బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#శంకుస్థాపన

25 articles

కర్నూలు కేసీ కెనాల్ వద్ద సుద్దవాగు రక్షణ గోడకు శంకుస్థాపన
జిల్లా వార్తలు

కర్నూలు కేసీ కెనాల్ వద్ద సుద్దవాగు రక్షణ గోడకు శంకుస్థాపన

కర్నూలు కేసీ కెనాల్ సమీపంలోని సుద్దవాగు వద్ద వరద సమస్యలకు శాశ్వత పరిష్కారంగా రూ.2.50 కోట్ల వ్యయంతో 250 మీటర్ల రక్షణ గోడ నిర్మాణానికి మంత్రి టీ.జీ. భరత్ శంకుస్థాపన చేశారు. దోమల లార్వా నిర్మూలన కోసం బీటీఐ జీవ లార్విసైడ్ పిచికారీని పరిశీలించిన మంత్రి, నగరంలోని పాత సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కర్నూలు అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, నారా లోకేష్ కీలకంగా కృషి చేస్తున్నారని తెలిపారు.

30, జులై 2026

మైదుకూరు నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన
జిల్లా వార్తలు

మైదుకూరు నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన

మైదుకూరు నియోజకవర్గంలోని తిప్పిరెడ్డిపల్లె–ముదిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకం పనులకు రూ.8.90 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్న ఈ కార్యక్రమంతో రెండు గ్రామాల చెరువులు నీటితో నిండిపోయి వేలాది ఎకరాలకు శాశ్వత సాగునీటి వసతి కలుగుతుందని, రైతు సంక్షేమం, నీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు.

30, జులై 2026

అందెశ్రీ నాకు ఆత్మబంధువు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
తెలంగాణ

అందెశ్రీ నాకు ఆత్మబంధువు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘట్‌కేసర్‌లో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ జయంతి సందర్భంగా స్మృతి వన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, భూమి పూజ నిర్వహించారు. అందెశ్రీ తనకు ఆత్మబంధువుగా మారారని, తన రాజకీయ ప్రయాణానికి ఆయన గానం, స్ఫూర్తి పెద్ద ఆధారమని ముఖ్యమంత్రి భావోద్వేగంగా గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు, గొంతులు అర్పించిన తొమ్మిది కుటుంబాలకు ఒక్కొక్కటికి కోటి రూపాయలు అందజేసిన విషయాన్ని, “జయ జయహే తెలంగాణ” గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన సందర్భాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

19, జులై 2026

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం
జాతీయం

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం

హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో నేడు జింద్–సోనిపత్ మధ్య నడిచే దేశ తొలి హైడ్రోజన్ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 10 కోచ్‌లతో నడిచే ఈ పర్యావరణహిత రైలు ద్వారా డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించి, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

17, జులై 2026

దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే!: మంత్రి లోకేశ్‌
రాజకీయాలు

దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే!: మంత్రి లోకేశ్‌

రాష్ట్రంలో అనుమతులు త్వరగా ఇవ్వడం వల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలను తీసుకొస్తున్నామని చెప్పారు.

15, జులై 2026

ఫ్యూచర్‌సిటీలో అమెజాన్‌ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
తెలంగాణ

ఫ్యూచర్‌సిటీలో అమెజాన్‌ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

హైదరాబాద్‌ ఫ్యూచర్‌సిటీలో అమెజాన్‌ కొత్త డేటా సెంటర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 202 ఎకరాల్లో నిర్మించనున్న ఈ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ కోసం అమెజాన్‌ వచ్చే 12 ఏళ్లలో రూ.60వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఫ్యూచర్‌సిటీ, చందనవెల్లి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు హైదరాబాద్‌ను గ్లోబల్‌ డేటా, క్లౌడ్‌ హబ్‌గా మరింత బలోపేతం చేయనుందని అధికారులు భావిస్తున్నారు.

15, జులై 2026

మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు బాలకృష్ణ, నిమ్మల భూమిపూజ
జిల్లా వార్తలు

మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు బాలకృష్ణ, నిమ్మల భూమిపూజ

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని రాచనపల్లిలో మడకశిర బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.790 కోట్ల వ్యయంతో 71 కిలోమీటర్ల మేర చేపడుతున్న ఈ పనులు పూర్తయ్యాక కాలువ నీటి వహన సామర్థ్యం పెరిగి, హిందూపురం, మడకశిర ప్రాంతాల్లో తాగునీటి, సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

13, జులై 2026

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు..   రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
వ్యవసాయం

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!

గోదావరి డెల్టాకు జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిరంతర వినియోగంలో ఉన్న ఈ కీలక జలవనరుల నిర్మాణానికి సమగ్ర మరమ్మత్తులు, ఆధునీకరణ పనులు చేపట్టేందుకు రూ.152.95 కోట్ల అనుమతులు మంజూరు చేశారు.

13, జులై 2026

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతులమీదుగా 'మిషన్ 5 మిలియన్ ట్రీస్'
జాతీయం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతులమీదుగా 'మిషన్ 5 మిలియన్ ట్రీస్'

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సరికొత్త హరిత విప్లవం ప్రారంభమైంది. నగరం అంతటా 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న'మిషన్ 5 మిలియన్ ట్రీస్' కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.

12, జులై 2026

రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు శ్రీకారం
రాజకీయాలు

రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు శ్రీకారం

హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల రైతులకు సాగునీటిని మరింత మెరుగ్గా అందించేందుకు రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ పనులను ప్రారంభించారు.

12, జులై 2026

జులై 18న మదనపల్లెకు సీఎం చంద్రబాబు పర్యటన
జిల్లా వార్తలు

జులై 18న మదనపల్లెకు సీఎం చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 18న మదనపల్లె పర్యటనలో ఇంటిగ్రేటెడ్‌ హార్టికల్చర్‌ హబ్‌కు శంకుస్థాపన చేసి, రాష్ట్రంలో ఆదర్శ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ‘జలధార’ పనులను పరిశీలించనున్నారు. రైతులకు సేవలు, పంటల నిల్వ, ప్రాసెసింగ్‌, నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ వంటి అంశాల పురోగతిపై ఆయన అధికారుల నుంచి వివరాలు తెలుసుకోనుండగా, అధికారిక షెడ్యూల్‌ త్వరలో విడుదల కానుంది.

12, జులై 2026

14న మంత్రి నారా లోకేష్ జమ్మలమడుగు రాక
జిల్లా వార్తలు

14న మంత్రి నారా లోకేష్ జమ్మలమడుగు రాక

మంత్రి నారా లోకేశ్ ఈ నెల 14, 15 తేదీల్లో జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో పర్యటించి చిన్న కొమెర్ల పరిధిలో దాల్మియా సెకండ్ ప్లాంట్ విస్తరణ శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్లాంట్ విస్తరణతో పారిశ్రామిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానికులు ఆశిస్తున్న నేపథ్యంలో, లోకేశ్ మైదుకూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు.

8, జులై 2026

కుప్పంలో ఆధునిక బస్ స్టేషన్–డిపోకు శంకుస్థాపన
జిల్లా వార్తలు

కుప్పంలో ఆధునిక బస్ స్టేషన్–డిపోకు శంకుస్థాపన

చిత్తూరు జిల్లా కుప్పంలో ఆధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని, కొత్త ప్రాజెక్టుతో కుప్పం పట్టణం, పరిసర గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార అభివృద్ధి కలుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

4, జులై 2026

ఒకటి... రెండు... మూడు... నాలుగు... ఇదిగో ఐదో టెంకాయ! మరి ఉక్కు ఏది?
రాజకీయాలు

ఒకటి... రెండు... మూడు... నాలుగు... ఇదిగో ఐదో టెంకాయ! మరి ఉక్కు ఏది?

జమ్మలమడుగులో కడప ఉక్కు కర్మాగారం పేరుతో 19 ఏళ్లలో ఐదు శంకుస్థాపనలు జరిగి, ఒక్క ప్లాంటు కూడా రాకపోవడంపై సీమ ప్రజలు విసుగు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్, చంద్రబాబు, జగన్, మళ్లీ చంద్రబాబు ఇలా ముఖ్యమంత్రులు, పార్టీలు మారినా శిలాఫలకాలు, భూదందాలు, కాంట్రాక్టులే పండాయని, యువతకు ఉద్యోగాలు, ప్రాంతానికి నిజమైన అభివృద్ధి మాత్రం అందలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

2, జులై 2026

తిరుపతి జిల్లాలో  సీఎం చంద్రబాబు పర్యటన
జిల్లా వార్తలు

తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు రోజుల సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. తిరుపతిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, జూలై 3 నుంచి 5 వరకు కుప్ప నియోజకవర్గంలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అధికారులతో సమీక్షలు, పార్టీ నేతలతో సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించి అభివృద్ధి, స్థానిక రాజకీయాలపై దిద్దుబాటు చర్యలకు రూపకల్పన చేయాలని ప్రభుత్వం, పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

1, జులై 2026

కడప స్టీల్ ప్లాంట్ పనులకు జూలై 3న ముహూర్తం ఫిక్స్
బిజినెస్

కడప స్టీల్ ప్లాంట్ పనులకు జూలై 3న ముహూర్తం ఫిక్స్

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. జూలై 3న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు నంద్యాల ఎంపీ శబరి తెలిపారు.

30, జూన్ 2026

చిత్తూరులో హీరో మోటార్స్‌ జీపీసీ–2.0: రూ.750 కోట్ల పెట్టుబడి, 4 వేల మందికి ఉపాధి
జిల్లా వార్తలు

చిత్తూరులో హీరో మోటార్స్‌ జీపీసీ–2.0: రూ.750 కోట్ల పెట్టుబడి, 4 వేల మందికి ఉపాధి

చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెంలో హీరో మోటార్స్‌ గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌–2.0కు రూ.750 కోట్ల పెట్టుబడితో జూలై 1న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత సుమారు 4 వేల మందికి ఉద్యోగాలు కలుగనున్నాయి. పారిశ్రామికాభివృద్ధి, స్థానిక యువత ఉపాధి పెంపుకు ఈ ప్రాజెక్టు కీలకమని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

30, జూన్ 2026

‘సీమలో’ ఉద్యాన హబ్‌ : రాయలసీమకు  కోట్ల పెట్టుబడి
జిల్లా వార్తలు

‘సీమలో’ ఉద్యాన హబ్‌ : రాయలసీమకు కోట్ల పెట్టుబడి

రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఉద్యాన హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జొన్నగిరిలో బంగారం కర్మాగారాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, త్వరలో ఈ హబ్‌కు శంకుస్థాపన చేసి, ప్రాసెసింగ్‌ నుంచి ఎగుమతుల వరకు సమగ్ర సదుపాయాలు కల్పించి రైతుల ఆదాయం, ఉపాధి పెంపు లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.

25, జూన్ 2026

జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం బాబు
జిల్లా వార్తలు

జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం బాబు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు.

24, జూన్ 2026

జులై 3న కడప ఉక్కు కర్మాగారానికి పునాది రాయి
జిల్లా వార్తలు

జులై 3న కడప ఉక్కు కర్మాగారానికి పునాది రాయి

కడప ఉక్కు కర్మాగారానికి జులై 3న జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదండలూరు పరిసరాల్లో పునాది రాయి వేయనున్నారు. రూ.16,350 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేసే ఈ మెగా స్టీల్ ప్లాంట్‌కు గండికోట జలాశయం నుంచి నీటి సరఫరా, 1,100 ఎకరాల భూబదిలీ పూర్తి కాగా, 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో వేలాది మందికి ఉపాధి కలిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

24, జూన్ 2026

భూమయ్యగారిపల్లెలో ఆలయ ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

భూమయ్యగారిపల్లెలో ఆలయ ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌

పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమయ్యగారిపల్లెలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి చేరుకుని కలశ స్థాపన, సుదర్శన హోమం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బండలాగుడు మైదానంలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించి, తరువాత ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేయనున్నారు.

24, జూన్ 2026

మంగళగిరి–తాడేపల్లి యూజీడీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి–తాడేపల్లి యూజీడీ ప్రాజెక్టుకు శంకుస్థాపన

మంగళగిరి–తాడేపల్లి యూజీడీ ప్రాజెక్టు మొదటి దశ పనులకు మంత్రి నారా లోకేష్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రూ.1,167.50 కోట్ల వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను దశలవారీగా ఏర్పాటు చేసి, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

17, జూన్ 2026

రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ శంకుస్థాపన చేశారు. రూ.142 కోట్ల వ్యయంతో, 767.50 మీటర్ల పొడవు, నాలుగు లైన్ల రహదారితో నిర్మించనున్న ఈ ఆర్వోబీ పూర్తయ్యాక మంగళగిరి, నిడమర్రు, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం అవడంతో పాటు ప్రయాణ సమయం, అత్యవసర సేవల చేరిక గణనీయంగా మెరుగుపడనుంది.

17, జూన్ 2026

వచ్చే 24 నెలలు రాజకీయాలకు బ్రేక్ : సీఎం రేవంత్ సందేశం
తెలంగాణ

వచ్చే 24 నెలలు రాజకీయాలకు బ్రేక్ : సీఎం రేవంత్ సందేశం

సైబరాబాద్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 1.34 కోట్ల మందికి మౌలిక వసతులు కల్పించేందుకు మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే 24 నెలలు రాజకీయాలకు పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని, కేసీఆర్ పదేళ్ల పాలన, మోదీ పన్నెండేళ్ల పాలన, తమ 30 నెలల పాలనపై తులనాత్మక చర్చకు సిద్ధమని పేర్కొన్నారు.

9, జూన్ 2026

కోహెడలో రూ.2,300 కోట్లతో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌
తెలంగాణ

కోహెడలో రూ.2,300 కోట్లతో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోహెడలో 240 ఎకరాల్లో రూ.2,300 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి సమీకృత పండ్ల మార్కెట్‌కు, సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. వచ్చే రెండేళ్లలో మార్కెట్‌ను పూర్తిగా అభివృద్ధి చేసి, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ, హైదరాబాద్ పరిసరాల్లో అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters