బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సీట్ల

17 articles

కడపలో కాంగ్రెస్‌కు 30 సీట్లు ఖాయం: డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతి
జిల్లా వార్తలు

కడపలో కాంగ్రెస్‌కు 30 సీట్లు ఖాయం: డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతి

కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ 3వ విడత "ఇంటింటికీ కాంగ్రెస్" కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించి, ప్రజలకు పార్టీ విధానాలు, భవిష్యత్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించింది. డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి కడప కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం 30 డివిజన్లలో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, ప్రతి డివిజన్‌లో పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తున్నారని తెలిపారు.

9, ఆగ 2026

కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో నేడు స్పాట్ అడ్మిషన్లు
జిల్లా వార్తలు

కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో నేడు స్పాట్ అడ్మిషన్లు

కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 4 సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తులు సమర్పించి, అవసరమైన సర్టిఫికెట్లతో ఆగస్టు 5 ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

4, ఆగ 2026

MBBS, BDS కౌన్సెలింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన ఏపీ
విద్య

MBBS, BDS కౌన్సెలింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MBBS, BDS ప్రవేశాల కౌన్సెలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ 2004 ప్రవేశాల నియమాలను సవరించింది. ఇకపై ప్రతి దశ కౌన్సెలింగ్‌కు ముందు అభ్యర్థులు కొత్తగా వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు, మధ్యలో మంజూరయ్యే సీట్లను కూడా అదే దశలో భర్తీ చేస్తారు. కేటాయించిన సీటులో చేరకపోయినా, అదే కాలేజీకి మాత్రమే తరువాతి దశల్లో ఆప్షన్ ఇవ్వలేరు గానీ, ఇతర కాలేజీలకు అవకాశం కొనసాగుతుంది.

31, జులై 2026

తెలంగాణలో TGEAPCET-2026 రెండో విడత ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ పూర్తి
విద్య

తెలంగాణలో TGEAPCET-2026 రెండో విడత ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ పూర్తి

తెలంగాణలో TGEAPCET-2026 రెండో విడత ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌లో 94,424 సీట్లలో 80,167 సీట్లు కేటాయించి, 84.9 శాతం సీట్లు భర్తీ చేశారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ, Artificial Intelligence వంటి కోర్సుల్లో దాదాపు అన్ని సీట్లు నిండగా, EWS కోటాలో 6,329 మంది సీట్లు పొందారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 25లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి, జూలై 24–28 మధ్య కళాశాలలో రిపోర్ట్ చేయాలి.

23, జులై 2026

భారత్‌లో తొలి స్వదేశీ 200 సీట్ల ప్రయాణికుల విమాన ప్రాజెక్టుకు శ్రీకారం
జాతీయం

భారత్‌లో తొలి స్వదేశీ 200 సీట్ల ప్రయాణికుల విమాన ప్రాజెక్టుకు శ్రీకారం

హంస ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ , ఆరున్నొవా ఇంజనీరింగ్ డివిజన్ కలిసి భారత తొలి స్వదేశీ 200 సీట్ల కమర్షియల్ ప్రయాణికుల విమాన అభివృద్ధికి ఫఱంబోరౌగ్ ఇంటర్నేషనల్ ఐర్షో -2026లో MoU కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంతో రూపకల్పన, ధృవీకరణ, తయారీతో పాటు దేశీయ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్, సరఫరా గొలుసు, సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధికి దృష్టి సారించి, భారత విమానయాన పరిశ్రమకు బలమైన పునాది వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

21, జులై 2026

అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా..
రాజకీయాలు

అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీఎంసీ రెబల్ ఎంపీలకు ప్రత్యేక టేబుల్ కేటాయించడంపై ఇండియా కూటమి పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వాకౌట్ చేశాయి. అధికారిక గుర్తింపు లేని NCPI పార్టీ ఎంపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడాన్ని ప్రతిపక్షం ప్రశ్నించగా, కొంతసేపు గందరగోళం తర్వాత తిరిగి సమావేశంలో పాల్గొని వర్షాకాల బిల్లులు, చర్చలపై సమన్వయం కొనసాగించారు.

19, జులై 2026

ఆక్వా సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా!  వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్
రాజకీయాలు

ఆక్వా సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా! వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్

రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, ఫీడ్ కంపెనీలు, కొనుగోలు సిండికేట్లు, ప్రభుత్వ నిర్లక్ష్యం కలిసి రైతుల జీవితాలను దెబ్బతీశాయని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

15, జులై 2026

ఇండియా కూటమికి షాక్! : డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
జాతీయం

ఇండియా కూటమికి షాక్! : డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..

ఈ వర్షాకాల సమావేశాల్లో ఎన్డీయే సర్కార్ మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు(డీలిమిటేషన్ బిల్లు)ను తీసుకురావాలని చూస్తోంది. అయితే, ఈ నేపథ్యంలో బీజేపీకి అనూహ్య మద్దతు లభిస్తోంది.

15, జులై 2026

ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌ఎంసీ తీపికబురు: అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లు
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌ఎంసీ తీపికబురు: అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లు

జాతీయ వైద్య కమిషన్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌కు 2026-27 విద్యా సంవత్సరానికి అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75 సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 25 సీట్లు పెంచడంతో అక్కడి సీట్ల సంఖ్య వరుసగా 250, 200కు చేరగా, వైద్య విద్యలో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

11, జులై 2026

రైలు టికెట్‌ బుకింగ్‌ ఇక మరింత సులభం
జాతీయం

రైలు టికెట్‌ బుకింగ్‌ ఇక మరింత సులభం

రైలు టికెట్‌ బుకింగ్‌ను సులభతరం చేసేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునికీకరిస్తున్నారు. కొత్త బీటా వెర్షన్‌లో అనవసర క్యాప్చాలు, పాప్‌అప్‌లు, మెరుస్తూ ఉండే గ్రాఫిక్స్‌ను తొలగించి, అన్ని క్లాసుల్లో సీట్ల లభ్యతను ఒకే స్క్రీన్‌పై చూపించేలా రూపకల్పన చేశారు. ప్రయాణికుల రిజర్వేషన్‌ ఇంజిన్‌, రైల్‌వన్‌ యాప్‌ ఆధారిత సేవలను కూడా నవీకరిస్తుండగా, కొత్త వ్యవస్థతో సేవల వేగం, అందుబాటు మెరుగుపడనుందని అధికారులు తెలిపారు.

11, జులై 2026

జవహర్‌ నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా వార్తలు

జవహర్‌ నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం బనవాసిలో 2027-28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం ప్రకటించారు. జిల్లాకు చెందిన, గుర్తింపు పొందిన పాఠశాలలో 2026-27లో ఐదో తరగతి చదువుతున్న, జన్మతేదీ 1-5-2015 నుంచి 31-7-2017 మధ్యలో ఉన్న విద్యార్థులు 31-7-2026లోపు navodaya.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షను 28-11-2026న నిర్వహించి మెరిట్ ఆధారంగా 80 సీట్లను కేటాయించనున్నారు.

8, జులై 2026

33 % రిజర్వేషన్ అమలైతే..  ఏపీలో ఆ సీట్లు వారికే..
రాజకీయాలు

33 % రిజర్వేషన్ అమలైతే.. ఏపీలో ఆ సీట్లు వారికే..

రాష్ట్రంలో 33 % మహిళా రిజర్వేషన్ అమలైతే రాజకీయంగా కీలకమైన పలు అసెంబ్లీ నియోజక వర్గాలు మహిళలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నన్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది.

29, జూన్ 2026

టీజీఎప్ సెట్ ఇంజినీరింగ్ అడ్మిషన్లు: వెబ్ ఆప్షన్లు జూన్ 25 నుంచి
విద్య

టీజీఎప్ సెట్ ఇంజినీరింగ్ అడ్మిషన్లు: వెబ్ ఆప్షన్లు జూన్ 25 నుంచి

టీజీఎప్ సెట్ ద్వారా ఇంజినీరింగ్ అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్ల నమోదు జూన్ 25 నుంచి జూలై 1 వరకు జరగనుందని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. రాష్ట్రంలోని 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 1,14,007 సీట్లలో 81,620 కన్వీనర్ కోటా సీట్లు ఉండగా, మెజార్టీ సీట్లు కంప్యూటర్ సైన్స్, అనుబంధ బ్రాంచ్‌ల్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు 84,002 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు జూన్ 29 వరకు గడువు ఉంది.

25, జూన్ 2026

కాంగ్రెస్‌ తన వైఖరి మార్చుకుందా?.. ప్రణబ్‌ తప్పుచెప్పారా?
రాజకీయాలు

కాంగ్రెస్‌ తన వైఖరి మార్చుకుందా?.. ప్రణబ్‌ తప్పుచెప్పారా?

లోక్‌సభ నియోజకవర్గాల పెంపు అంశంపై కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశిస్తూ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో మరో పోస్ట్‌ పెట్టారు. కాంగ్రెస్‌ ఎంపీలు శశిథరూర్‌, జైరాం రమేశ్‌ను ప్రశ్నిస్తూ వారి ఖాతాలను ట్యాగ్‌ చేశారు.

18, జూన్ 2026

హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
తెలంగాణ

హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీలో టెస్లా తన ఐదో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించి తాజా Model Y కార్లను ప్రదర్శనకు ఉంచింది. బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రత్యేక డెలివరీ, After-sales services కేంద్రాన్ని ఏర్పాటు చేసిన టెస్లా, రూ.50.89 లక్షల నుంచి ధరలు ప్రారంభమయ్యే కార్ల డెలివరీలను జూలై 2026 నుంచి ప్రారంభించనుంది. జూన్ 30లోపు బుకింగ్ చేసే కస్టమర్లకు ఉచిత హోమ్ ఛార్జింగ్ వాల్ కనెక్టర్ ఆఫర్‌తో నగర ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కు కొత్త ఊపు రానుందని భావిస్తున్నారు.

18, జూన్ 2026

ఆర్టీసీ బస్సుల్లో బంగారం దొంగతనాలు : ముగ్గురు మహిళల అరెస్ట్
జిల్లా వార్తలు

ఆర్టీసీ బస్సుల్లో బంగారం దొంగతనాలు : ముగ్గురు మహిళల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీని ఆసరాగా చేసుకుని మహిళల బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న చిత్తూరు జిల్లా మహిళల గ్యాంగ్‌ను పాకాల పోలీసులు అరెస్టు చేశారు. జి.దివ్య, బి.రాధిక, బి.మేరి అనే ముగ్గురి వద్ద నుంచి 3.5 లక్షల విలువైన 32 గ్రాముల డైమండ్ గోల్డ్ నెక్లెస్ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించి, రద్దీ బస్సుల్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

10, జూన్ 2026

తెలంగాణ పీజీ ఈసెట్‌–2026 ఫలితాలు విడుదల
విద్య

తెలంగాణ పీజీ ఈసెట్‌–2026 ఫలితాలు విడుదల

తెలంగాణ పీజీ ఈసెట్‌–2026 ఫలితాలను అధికారికంగా విడుదల చేసి, పరీక్ష రాసిన అభ్యర్థుల వ్యక్తిగత ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాల ఆధారంగా అర్హత సాధించినవారికి మాత్రమే కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపులో పాల్గొనే అవకాశం ఉండగా, ఆన్‌లైన్‌ నమోదు నుంచి సీట్ల కేటాయింపు వరకు దశలవారీ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters