భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. శ్రీలంక XI 363/8 స్కోరు చేసింది, ఇందులో ఓపెనర్లు నిషాన్ మదుష్క, రవిందు రసాంత, మధ్యవరుసలో సోనాల్ దినుష కీలక ఇన్నింగ్స్ ఆడారు. స్పిన్ బౌలర్లు వికెట్లు తీసుకున్నా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్, సారాంశ్ జైన్ వికెట్‌లేమితో ఆందోళన కలిగించారు, శుభ్‌మన్ గిల్ గాయం మరో సమస్యగా మారింది.

8, ఆగ 2026

వన్డే క్రికెట్‌ కొత్త మైలురాయి… 5000వ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ విజయం
క్రీడలు

వన్డే క్రికెట్‌ కొత్త మైలురాయి… 5000వ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ విజయం

వన్డే క్రికెట్‌ చరిత్రలో 5000వ మ్యాచ్‌గా నిలిచిన వన్డే ప్రపంచకప్‌ లీగ్‌–2లో స్కాట్లాండ్‌–కెనడా పోరులో స్కాట్లాండ్‌ 9 పరుగుల తేడాతో గెలిచింది. ఫిన్లే మెక్‌క్రీత్‌ 111 పరుగులతో స్కాట్లాండ్‌కు బలమైన స్కోరు అందించగా, కెనడా తరఫున యువరాజ్‌ సమ్రా 78 పరుగులతో పోరాడినా జట్టు 272 పరుగులకే ఆలౌటై లక్ష్యానికి చేరువలోనే ఆగిపోయింది.

8, ఆగ 2026

దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు: భారత మహిళలకు అదనంగా టి20 సిరీస్
క్రీడలు

దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు: భారత మహిళలకు అదనంగా టి20 సిరీస్

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళల జట్టుకు టెస్టు, వన్డేలతో పాటు మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా క్రికెట్ సౌతాఫ్రికా చేర్చింది. డిసెంబర్ 26–30 మధ్య బెనోని, పోచెఫ్‌స్ట్రూమ్‌లలో జరిగే ఈ టి20లు, వచ్చే ఫిబ్రవరిలో శ్రీలంకలో జరిగే ICC Women’s Champions Trophyకి కీలక సన్నాహకంగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

7, ఆగ 2026

శ్రీలంక టెస్టు సిరీస్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాం: గౌతమ్ గంభీర్
క్రీడలు

శ్రీలంక టెస్టు సిరీస్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాం: గౌతమ్ గంభీర్

శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకోవాలని కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. దక్షిణాఫ్రికా చేతిలో గత టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాజయం తర్వాత ఈ సిరీస్‌ను కీలక పరీక్షగా చూస్తున్నారు. బుమ్రా గాయం కారణంగా ఆకిబ్ నబి, సారాంశ్ జైన్‌లకు టెస్టు జట్టులో అవకాశం లభించగా, వీరు దేశం గర్వించే ప్రదర్శన చేయాలని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

7, ఆగ 2026

వన్డే వరల్డ్ కప్ నేరుగా అర్హతకు మరోసారి డేంజర్‌లో వెస్టిండీస్
క్రీడలు

వన్డే వరల్డ్ కప్ నేరుగా అర్హతకు మరోసారి డేంజర్‌లో వెస్టిండీస్

2027 వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు వెస్ట్ ఇండీస్ కు మరోసారి సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న ఈ జట్టు సెప్టెంబర్ 30 కటాఫ్ తేదీకి ముందు ఇండియాతో రెండు వన్డేలు మాత్రమే ఆడనుండగా, ఆఫ్గనిస్తాన్–ఐర్లాండ్ సిరీస్ ఫలితాలు, అలాగే ఈ రెండు మ్యాచ్‌ల్లో వెస్ట్ ఇండీస్ ప్రదర్శన ఆధారంగా టాప్-8లోకి చేరే అవకాశం నిర్ణయించబడనుంది.

6, ఆగ 2026

వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన పాకిస్థాన్‌
క్రీడలు

వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన పాకిస్థాన్‌

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్‌ వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ శతకంతో పాక్‌ 43 పరుగుల ఆధిక్యం సాధించగా, సాజిద్‌ ఖాన్‌, అలీ ఉస్మాన్‌ తలా నాలుగు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 117 పరుగులకు ఆలౌట్‌ చేశారు. 75 పరుగుల లక్ష్యాన్ని షఫీక్‌, బాబర్‌ అజామ్‌ అజేయ ఇన్నింగ్స్‌తో సులభంగా ఛేదించగా, షఫీక్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

6, ఆగ 2026

జిల్లా స్థాయి గవర్నమెంట్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్
జిల్లా వార్తలు

జిల్లా స్థాయి గవర్నమెంట్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి గవర్నమెంట్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. వివిధ మండలాల ప్రభుత్వ ఉపాధ్యాయుల జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో కదిరి, నల్లమాడ, ముదిగుబ్బ, గాండ్లపెంట జట్లు విజయం సాధించగా, విజేతలకు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన ఆటగాళ్లకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ఈ టోర్నమెంట్ ద్వారా ఉపాధ్యాయుల్లో క్రీడాస్ఫూర్తి, పరస్పర సౌహార్దం పెంపొందించడమే లక్ష్యమని స్థానికులు పేర్కొన్నారు.

3, ఆగ 2026

స్థానిక వన్‌డేలో అభిషేక్ శర్మ డబుల్ సెంచరీ సంచలనం
క్రీడలు

స్థానిక వన్‌డేలో అభిషేక్ శర్మ డబుల్ సెంచరీ సంచలనం

అమృత్‌సర్ తరఫున స్థానిక వన్‌డే డిస్ట్రిక్ట్ టోర్నీలో ఆడిన అభిషేక్ శర్మ, తరన్ తారన్ జట్టుపై 91 బంతుల్లో 15 ఫోర్లు, 25 సిక్సర్లతో 233 పరుగులు చేసి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌తో అమృత్‌సర్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 533 పరుగుల భారీ స్కోరు సాధించగా, జింబాబ్వేతో ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విఫలమైన అభిషేక్‌కు ఈ ప్రదర్శన ఫామ్ తిరిగి వచ్చిందనే సంకేతాలు ఇస్తూ, టీమిండియాలో స్థానం పటిష్టం చేసుకునే దిశగా కీలక మలుపుగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

3, ఆగ 2026

ఏషియన్ లీజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్ రెండో వరుస విజయం
క్రీడలు

ఏషియన్ లీజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్ రెండో వరుస విజయం

జాంబియాలో జరుగుతున్న Asian Legends League‌లో Indian Royals జట్టు Pakistan Panthers‌పై 2 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. 168 పరుగుల లక్ష్యాన్ని రిషి ధావన్, సారుల్ కీలక ఇన్నింగ్స్‌లతో 17.4 ఓవర్లలో ఛేదించగా, శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఈ లీగ్‌పై భారత క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

3, ఆగ 2026

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళ జట్టు ప్రకటన
క్రీడలు

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళ జట్టు ప్రకటన

మహిళల ఆసియా కప్‌ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్సీపై ఇటీవల చర్చ జరిగినప్పటికీ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది.

2, ఆగ 2026

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కు సెమీస్‌ ప్రవేశం
క్రీడలు

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కు సెమీస్‌ ప్రవేశం

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అబ్బాయిల జట్టు ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి సెమీఫైనల్లోకి చేరి పతక ఆశలను సజీవంగా ఉంచింది. ఆర్యవీర్‌, గుర్వీర్‌ విజయాలు కీలకంగా నిలవగా, సెమీస్‌లో అమెరికాను ఎదుర్కోనుంది. అయితే అమ్మాయిల జట్టు అమెరికాతో 1-2 తేడాతో ఓడి టోర్నీలో నుంచి నిష్క్రమించింది.

31, జులై 2026

అరుదైన ఘనతతో ముందంజలో RCB
క్రీడలు

అరుదైన ఘనతతో ముందంజలో RCB

రాయల్ చల్లేంగెర్స్ బెంగుళూరు (RCB) బ్రాండ్ విలువ $312 మిలియన్‌ (రూ.2,986 కోట్లు) చేరుకుని, ఐపీఎల్‌లో ఈ మైలురాయిని సాధించిన తొలి జట్టుగా హాయిహాన్ లోకీ నివేదికలో నిలిచింది.యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ , ఐపీల్ -2026కు ముందు RCBని బ్లాక్స్టన్ , బోల్ట్ వెంచర్స్ , ఆదిత్య బిర్లా గ్రూప్స్ , తొలి కన్సార్షియం కలిసి రూ.16,705 కోట్లకు కొనుగోలు చేయగా, ఈ ఒప్పందం ఫ్రాంచైజీ వ్యాపార బలం, మార్కెట్ స్థాయిని మరింత స్పష్టంగా చూపించింది.

30, జులై 2026

ఆగస్టు 2న కడపలో జాతీయ టెన్నిస్ క్రికెట్ పోటీలకు AP జట్టు ఎంపికలు
జిల్లా వార్తలు

ఆగస్టు 2న కడపలో జాతీయ టెన్నిస్ క్రికెట్ పోటీలకు AP జట్టు ఎంపికలు

జాతీయ స్థాయి టెన్నిస్ క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు ఎంపికలను ఆగస్టు 2న కడపలోని RSR క్రికెట్ అకాడమీలో నిర్వహించనున్నట్లు AP టెన్నిస్ క్రికెట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రకటించింది. అండర్-15, అండర్-19 బాలురతో పాటు సీనియర్ బాలికల విభాగానికి జట్లు ఎంపిక చేయనున్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని, మరిన్ని వివరాల కోసం అసోసియేషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

30, జులై 2026

దూలేప్ ట్రోఫీ 2026కు ఈస్ట్ జోన్ జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

దూలేప్ ట్రోఫీ 2026కు ఈస్ట్ జోన్ జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

దూలేప్ ట్రోఫీ 2026 కోసం ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహమ్మద్ షమీ, అభిమన్యు ఈశ్వరన్, ముకేష్ కుమార్, షాబాజ్ అహ్మద్ వంటి ప్రముఖులు, యువ ప్రతిభావంతులతో కలిసి 15 మంది ప్రధాన జట్టు, ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్లు ఎంపిక కావడంతో ఈస్ట్ జోన్ పోటీ సామర్థ్యం పెరిగిందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

30, జులై 2026

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో సుభదీప్ ఘోష్
క్రీడలు

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో సుభదీప్ ఘోష్

భారత జట్టులో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ Doeschate, ఫీల్డింగ్ కోచ్ T దిలీప్ కాంట్రాక్టులు పొడగించకూడదని BCCI నిర్ణయించడంతో కొత్త ఫీల్డింగ్ కోచ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. BCCI కార్యదర్శి దేవాజిత్ సాయికియా ప్రకారం ఇద్దరు–ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉండగా, దేశవాళీ, NCA, ఇండియా A, అండర్ -19, IPL స్థాయిల్లో విస్తృత అనుభవం ఉన్న శుభదీప్ ఘోష్ ప్రధాన ఫేవరెట్‌గా, శ్రీ లంక పర్యటనకు ముందు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.

29, జులై 2026

వెస్టిండీస్ ఘన విజయం..  పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్
క్రీడలు

వెస్టిండీస్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్

టరౌబాలో జరిగిన తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ పాకిస్థాన్‌పై 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ బౌలింగ్ మెరుపులతో పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే కుప్పకూలింది. ఈ ఫలితంతో WTC 2025-27 పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ 8వ స్థానానికి ఎగబాకగా, పాకిస్థాన్ చివరి స్థానానికి జారిపోగా, దాని అవకాశాలు దాదాపు చీకట్లో కలిసినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

29, జులై 2026

బీసీసీఐ సెలెక్టర్లపై హనుమ విహారి ప్రశ్నలు
క్రీడలు

బీసీసీఐ సెలెక్టర్లపై హనుమ విహారి ప్రశ్నలు

టీమిండియా మాజీ క్రికెటర్ హనుమ విహారి, సంజు శాంసన్, అభిషేక్ శర్మల ఎంపిక విషయంలో బీసీసీఐ సెలెక్టర్లపై ద్వంద్వ ప్రమాణాల ఆరోపణలు చేశారు. వరుసగా విఫలమైనా అభిషేక్‌కు అవకాశాలు కొనసాగుతుండగా, టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజుకు మాత్రం స్థిరమైన అవకాశాలు లేకపోవడాన్ని ప్రశ్నించారు. విహారి వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

28, జులై 2026

తన నిబంధనల ప్రకారమే క్రికెట్‌ ఆడతానన్న సంజు శాంసన్
క్రీడలు

తన నిబంధనల ప్రకారమే క్రికెట్‌ ఆడతానన్న సంజు శాంసన్

సంజు శాంసన్ ఇకపై ఇతరుల అభిప్రాయాలు, జట్టులో పోటీ గురించి ఆలోచించకుండా తన నిబంధనల ప్రకారమే క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో మూడు అర్ధశతకాలు చేసి భారత్ టైటిల్ నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన సంజు, భవిష్యత్తు ప్రపంచ కప్‌ల గురించి ఆలోచించకుండా ఆటను ఆస్వాదించడం, జట్టుకు అవసరమైనప్పుడు తన వంతు పాత్ర పోషించడమే లక్ష్యమని తెలిపాడు.

28, జులై 2026

శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ఎంపిక
క్రీడలు

శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ఎంపిక

శ్రీలంక, భారత్ మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్‌ కోసం భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. జస్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌లకు బీసీసీఐ సెంటర్ ఆఫ్‌ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్ వస్తే.. మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారు.

28, జులై 2026

అర్ష్‌దీప్ సింగ్ ప్రేమ బంధం అధికారికం: నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో రిలేషన్‌షిప్ ప్రకటించిన స్టార్ పేసర్
క్రీడలు

అర్ష్‌దీప్ సింగ్ ప్రేమ బంధం అధికారికం: నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో రిలేషన్‌షిప్ ప్రకటించిన స్టార్ పేసర్

భారత క్రికెట్ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, నటి-మోడల్ సమ్రీన్ కౌర్‌తో తన ప్రేమ బంధాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేస్తూ “My Person” క్యాప్షన్‌తో అధికారికంగా ప్రకటించాడు. ఐపీఎల్ 2026 సమయంలో మొదలైన డేటింగ్ వార్తలకు ఈ పోస్టుతో ముగింపు లభించగా, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

27, జులై 2026

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో భారత జట్టు తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ వరుస పరాజయాల తర్వాత టీమిండియా రెండో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.

26, జులై 2026

విజయం తర్వాత శ్రేయాస్ అయ్యర్ మీడియా తో  సమావేశం
క్రీడలు

విజయం తర్వాత శ్రేయాస్ అయ్యర్ మీడియా తో సమావేశం

జింబాబ్వేపై రెండో టీ20లో భారత్ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 219 పరుగులు చేసిన భారత్ తరఫున ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు అద్భుతంగా రాణించగా, అభిషేక్ శర్మ, యష్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో మెరిశారు. ఈ సమిష్టి ప్రదర్శనపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, గాయపడ్డ ఆటగాడి కారణంగా చివరి మ్యాచ్‌లో జట్టు కాంబినేషన్‌లో మార్పులు ఉండొచ్చని సూచించారు.

26, జులై 2026

భారత్ చేతిలో ఘోర పరాజయం: జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అసంతృప్తి
క్రీడలు

భారత్ చేతిలో ఘోర పరాజయం: జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అసంతృప్తి

భారత్‌తో రెండో టీ20లో భారీ తేడాతో ఓడిన తర్వాత జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా జట్టు బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మల అద్భుత బ్యాటింగ్‌ను ప్రశంసించాడు. 220 పరుగుల లక్ష్య ఛేదనలో అనుభవలేమి, సరికాని షాట్ సెలెక్షన్‌తో వికెట్లు కోల్పోయామని, ముఖ్యంగా తన బ్యాటింగ్ వైఫల్యమే జట్టును నిరాశపరిచిందని ఒప్పుకుని, తదుపరి మ్యాచ్‌ల్లో పుంజుకుని జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడేందుకు కట్టుబడి ఉన్నట్టు రజా తెలిపాడు.

26, జులై 2026

రెండో టీ20లో జింబాబ్వే టాస్ గెలుపు… భారత్‌కు ముందుగా బ్యాటింగ్
క్రీడలు

రెండో టీ20లో జింబాబ్వే టాస్ గెలుపు… భారత్‌కు ముందుగా బ్యాటింగ్

హరారేలో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శీతాకాల వాతావరణం, తొలి ఓవర్లలో సీమ్ బౌలర్లకు అనుకూల పరిస్థితులు ఉండొచ్చన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ సికిందర్ రజా తెలిపారు. టాస్ ఓడినా ముందే బ్యాటింగ్ ఎంచుకునే ఆలోచనలో ఉన్నామని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పగా, గత మ్యాచ్‌లో రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీపై మరోసారి దృష్టి నిలిచింది.

25, జులై 2026

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రేసులో జో రూట్ ముందంజ
క్రీడలు

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రేసులో జో రూట్ ముందంజ

బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో, ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. పాకిస్థాన్ సిరీస్ నుంచి జో రూట్ మళ్లీ టెస్ట్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇంగ్లాండ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే స్టోక్స్ మాత్రం ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా ఉన్న హ్యారీ బ్రూక్‌కే టెస్ట్ సారథ్యం అప్పగించాలని భావిస్తున్నాడని సమాచారం.

25, జులై 2026

మహిళల పెయిర్స్‌ ఈవెంట్‌లో రూప రాణి టిర్కీ
క్రీడలు

మహిళల పెయిర్స్‌ ఈవెంట్‌లో రూప రాణి టిర్కీ

మహిళల పెయిర్స్‌ విభాగంలో రూప రాణి టిర్కీ–పింకి సింగ్‌ జంట తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మాల్టా జంట రెబెకా–కాని లీపై తొలి సెట్‌ను 7-1తో గెలిచిన భారత ద్వయం, రెండో సెట్‌ను కోల్పోయినా టైబ్రేక్‌లో దూకుడుగా ఆడి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంది. ఈ విజయం భారత మహిళల పెయిర్స్‌ జట్టుకు ఉత్తేజాన్ని అందించింది.

24, జులై 2026

యూత్‌ టెస్టు సిరీస్‌ భారత్‌దే
క్రీడలు

యూత్‌ టెస్టు సిరీస్‌ భారత్‌దే

శ్రీలంకలో జరుగుతున్న యూత్‌ టెస్టు సిరీస్‌ను భారత అండర్‌-19 జట్టు 1-0 తేడాతో కైవసం చేసుకుంది. రెండో టెస్టులో భారత్‌ 211 పరుగుల తేడాతో గెలిచింది; రోహిత్‌ యాదవ్‌, సి. వెంకట కీలక వికెట్లు తీసి లంకను 260 పరుగులకే ఆలౌట్‌ చేశారు. వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమ్‌ఇండియా యువజట్టు టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో విదేశీ నేలపై సిరీస్‌ విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.

24, జులై 2026

వికలాంగ క్రికెటర్ల కోసం జిల్లా జట్టు ఎంపికలు జూలై 26న కడపలో
జిల్లా వార్తలు

వికలాంగ క్రికెటర్ల కోసం జిల్లా జట్టు ఎంపికలు జూలై 26న కడపలో

కలయిక వైఎస్సార్ జిల్లాకు చెందిన వికలాంగ క్రికెటర్ల కోసం జిల్లా జట్టు ఎంపిక పరీక్షలు జూలై 26న కడపలోని YSR ACA స్టేడియం నెట్స్ లో నిర్వహించనున్నారు. అమరావతి ఇంక్లూసివ్ క్రికెట్ కప్ - 2026 కోసం పోటీ సామర్థ్యమున్న జిల్లా జట్టును ఎంపిక చేయడం లక్ష్యంగా పెట్టుకున్న నిర్వాహకులు, అభ్యర్థులు వ్యక్తిగత క్రికెట్ కిట్, ఆధార్ కార్డు, SADAREM సర్టిఫికెట్ , UDID Card ఫోటోకాపీ, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో నిర్ణయించిన సమయానికి తప్పనిసరిగా హాజరుకావాలని సూచిస్తున్నారు.

23, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters