బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#దిల్లీలో

18 articles

భారత్‌తో టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మార్పు యోచనలో అఫ్గానిస్థాన్
క్రీడలు

భారత్‌తో టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మార్పు యోచనలో అఫ్గానిస్థాన్

సెప్టెంబరులో దిల్లీలో జరగనున్న భారత్‌–అఫ్గానిస్థాన్‌ మూడు టీ20ల సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పు చేసే ఆలోచనలో ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ఉంది. వినాయక చవితి అయిన సెప్టెంబరు 14న ప్రేక్షకులు, టెలివిజన్‌ వీక్షణలు పెరుగుతాయని భావించి మొదటి లేదా రెండో మ్యాచ్‌ను ఆ రోజుకు మార్చే ప్రతిపాదనను బీసీసీఐకి పంపింది, ఆమోదం లభించిన తర్వాతే తేదీల మార్పుపై స్పష్టత రానుంది.

14, ఆగ 2026

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్‌
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్‌ లభించగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీకి 5వ సీడింగ్‌, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌కు 14వ సీడింగ్‌ దక్కింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో జంట 15వ సీడ్‌గా బరిలోకి దిగనుండగా, ఈ టోర్నీ దిల్లీలో జరగడం భారత షట్లర్లకు అదనపు ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

5, ఆగ 2026

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌
జాతీయం

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌

నీట్‌ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దిల్లీలోని జంతరమంతర్‌ వద్ద మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.

23, జులై 2026

భద్రతా కారణాలతో దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత
జాతీయం

భద్రతా కారణాలతో దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత

దిల్లీలో భద్రతా కారణాల వల్ల రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్‌, మండీ హౌస్‌ సహా 16 మెట్రో స్టేషన్లను DMRC తాత్కాలికంగా మూసివేసింది. స్టేషన్లలో ప్రవేశం, నిష్క్రమణ నిలిపివేసినా, రాజీవ్ చౌక్, మండీ హౌస్‌, సెంట్రల్ సెక్రటేరియట్‌లో ఇంటర్‌ఛేంజ్‌ సౌకర్యం కొనసాగుతుంది. నిరసన కార్యక్రమాల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

22, జులై 2026

దీక్ష విరమణకు సోనమ్ వాంగ్‌చుక్ మూడు షరతులు
జాతీయం

దీక్ష విరమణకు సోనమ్ వాంగ్‌చుక్ మూడు షరతులు

దేశ విద్యా వ్యవస్థ వైఫల్యాలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై నిరసనగా 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణకు మూడు షరతులు పెట్టారు. కేంద్రం విద్యా వైఫల్యాలు, నీట్ లీక్‌పై పూర్తి బాధ్యత వహించాలి, పార్లమెంట్‌లో ఈ అంశాన్ని బలంగా లేవనెత్తుతామని రాజకీయ నాయకులు హామీ ఇవ్వాలి, తాను మార్చ్‌లో పాల్గొనలేకపోతే అగ్రనేతలు ఆసుపత్రికి వచ్చి వ్యక్తిగతంగా భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

20, జులై 2026

‘రామాయణ’లో శ్రీరాముడి పాత్ర.. నాకు దక్కడం అదృష్టం: రణ్‌బీర్‌ కపూర్‌
సినిమా

‘రామాయణ’లో శ్రీరాముడి పాత్ర.. నాకు దక్కడం అదృష్టం: రణ్‌బీర్‌ కపూర్‌

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘రామాయణ’పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దిల్లీలో జరిగిన ‘ప్రథమ్‌ సంకల్ప్‌’ కార్యక్రమంలో రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి తమ పాత్రలను పోషించడం అదృష్టంగా భావిస్తూ అనుభవాలు పంచుకున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో ‘రామాయణ: పార్ట్‌ 1’ను దీపావళి సందర్భంగా నవంబరులో విడుదల చేయాలని బృందం నిర్ణయించింది.

19, జులై 2026

ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు..
జాతీయం

ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు..

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, గుజరాత్‌లోని సూరత్, ఉత్తర్ ప్రదేశ్‌లలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల జనజీవనం అతలాకుతలమైంది, పలువురు మృతి చెందగా రహదారులు, విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నాయి. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించి, Char Dham Yatraకు అంతరాయం కలిగించి, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

10, జులై 2026

సిందూర్‌లో అమరుల జాబితా.. : అధికారికంగా ప్రకటించిన కేంద్రం
జాతీయం

సిందూర్‌లో అమరుల జాబితా.. : అధికారికంగా ప్రకటించిన కేంద్రం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై జరిపిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో మన దేశం కొంతమంది వీరజవాన్లను కోల్పోయింది. దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన ఆ అమరవీరుల పేర్లను కేంద్రం ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది.

26, జూన్ 2026

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
సినిమా

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. సినీ నటుడు మమ్ముట్టికి, గాయని అల్కా యాజ్ఞిక్‌కు పద్మభూషణ్‌, నటుడు ఆర్‌. మాధవన్‌కు పద్మశ్రీ లభించాయి. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని సత్కరించిన ఈ వేడుక సాంస్కృతిక వర్గాలకు ప్రేరణగా నిలిచిందని భావిస్తున్నారు.

24, జూన్ 2026

వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌లో మెరిసిన ఆంధ్రప్రదేశ్‌ యువతులు
జిల్లా వార్తలు

వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌లో మెరిసిన ఆంధ్రప్రదేశ్‌ యువతులు

దిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-26లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కడప జిల్లా వెంకట సాహిత్య, అన్నమయ్య జిల్లా తన్మయి ప్రతిభ కనబరచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మై భారత్ ఆధ్వర్యంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎంపికైన యువత సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య అంశాలపై చర్చించగా, యువత నాయకత్వం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించారు.

16, జూన్ 2026

దేశ సమగ్రతకే ప్రాధాన్యం: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు:  పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

దేశ సమగ్రతకే ప్రాధాన్యం: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు: పవన్‌ కల్యాణ్‌

జనసేన 12 ఏళ్ల ప్రయాణాన్ని దిల్లీలో సమీక్షించిన పవన్‌ కల్యాణ్‌ పార్టీ స్థాపన వెనుక దేశ సమగ్రత, శ్రేయస్సే లక్ష్యమని, అధికార లెక్కలు అప్పట్లో లేవని చెప్పారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లోనూ ఏడు ప్రాథమిక సూత్రాలను వదలకుండా 21 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం, సభ్యత్వం లక్ష నుంచి 20 లక్షలకు పెరగడం ప్రజల మద్దతుకి నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే ప్రాధాన్యం ఇస్తామని, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాలేదని, ఆంధ్రప్రదేశ్‌ విభజన విధానానికే తమ ఆవేదననని స్పష్టం చేశారు.

15, జూన్ 2026

విడాకుల కోసం ఐదేళ్లు … చివరికి మళ్లీ ఒక్కటైన దంపతులు
గుడ్ న్యూస్

విడాకుల కోసం ఐదేళ్లు … చివరికి మళ్లీ ఒక్కటైన దంపతులు

దిల్లీలో ఐదేళ్లుగా విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరిగిన సౌరభ్–శిఖ దంపతులు చివరికి మళ్లీ ఒక్కటయ్యారు. కేసు ఖర్చుల ఒత్తిడితో శిఖ తండ్రికి గుండెపోటు రావడంతో, సౌరభ్ ఆయనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కల్పించడంపై ఇరువురి కుటుంబాల మధ్య వాతావరణం మారి, ఫ్యామిలీ కోర్టులోనే విడాకుల పత్రాలు చించి కలిసి జీవించాలని నిర్ణయించినట్టు సమాచారం.

14, జూన్ 2026

భారత్‌లో Google Cloud సేవలకు అంతరాయం
బిజినెస్

భారత్‌లో Google Cloud సేవలకు అంతరాయం

దిల్లీలోని థర్డ్ పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం కారణంగా అక్కడి నెట్‌వర్క్ పరికరాలను నిలిపివేయడంతో భారత్‌లో గూగుల్ క్లౌడ్ ఆధారిత సేవలకు అంతరాయం ఏర్పడింది. బ్యాంకింగ్, ఈ-కామర్స్, ఆన్‌లైన్ సేవల రంగాల్లో లాగిన్, చెల్లింపులు, డేటా యాక్సెస్‌లో ఆటంకాలు ఎదురయ్యాయని వినియోగదారులు చెబుతున్నారు. అగ్నిప్రమాద కారణాలు, నష్టం వివరాలు ఇంకా వెల్లడించకపోయినా, ప్రభావిత ప్రాంతాల్లో సేవలను త్వరగా పునరుద్ధరించేందుకు గూగుల్ క్లౌడ్ సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయి.

10, జూన్ 2026

విమాన ఇంధనంపై మరో 10% భారం
బిజినెస్

విమాన ఇంధనంపై మరో 10% భారం

దేశీయ విమానయాన సంస్థలకు విమాన ఇంధన ధరలు మరోసారి గణనీయంగా పెరిగి, దిల్లీలో ఏటీఎఫ్‌ లీటరు రూ.115కు చేరాయి. ఏటీఎఫ్‌ ధరల స్థిరీకరణ పథకం కింద మూడు సంవత్సరాలపాటు ఒక స్థాయిలో ధరలను నిలిపే అవకాశం కల్పించగా, ఈ పథకాన్ని ఎంచుకున్న కంపెనీలకు నిర్వహణ వ్యయాలు, టికెట్‌ ఛార్జీలు కొంతవరకు నియంత్రణలో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

10, జూన్ 2026

మహిళా ప్రొఫెసర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు
జాతీయం

మహిళా ప్రొఫెసర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు

దిల్లీలోని శివాజి కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దేబోస్మితా పాల్‌ను పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దంపతులు పాత ఆస్తి వివాదం నేపథ్యంలో వసుంధర ఎనక్లేవ్లో ని ఆమె ఫ్లాట్‌లో కిరాతకంగా హతమార్చారు. CCTV ఫుటేజ్, cab వివరాల ఆధారంగా పోలీసులు వారి కదలికలను ట్రేస్ చేసి, మూడు రోజుల్లోనే బర్ధమాన్లో అరెస్ట్ చేసి, ఆస్తి వివాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

8, జూన్ 2026

రాజధానిలో కొత్త ఇంధన యుగం
జాతీయం

రాజధానిలో కొత్త ఇంధన యుగం

దిల్లీలో పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే భాగంగా E85 ఇంధనాన్ని లీటరుకు సుమారు రూ.82 ధరతో అధికారికంగా ప్రారంభించి, తొలి రిటైల్ పంపును పూసా రోడ్‌లో ప్రారంభించారు. ఎథనాల్ ఆధారిత ఈ మిశ్రమ ఇంధనం వాహనాల కాలుష్యాన్ని, ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

6, జూన్ 2026

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు  ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…
జాతీయం

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…

అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, జంతర్ మంతర్ వద్ద శనివారం జరగనున్న నిరసనలో పాల్గొనడానికి భారత్‌కు వచ్చారు. నీట్, సీబీఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చగా, దీప్కే శాంతియుతంగా, ప్రేమతో ఉద్యమం సాగించాలని మద్దతుదారులకు పిలుపునిచ్చడంతో పాటు ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

6, జూన్ 2026

ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌తో హీరో మోటోకార్ప్‌ కొత్త మోటార్‌సైకిళ్లు
బిజినెస్

ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌తో హీరో మోటోకార్ప్‌ కొత్త మోటార్‌సైకిళ్లు

హీరో మోటోకార్ప్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌లతో స్ప్లెందొర్ + ఫ్లెక్స్ ఫ్యూయల్ , HF డీలక్స్ ఫ్లెక్స్ మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దిల్లీలో ఆవిష్కరించిన ఈ మోడళ్ల ఎక్స్‌షోరూమ్‌ ధరలు వరుసగా రూ.82,810, రూ.72,792గా నిర్ణయించారు. E20 నుంచి E85 వరకు ఇంధన మిశ్రమాలతో నడిచే ఈ బైకులను జులై నుంచి తొలి దశలో దిల్లీ, మహారాష్ట్రలో విక్రయించనున్నారు.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters