బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ప్రయాణికుల

67 articles

శ్రీ సత్యసాయి జిల్లాలో ఆటో రిక్షాలకు డిజిటల్ నంబర్ల కార్యక్రమం
జిల్లా వార్తలు

శ్రీ సత్యసాయి జిల్లాలో ఆటో రిక్షాలకు డిజిటల్ నంబర్ల కార్యక్రమం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఆటో రిక్షాలకు డిజిటల్ నంబర్ల నమోదు కార్యక్రమాన్ని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆటో డ్రైవర్లతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత, ప్రయాణికుల రక్షణపై అవగాహన కల్పించారు. డిజిటల్ నంబర్ల ద్వారా వాహనాలు, డ్రైవర్ల వివరాలు సులభంగా గుర్తించి ప్రయాణికుల భద్రతను బలోపేతం చేయడంతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు వీలవుతుందని అధికారులు తెలిపారు.

9, ఆగ 2026

కమలాపురం రైల్వే స్టేషన్‌లో రైళ్ల నిలుపుదల పునరుద్ధరణకు వినతిపత్రం
జిల్లా వార్తలు

కమలాపురం రైల్వే స్టేషన్‌లో రైళ్ల నిలుపుదల పునరుద్ధరణకు వినతిపత్రం

కడప జిల్లా కమలాపురం రైల్వే స్టేషన్‌లో కోవిడ్‌కు ముందు ఆగిన అన్ని రైళ్ల నిలుపుదల పునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, కమలాపురం రైలు నిలుపుదల సాధన కమిటీ సభ్యులు కలిసి గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం చంద్ర గుప్తాకు వినతిపత్రం సమర్పించారు. కమలాపురం ప్రయాణికుల ఇబ్బందులను పరిశీలించి రైల్వే మంత్రిత్వ శాఖతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డీఆర్‌ఎం హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజల్లో ఆశలు పెరుగుతున్నాయి.

8, ఆగ 2026

రాయచోటిలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
జిల్లా వార్తలు

రాయచోటిలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

రాయచోటి పట్టణంలో బస్టాండ్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ చాంద్‌బాషా, ట్రాఫిక్ విభాగం ప్రతినిధులు ప్రమాదాల నివారణ, మీటర్లు, వాహన పత్రాలు, మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని సూచించారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని యూనియన్, నాయకులు అభిలషించారు.

7, ఆగ 2026

డోన్ ఆర్టీసీ బస్టాండ్‌లో మదర్ ఫీడింగ్ రూమ్ ప్రారంభం
జిల్లా వార్తలు

డోన్ ఆర్టీసీ బస్టాండ్‌లో మదర్ ఫీడింగ్ రూమ్ ప్రారంభం

డోన్ ఆర్టీసీ బస్టాండ్‌లో చిన్నారులకు తల్లిపాలు అందించేందుకు ప్రత్యేక మదర్ ఫీడింగ్ రూమ్‌ను ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. జనసేన కార్యకర్త మైకేల్ తన వ్యక్తిగత నిధులతో ఈ గదిని నిర్మించగా, ప్రజా ప్రదేశాల్లో తల్లులకు ఇలాంటి సౌకర్యాలు అవసరమని స్థానికులు అభిప్రాయపడి, ఇతర బస్టాండ్లలో కూడా ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు.

5, ఆగ 2026

రోడ్డు ప్రమాదాల నివారణకు అన్నమయ్య జిల్లాలో సమగ్ర చర్యలు
జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదాల నివారణకు అన్నమయ్య జిల్లాలో సమగ్ర చర్యలు

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ఆధ్వర్యంలో మదనపల్లె కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాదచారుల రక్షణ, బ్లాక్ స్పాట్స్‌లో సంయుక్త తనిఖీలు, ట్రామా కేర్ సెంటర్, రెస్ట్ సెంటర్లు, ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, ‘రహ్ వీర్లు’ సత్కారం వంటి చర్యలను సూచించారు.

5, ఆగ 2026

సెల్‌ఫోన్‌ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్‌ విధుల నుంచి తొలగింపు
జిల్లా వార్తలు

సెల్‌ఫోన్‌ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్‌ విధుల నుంచి తొలగింపు

పలమనేరు–మదనపల్లె మార్గంలో బస్సు నడుపుతూ సెల్‌ఫోన్‌ చూస్తూ ప్రయాణం కొనసాగించిన పలమనేరు డిపోకు చెందిన డ్రైవర్‌ కె. గణేష్‌కుమార్‌ను వీడియో ఆధారంగా గుర్తించి విధుల నుంచి వెంటనే తొలగించారు. ప్రయాణికుల భద్రతపై రాజీ ఉండదని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేయగా, ఇటువంటి నిర్లక్ష్యానికి పాల్పడే ఆర్టీసీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

1, ఆగ 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ప్రధాని మోదీ షెడ్యూల్‌
జాతీయం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ప్రధాని మోదీ షెడ్యూల్‌

ప్రధాని మోదీ ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.

31, జులై 2026

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి
జాతీయం

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉదయ్‌పూర్–పాంగి మార్గంలో ప్రయాణిస్తున్న టాటా సుమోపై అకస్మాత్తుగా భారీగా కొండచరియలు విరిగిపడటంతో వాహనం పూర్తిగా ధ్వంసమై 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పర్వత ప్రాంతమైన ఈ మార్గంలో తరచూ కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో, వాతావరణ పరిస్థితులు, ముందస్తు హెచ్చరికలు, జాగ్రత్తలు అత్యంత అవసరమని స్థానికులు సూచిస్తున్నారు.

27, జులై 2026

వారణాసి షూటింగ్ కోసం హైదరాబాద్‌కు ప్రియాంకా చోప్రా
సినిమా

వారణాసి షూటింగ్ కోసం హైదరాబాద్‌కు ప్రియాంకా చోప్రా

దర్శకుడు S.S. రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’ చిత్ర షూటింగ్ కోసం ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ తమ బిడ్డతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో వీరి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆసక్తి నెలకొంది.

26, జులై 2026

మహిళల భద్రత కోసం ‘అభయ ఆటో’ యాప్‌ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రత కోసం ‘అభయ ఆటో’ యాప్‌ ప్రారంభం

గుంటూరు జిల్లా పోలీసు శాఖ రూపొందించిన మహిళల భద్రత కోసం ‘అభయ ఆటో’ యాప్‌ను ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ప్రారంభించారు. జిల్లాలోని సుమారు 20 వేల ఆటో రిక్షాల వివరాలు, ప్రతి ఆటోకు ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌, ప్రయాణ పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో SOS బటన్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌కు అలర్ట్‌ వెళ్లే విధంగా సాంకేతిక సదుపాయాలు కల్పించామని ఆయన తెలిపారు.

25, జులై 2026

కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్లో వరుసగా సెల్‌ఫోన్ చోరీలు
జిల్లా వార్తలు

కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్లో వరుసగా సెల్‌ఫోన్ చోరీలు

కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్లో గంట వ్యవధిలో నలుగురు ప్రయాణికుల సెల్‌ఫోన్లు చోరీకి గురవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. రద్దీని ఆసరాగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా, సీసీటీవీ దృశ్యాలు పరిశీలించి నిందితులను గుర్తించాలని స్థానికులు, భద్రతను కట్టుదిట్టం చేసి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

24, జులై 2026

భద్రతా కారణాలతో దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత
జాతీయం

భద్రతా కారణాలతో దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత

దిల్లీలో భద్రతా కారణాల వల్ల రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్‌, మండీ హౌస్‌ సహా 16 మెట్రో స్టేషన్లను DMRC తాత్కాలికంగా మూసివేసింది. స్టేషన్లలో ప్రవేశం, నిష్క్రమణ నిలిపివేసినా, రాజీవ్ చౌక్, మండీ హౌస్‌, సెంట్రల్ సెక్రటేరియట్‌లో ఇంటర్‌ఛేంజ్‌ సౌకర్యం కొనసాగుతుంది. నిరసన కార్యక్రమాల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

22, జులై 2026

ఢిల్లీలో ఆందోళనలు: 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత
జాతీయం

ఢిల్లీలో ఆందోళనలు: 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత

ఢిల్లీలో యువత నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో లోక్ కళ్యాణ్ మార్గ్ , రాజీవ్ చౌక్ , Supreme Court సహా 16 మెట్రో స్టేషన్లు తాత్కాలికంగా మూసివేశారు, కీలక ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. జంతర్‌మంతర్‌లో విద్యార్థుల నిరసనలపై సుమోటో విచారణ కోరిన పిటిషన్‌తో పాటు, పోలీసుల దౌర్జన్యంపై మరో పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించి, ఇతర చట్టపర న్యాయ మార్గాలను ఆశ్రయించాలని సూచించింది.

22, జులై 2026

భారత్‌లో తొలి స్వదేశీ 200 సీట్ల ప్రయాణికుల విమాన ప్రాజెక్టుకు శ్రీకారం
జాతీయం

భారత్‌లో తొలి స్వదేశీ 200 సీట్ల ప్రయాణికుల విమాన ప్రాజెక్టుకు శ్రీకారం

హంస ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ , ఆరున్నొవా ఇంజనీరింగ్ డివిజన్ కలిసి భారత తొలి స్వదేశీ 200 సీట్ల కమర్షియల్ ప్రయాణికుల విమాన అభివృద్ధికి ఫఱంబోరౌగ్ ఇంటర్నేషనల్ ఐర్షో -2026లో MoU కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంతో రూపకల్పన, ధృవీకరణ, తయారీతో పాటు దేశీయ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్, సరఫరా గొలుసు, సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధికి దృష్టి సారించి, భారత విమానయాన పరిశ్రమకు బలమైన పునాది వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

21, జులై 2026

పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
జిల్లా వార్తలు

పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

తిరుపతి జిల్లా పుత్తూరులోని ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్న ఈ సదస్సులో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండడం, వాహన పత్రాలు చెల్లుబాటులో ఉంచుకోవడం వంటి అంశాలపై పోలీసులు సూచనలు ఇచ్చారు. రోడ్డు భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

21, జులై 2026

రైలులో మిడిల్ బెర్త్ వినియోగానికి  రైల్వేశాఖ  స్పష్టమైన నిబంధనలు
జాతీయం

రైలులో మిడిల్ బెర్త్ వినియోగానికి రైల్వేశాఖ స్పష్టమైన నిబంధనలు

ఇండియన్ రైల్వేస్ నిబంధనల ప్రకారం మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తెరిచి నిద్ర కోసం ఉపయోగించాలి, మిగతా సమయంలో మడిచి ఉంచాలి. పగటిపూట కింది బెర్త్‌లో కూర్చునే ప్రయాణికుడి హక్కుకే ప్రాధాన్యం ఉండాలని రైల్వే స్పష్టం చేస్తోంది. సమస్యలు వస్తే TTE లేదా హెల్ప్‌లైన్ 139ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

21, జులై 2026

అల్లూరి జిల్లాలో బొలేరో బోల్తా.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్

అల్లూరి జిల్లాలో బొలేరో బోల్తా.. ఇద్దరు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో బ్రేకులు పనిచేయక బొలేరో వాహనం బోల్తా పడడంతో ఇద్దరు మృతి, 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

20, జులై 2026

దివ్యాంగులకు UDID కార్డు కీలకం.. రైల్వే టిక్కెట్లపై 75 శాతం వరకు రాయితీ
జాతీయం

దివ్యాంగులకు UDID కార్డు కీలకం.. రైల్వే టిక్కెట్లపై 75 శాతం వరకు రాయితీ

దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న UDID కార్డు ద్వారా Indian Railways టిక్కెట్లపై గరిష్టంగా 75 శాతం వరకు రాయితీ లభిస్తుంది. వైకల్యం రకం, శాతం, ప్రయాణ తరగతి ఆధారంగా రాయితీ నిర్ణయించబడుతుంది. UDID కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి పొందిన తర్వాత రైల్వే రాయితీలతో పాటు స్కాలర్‌షిప్‌లు, సహాయక పరికరాలు, నైపుణ్యాభివృద్ధి, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

19, జులై 2026

శ్రీశైలం–హైదరాబాద్ హైవేపై పెద్దపులి : వాహనదారుల్లో భయాందోళనలు..!
జిల్లా వార్తలు

శ్రీశైలం–హైదరాబాద్ హైవేపై పెద్దపులి : వాహనదారుల్లో భయాందోళనలు..!

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షమవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మున్ననూరు నుంచి శ్రీశైలం–హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో రోడ్డుపై పెద్దపులి సంచరిస్తూ కనిపించింది.

18, జులై 2026

ప్రేమోన్మాది ఘాతుకం.. నడిరోడ్డుపై యువతి దారుణ హత్య
నేరాలు

ప్రేమోన్మాది ఘాతుకం.. నడిరోడ్డుపై యువతి దారుణ హత్య

కర్ణాటకలోని బంట్వాల్ కేఎస్‌ఆర్‌టీసీ బస్ స్టాండ్ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని ఉన్మాదిగా మారిన యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు.

17, జులై 2026

విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం   : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్
రాజకీయాలు

విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్

విమాన ప్రయాణికులను దోపిడీ చేసే స్థాయిలో ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రయాణికులపై భారం పడనివ్వబోమని పేర్కొన్నారు.

16, జులై 2026

బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో యువకుడి మృతి
తెలంగాణ

బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో యువకుడి మృతి

ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని ఎన్‌ఎస్పీ క్రాస్‌ రోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున లారీ బైక్‌ను ఢీకొట్టడంతో నారాయణపురం గ్రామానికి చెందిన మెరుగు గోపి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో నారాయణపురం గ్రామం సహా పరిసర ప్రాంతాల్లో విషాద వాతావరణం నెలకొంది.

16, జులై 2026

మదనపల్లెలో పోలీసుల మెరుపు తనిఖీలు, ట్రాఫిక్ నిబంధాల ఉల్లంఘనపై చలానాలు
జిల్లా వార్తలు

మదనపల్లెలో పోలీసుల మెరుపు తనిఖీలు, ట్రాఫిక్ నిబంధాల ఉల్లంఘనపై చలానాలు

అన్నమయ్య జిల్లా మదనపల్లె తట్టివారిపల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ నిబంధాల అమలుపై పోలీసు విభాగం ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించి, హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా, అవసరమైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారిపై చలానాలు విధించింది. ఓవర్‌లోడ్ ఆటోలు, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే ప్రతి వాహనదారుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

15, జులై 2026

మరీ చీపుగా.. రైళ్లలో దుప్పట్లు చోరీ!
జాతీయం

మరీ చీపుగా.. రైళ్లలో దుప్పట్లు చోరీ!

ఎవరైనా రైలు ప్రయాణం చేస్తున్నారంటే అన్ని ఏర్పాట్లు చేసుకుని జర్నీ చేస్తుంటారు. ఏసీ కోచ్‌ల్లో అయితే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెడ్‌షీట్లు, దుప్పట్లను రైల్వేశాఖ ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా ప్రయాణ సమయంలో ఉపయోగించుకుని.. అక్కడే వదిలేసి వెళ్లిపోతుంటారు.

14, జులై 2026

విమాన ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టు సీరియస్‌
జాతీయం

విమాన ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టు సీరియస్‌

దేశంలో పెరుగుతున్న విమాన ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి, కొత్త విమానయాన నిబంధనల వివరాలను రెండు వారాల్లో సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రయాణికుల హక్కులు, ఛార్జీల విధానం, పారదర్శకతపై రూపుదిద్దుకుంటున్న నిబంధనల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండగా, కేసు విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.

14, జులై 2026

జూలై 17 వరకు చెన్నై–ముంబై రైళ్లు తాత్కాలిక రద్దు
జిల్లా వార్తలు

జూలై 17 వరకు చెన్నై–ముంబై రైళ్లు తాత్కాలిక రద్దు

ముంబై డివిజన్‌లోని కర్జాత్–లోనావ్లా సెక్షన్‌లో కొండచరియలు రైల్వే పట్టాలపై విరిగిపడటంతో రైలు రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనితో ముంబై–చెన్నై (22157), చెన్నై–ముంబై (22158) రైళ్లు జూలై 17 వరకు రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని లేదా రద్దు చేసుకుని రిఫండ్ పొందాలని సూచిస్తూ, ట్రాక్ మరమ్మత్తు పనులు పూర్తి చేసి భద్రతా తనిఖీలు ముగిసిన తర్వాతే సర్వీసులు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

13, జులై 2026

కర్నూలు–నంద్యాల జాతీయ రహదారిపై తప్పిన బస్సు ప్రమాదం
జిల్లా వార్తలు

కర్నూలు–నంద్యాల జాతీయ రహదారిపై తప్పిన బస్సు ప్రమాదం

కర్నూలు–నంద్యాల జాతీయ రహదారిపై పాణ్యం సమీపంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ బస్సు టైర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో బస్సు డివైడర్‌పైకి ఎగబాకినా, బోల్తా పడకపోవడంతో 27 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. బస్సుకు స్వల్ప నష్టం మాత్రమే కాగా, పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసి టైర్ పేలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

13, జులై 2026

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
తమిళనాడు

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మధురై - తిరుచ్చి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఓమ్ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

13, జులై 2026

బెంగళూరు స్టేషన్‌లో వందే భారత్ స్లీపర్ రైలు హల్‌చల్
కర్ణాటక

బెంగళూరు స్టేషన్‌లో వందే భారత్ స్లీపర్ రైలు హల్‌చల్

దేశంలో రెండవ Vande Bharat స్లీపర్ రైలు బెంగళూరులో తుది తనిఖీలు, ట్రయల్ రన్స్ కోసం నిలిపి ఉంచగా, ఇది క్రాంతివీర సంగోల్లి రాయన్న స్టేషన్ నుంచి Mumbai ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వరకు నడవనుంది. BEML తయారు చేసిన ఈ 16 కోచ్‌ల సెమీ-హైస్పీడ్ రైలు 823 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు, ప్రయాణ సమయాన్ని 22 గంటల నుంచి 16–17 గంటలకు తగ్గించి, అధునాతన భద్రతా, సౌకర్య సదుపాయాలతో రాత్రి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయనుంది.

12, జులై 2026

వాట్సప్‌ టికెట్లపై రైల్వే రెడ్‌కార్డ్‌: ఒరిజినల్‌ టికెట్‌ తప్పనిసరి
ఫీచర్ పేజీలు

వాట్సప్‌ టికెట్లపై రైల్వే రెడ్‌కార్డ్‌: ఒరిజినల్‌ టికెట్‌ తప్పనిసరి

భారతీయ రైల్వే శాఖ వాట్సప్‌ ఫార్వర్డ్‌లు, స్క్రీన్‌షాట్‌ టికెట్లు ఇకపై చెల్లుబాటు కాదని, ఒరిజినల్‌ ఇ-టికెట్‌ లేదా ప్రింటెడ్‌ టికెట్‌ మాత్రమే టీటీఈలు అంగీకరిస్తారని స్పష్టం చేసింది. ఇలాంటి స్క్రీన్‌షాట్‌ టికెట్లు చూపితే టికెట్‌ లేని ప్రయాణంగా పరిగణించి కొత్త టికెట్‌ కొనుగోలు చేయాల్సి ఉండి, జరిమానా, చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

11, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters