రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆదివారం సరికొత్త హరిత విప్లవం ప్రారంభమైంది. అహ్మదాబాద్ నగరం అంతటా 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న'మిషన్ 5 మిలియన్ ట్రీస్' కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రారంభించారు. నగరంలోని సైన్స్ సిటీ ప్రాంతంలో జరిగిన ఈ సామూహిక ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, పలు ప్లాంటేషన్ ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన బస్సులను కూడా జెండా ఊపి ప్రారంభించారు.







