బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రైతులకు

60 articles

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తో ఎరువుల పంపిణీ ప్రారంభం
జిల్లా వార్తలు

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తో ఎరువుల పంపిణీ ప్రారంభం

ప్రొద్దుటూరు మండలం లింగాపురం PACS ఆధ్వర్యంలో యూరియా, DAPతో పాటు రాయితీ ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. DBT, APAIMS 2.0 విధానాల ద్వారా పారదర్శకంగా ఎరువులు అందించడంతో పాటు ఎల్ నినో ప్రభావ నివారణపై రైతుల అవగాహన కోసం ప్రత్యేక కరపత్రాలను విడుదల చేసి, మండలంలోని రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

8, ఆగ 2026

రైతులకు ఏపీఎస్పీడీసీఎల్ కొత్త సౌకర్యం: సిఎండి
జిల్లా వార్తలు

రైతులకు ఏపీఎస్పీడీసీఎల్ కొత్త సౌకర్యం: సిఎండి

ఏపీఎస్పీడీసీఎల్ వ్యవసాయ విద్యుత్ సర్వీసు దరఖాస్తుల సీనియారిటీ, ప్రస్తుత స్థితి తెలుసుకునేందుకు మొబైల్ యాప్ ద్వారా కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దరఖాస్తు నంబర్ నమోదు చేస్తే సర్వీసు స్థితి వెంటనే స్క్రీన్‌పై కనిపించేలా వ్యవస్థను రూపొందించారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు తమ ప్రాంత విద్యుత్ కార్యాలయాల్లో దరఖాస్తు నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని సంస్థ తెలిపింది.

8, ఆగ 2026

ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ఆరుతడి పంటల సాగు చేయాలి: సహాయ వ్యవసాయ సంచాలకులు అనిత
జిల్లా వార్తలు

ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ఆరుతడి పంటల సాగు చేయాలి: సహాయ వ్యవసాయ సంచాలకులు అనిత

ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగు వైపు దృష్టి పెట్టాలని సహాయ వ్యవసాయ సంచాలకులు అనిత సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక, నేల తేమ సంరక్షణ, నీటి నిర్వహణ, పీఎండీఎస్ పద్ధతిలో విత్తన గుళికల తయారీ వంటి సాంకేతిక విధానాల ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో కూడా దిగుబడిని సాధ్యమైనంతవరకు కాపాడుకోవచ్చని ఆమె వివరించారు.

8, ఆగ 2026

ఎస్‌ఆర్–1 డ్యాం నుంచి చింతకుంట చెరువుకు 100 క్యూసెక్కుల నీటి విడుదల
జిల్లా వార్తలు

ఎస్‌ఆర్–1 డ్యాం నుంచి చింతకుంట చెరువుకు 100 క్యూసెక్కుల నీటి విడుదల

మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం చల్లబసాయపల్లె వద్ద ఉన్న ఎస్‌ఆర్–1 డ్యాం నుంచి చింతకుంట చెరువుకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పర్యవేక్షించారు. తక్కువ వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కారణంగా జల వనరులు తగ్గిన నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించి, అధిక నీటి అవసరమున్న వరి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పంటలను పరిశీలించాలని ఆయన రైతులకు సూచించినట్లు అధికారులు తెలిపారు.

7, ఆగ 2026

కోడుమూరు లో మెగా కిసాన్ మేళా – రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు
జిల్లా వార్తలు

కోడుమూరు లో మెగా కిసాన్ మేళా – రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు

కర్నూలు జిల్లా కోడుమూరు వాసవి కల్యాణమందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ నిర్వహించిన జిల్లా స్థాయి మెగా కిసాన్ మేళాలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతికత, పంటల నిర్వహణపై నిపుణులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, రైతుల ఆదాయం పెంపు దిశగా పలు చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

6, ఆగ 2026

రైతు హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
జిల్లా వార్తలు

రైతు హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఓడి చెరువు మండలంలో 2,237 మంది రైతులకు ఫోటోతో పాటు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసి, రైతు భూ హక్కులకు కూటమి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోందని తెలిపారు. పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ, ఆమడ గూరు మండలంలో భారీ Reliance Solar ప్రాజెక్ట్, ఓడి చెరువులో మరో Solar ప్రాజెక్ట్ ద్వారా నియోజవర్గం పరిశ్రమల కేంద్రంగా, ఉపాధి హబ్‌గా మారే అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

6, ఆగ 2026

పామిడిలో ఎల్ నినో సన్నద్ధతపై రైతులకు అవగాహన సదస్సు
జిల్లా వార్తలు

పామిడిలో ఎల్ నినో సన్నద్ధతపై రైతులకు అవగాహన సదస్సు

అనంతపురం జిల్లా పామిడిలో ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. శాస్త్రవేత్తలు తక్కువ నీటితో సాగు చేయగలిగే ఆముదం, పెసర, అలసంద, పప్పుశనగ, ఉలవ, సజ్జ, జొన్న వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీర్ఘకాలిక పంటలను ఈ ఖరీఫ్‌లో నివారించాలని సూచించారు. ఆగస్టు 3 నుంచి 10 వరకు జిల్లావ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

6, ఆగ 2026

పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు అవగాహన
జిల్లా వార్తలు

పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు అవగాహన

వేంపల్లె మండలంలోని కుమ్మరాంపల్లి గ్రామంలో ఖరీఫ్ సీజన్ సందర్భంగా నిర్వహించిన "పొలం పిలుస్తోంది" కార్యక్రమంలో వరి పంట సమస్యలు, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నీటి వినియోగం, సస్యరక్షణ, జింక్ సల్ఫేట్, జిప్సం వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. పీఎంఎఫ్‌బీవై కింద పంట బీమా, ఈ-పంట, రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదులు ఆగస్టు 15లోపు పూర్తి చేసి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని అధికారులు సూచించారు.

6, ఆగ 2026

మద్దికేర మండలం పెరవలిలో కొత్త విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం
జిల్లా వార్తలు

మద్దికేర మండలం పెరవలిలో కొత్త విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం

మద్దికేర మండలం పెరవలి గ్రామంలో రూ.2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. దీనితో పెరవలి పరిసర గ్రామాలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి స్థిరమైన విద్యుత్ అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వారు పేర్కొన్నారు.

4, ఆగ 2026

పొగాకు రైతులకు వడ్డీ లేని రుణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
వ్యవసాయం

పొగాకు రైతులకు వడ్డీ లేని రుణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ రహితంగా రూ.50వేల రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకారం, ఈ రుణాన్ని రెండు దశల్లో, రెండేళ్లలో పూర్తిగా తిరిగి చెల్లించాలి. సుమారు 40వేల మంది రైతులు లబ్ధి పొందే ఈ పథకం, అధిక వడ్డీ భారాన్ని తగ్గించి ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుందని వ్యవసాయ వర్గాలు భావిస్తున్నాయి.

2, ఆగ 2026

బ్రహ్మం సాగర్ నుంచి లెఫ్ట్ కెనాల్‌కు సాగునీటి విడుదల
జిల్లా వార్తలు

బ్రహ్మం సాగర్ నుంచి లెఫ్ట్ కెనాల్‌కు సాగునీటి విడుదల

బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు నుంచి లెఫ్ట్ కెనాల్‌కు, ఎస్‌ఆర్-2 డ్యామ్ నుంచి మిట్టమానుపల్లె చెరువుకు సాగునీటిని విడుదల చేసి మైదుకూరు నియోజకవర్గంలో ఖరీఫ్‌ సీజన్‌ సాగుకు అనుకూల పరిస్థితులు కల్పించారు. ప్రతి ఎకరాకు అవసరమైన నీరు అందేలా పంపిణీ షెడ్యూల్‌ను సమర్థంగా ప్రణాళిక చేసి, పారదర్శకంగా అమలు చేయాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులు సూచనలు చేశారు.

2, ఆగ 2026

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు.

1, ఆగ 2026

కర్నూలు జిల్లాలో ఖరీఫ్ పంటల బీమా గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు
జిల్లా వార్తలు

కర్నూలు జిల్లాలో ఖరీఫ్ పంటల బీమా గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా నమోదు, ప్రీమియం చెల్లింపు గడువును జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగించారు. వరి మినహా అన్ని నోటిఫై చేసిన ఖరీఫ్ పంటలకు ఇది వర్తిస్తుందని, రుణగ్రహీత, రుణేతర రైతులు బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు, రైతు సేవా కేంద్రాలు, NCIP మొబైల్ యాప్ ద్వారా గడువు ముగిసేలోపు తప్పనిసరిగా బీమా నమోదు పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు.

1, ఆగ 2026

ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులకు ప్రారంభం
జిల్లా వార్తలు

ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులకు ప్రారంభం

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ, కుమారుడు శ్ నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభించారు. చెరువు పునరుద్ధరణతో సాగునీటి సౌకర్యం మెరుగై, నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, పంటల విస్తీర్ణం, వరుస పంటల సాగు సాధ్యమవుతుందని స్థానికులు భావిస్తున్నారు. గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు.

1, ఆగ 2026

వాతావరణ ఆధారిత పంటల బీమా పథకానికి చివరి తేదీ జూలై 31
వ్యవసాయం

వాతావరణ ఆధారిత పంటల బీమా పథకానికి చివరి తేదీ జూలై 31

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (RWBCIS) కింద అర్హులైన రైతులు తమ పంటలను జూలై 31, 2026 లోపు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని సూచించింది. వర్షాభావం, అధిక వర్షాలు, గాలివానలు, వడగండ్ల వానల వంటి వాతావరణ కారణాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ పొందేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని, గడువు లోపు బీమా చేయించుకున్న పంటలకే ప్రయోజనాలు వర్తిస్తాయని శాఖ స్పష్టం చేసింది.

30, జులై 2026

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం చంద్రబాబు సూచనలు
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం చంద్రబాబు సూచనలు

ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వాతావరణ మార్పులు తీవ్రంగా ఉండే అవకాశాల నేపథ్యంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం తగ్గించేందుకు వ్యవసాయ, వాతావరణ శాఖలు, ఆర్టీజీఎస్, రైతు సంఘాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సమన్వయంతో పనిచేసి గ్రామస్థాయిలో పంటల సలహాలు, శిక్షణా కార్యక్రమాలను విస్తరించాలని సమావేశంలో సూచించారు.

28, జులై 2026

బ్రహ్మం సాగర్ ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కుల సాగునీరు విడుదల
జిల్లా వార్తలు

బ్రహ్మం సాగర్ ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కుల సాగునీరు విడుదల

మైదుకూరు నియోజకవర్గంలో బ్రహ్మం సాగర్ ఎడమ ప్రధాన కాలువ ద్వారా రోజుకు 200 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేయడంతో ఆయకట్టు పరిధిలోని రైతులకు ఊరట లభించింది. వరుస కరువులు, వర్షాభావం మధ్య ఈ నీటివిడుదలతో వరి, మిర్చి, పత్తి తదితర పంటల సాగు పనులు వేగం పొందే అవకాశం ఉందని, దిగుబడి పెరిగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

21, జులై 2026

పత్తి, మిరపకు బదులుగా బూడిద గుమ్మడి..
వ్యవసాయం

పత్తి, మిరపకు బదులుగా బూడిద గుమ్మడి..

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం రైతు శ్రీనివాసులు పత్తి, మిరపల బదులుగా బూడిద గుమ్మడి సాగు చేసి తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ఏడాది పొడవునా విడతల వారీగా సాగు చేసి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు సరఫరా చేస్తూ ఎకరాకు సుమారు లక్ష రూపాయల స్థూల ఆదాయం, 60–70 వేల నికర లాభం పొందుతున్న ఆయన, మారుతున్న మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకుంటే రైతులకు మంచి లాభాలు సాధ్యమని చూపిస్తున్నారు.

21, జులై 2026

తెలంగాణలో వారం రోజుల వర్షాల సూచన: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం
వాతావరణం

తెలంగాణలో వారం రోజుల వర్షాల సూచన: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం

బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు మళ్లీ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22 వరకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

20, జులై 2026

తక్కువ ఎత్తు హైబ్రిడ్ చింత చెట్ల సాగు… చిగురు ద్వారా స్థిర ఆదాయం
వ్యవసాయం

తక్కువ ఎత్తు హైబ్రిడ్ చింత చెట్ల సాగు… చిగురు ద్వారా స్థిర ఆదాయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చింత చిగురుకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉండటంతో తక్కువ ఎత్తు హైబ్రిడ్ చింత చెట్ల సాగు రైతులకు లాభదాయక ప్రత్యామ్నాయంగా మారుతోంది. ప్రూనింగ్ పద్ధతితో చెట్ల ఎత్తు 10–15 అడుగులకే కుదించి, 1–2 ఏళ్లలో చిగురు, 4–5 ఏళ్లలో పండ్లు రావడంతో చిగురు, పండ్లు రెండింటి ద్వారా స్థిర ఆదాయం పొందవచ్చు. తక్కువ నీరు, తక్కువ ఎరువులతో ఎర్ర నేలల్లో డ్రిప్ ఇరిగేషన్ సాయంతో సాగు చేసి, స్థానిక మార్కెట్లు, నగరాల టోకు మార్కెట్లు, ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా విక్రయిస్తే నికర లాభం మరింత పెరిగే అవకాశం ఉంది.

19, జులై 2026

ఆక్వా సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా!  వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్
రాజకీయాలు

ఆక్వా సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా! వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్

రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, ఫీడ్ కంపెనీలు, కొనుగోలు సిండికేట్లు, ప్రభుత్వ నిర్లక్ష్యం కలిసి రైతుల జీవితాలను దెబ్బతీశాయని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

15, జులై 2026

అక్టోబర్‌లో పీఎం కిసాన్ 24వ విడత నిధులు
జాతీయం

అక్టోబర్‌లో పీఎం కిసాన్ 24వ విడత నిధులు

అక్టోబర్‌లో పీఎం కిసాన్ పథకం 24వ విడత నిధులు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. గత 23వ విడతలో సాంకేతిక లోపాల వల్ల డబ్బులు అందని రైతులు పీఎం కిసాన్ పోర్టల్, గ్రామ వాలంటీర్లు, బ్యాంకుల ద్వారా తమ ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఈకేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ సరిచేసుకుంటే కొత్త విడత నిధులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందే అవకాశం ఉంటుంది.

13, జులై 2026

రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు శ్రీకారం
రాజకీయాలు

రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు శ్రీకారం

హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల రైతులకు సాగునీటిని మరింత మెరుగ్గా అందించేందుకు రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ పనులను ప్రారంభించారు.

12, జులై 2026

సత్యసాయి జిల్లాలో హంద్రీనీవా కాలువ విస్తరణకు శ్రీకారం
జిల్లా వార్తలు

సత్యసాయి జిల్లాలో హంద్రీనీవా కాలువ విస్తరణకు శ్రీకారం

సత్యసాయి జిల్లాలో హంద్రీనీవా కాలువ విస్తరణ పనులకు రాచపల్లి వద్ద భూమిపూజ నిర్వహించారు. మడకశిర నుంచి రాచపల్లి వరకు సుమారు రూ.750 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ విస్తరణ ద్వారా కాలువ సామర్థ్యం పెరిగి, మరిన్ని గ్రామాల రైతులకు అదనపు సాగునీటి సదుపాయాలు లభించే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

12, జులై 2026

అరటి ధరల పెరుగుదలతో రైతులకు ఊరట
వ్యవసాయం

అరటి ధరల పెరుగుదలతో రైతులకు ఊరట

కర్నూలు జిల్లాలో అరటి ధరలు టన్నుకు రూ.30–34 వేల వరకు పెరగడంతో ఇటీవల వరకూ నష్టాల్లో ఉన్న రైతులకు కొంత ఊరట లభిస్తోంది. వేసవి ఉష్ణోగ్రతలు, వైరస్‌ దెబ్బలతో దిగుబడి తగ్గిపోవడం, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి డిమాండ్‌ పెరగడం వల్ల ధరలు ఎగసి, చెన్నై, నెల్లూరు, ముంబయి, పుణె నగరాలకు ఎగుమతులు పెరిగి, ప్రస్తుత ధరలు కొనసాగితే గత నష్టాలను కొంత భర్తీ చేసుకునే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.

11, జులై 2026

సంఘ విద్రోహులను ప్రోత్సహించవద్దు : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

సంఘ విద్రోహులను ప్రోత్సహించవద్దు : సీఎం చంద్రబాబు

గత పాలకులు చేసిన పాపాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించిన సీఎం.. రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దు. కుల, మతాలను విభజించడానికి వీల్లేదు...

9, జులై 2026

ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. : మంత్రి నాదెండ్ల మనోహర్
రాజకీయాలు

ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. : మంత్రి నాదెండ్ల మనోహర్

గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలను అమలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తోందని తెలిపారు.

9, జులై 2026

ఆధునిక సాంకేతికతతో రైతులకు అధిక దిగుబడులు : జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్
జిల్లా వార్తలు

ఆధునిక సాంకేతికతతో రైతులకు అధిక దిగుబడులు : జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్

జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్ ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సమతుల్య పోషక నిర్వహణ, సేంద్రియ సాగు, నీటి పొదుపు విధానాలు అవలంబిస్తే రైతులకు అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధ్యమవుతుందని తెలిపారు. వీరపునాయునిపల్లె మండలం పాలగిరి గ్రామంలోని ఆర్‌ఎం కిసాన్ సెంటర్, కృషి విజ్ఞాన కేంద్రం–బారామతి భాగస్వామ్యంతో ఉచిత శిక్షణలు, వినూత్న వ్యవసాయ పద్ధతుల ద్వారా దేశ రైతాంగానికి ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరవేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

8, జులై 2026

ఉల్లి రైతులకు ఊరటగా కేంద్ర నిర్ణయం : కనీస మద్దతు ధర పెంపు
వ్యవసాయం

ఉల్లి రైతులకు ఊరటగా కేంద్ర నిర్ణయం : కనీస మద్దతు ధర పెంపు

ఉల్లి బఫర్ స్టాక్ కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను క్వింటాల్‌కు 13 శాతం పెంచి రూ.1,875 నుంచి రూ.2,125కు పెంచింది. ఈ సీజన్‌లో ఇది ఐదోసారి చేసిన పెంపు కాగా, ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో రైతులకు కొంత ఊరట కలిగించడంతో పాటు మార్కెట్ ధరలను సమతుల్యం చేయడంలో ఈ నిర్ణయం దోహదం చేస్తుందని రైతులు భావిస్తున్నారు.

4, జులై 2026

అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రైతులకు కలెక్టర్‌ పిలుపు
జిల్లా వార్తలు

అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రైతులకు కలెక్టర్‌ పిలుపు

చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ కుప్పం మండలం పొగురుపల్లిలో పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులు, గ్రామస్తులతో సమావేశమై, ఐకమత్యంగా ఉండి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులు లేవనెత్తిన 33 సమస్యలను నమోదు చేసి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, పరిశ్రమల వల్ల ఉద్యోగాలు, మౌలిక వసతులు మెరుగుపడతాయని, అభివృద్ధి ప్రక్రియలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

3, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters