మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నిషమ్‌ బషీర్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఐ, నోబడీ’ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌, యాక్షన్‌ సన్నివేశాల అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

యాక్షన్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా స్వయంగా నటించడం తనకు అలవాటని, ఆ అలవాటే ఒకసారి పెద్ద గాయానికి కారణమైందని ఆయన గుర్తుచేసుకున్నారు. 2023లో ఓ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన సంఘటనను వివరించారు.

‘ఐ, నోబడీ’ సినిమా స్వరూపం, కథా నిర్మాణం గురించి కూడా పృథ్వీరాజ్‌ వివరించారు. ఈ చిత్రం ఒక్క జానర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, పలు కోణాల్లో సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

పృథ్వీరాజ్‌తో పాటు ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, హకీం‌ షాజహాన్‌, అశోకన్‌, విజయ రాఘవన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్‌, సామాజిక అంశాలు, థ్రిల్లింగ్‌ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు చిత్రబృందం తెలిపింది.