బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#జనసేన పార్టీ

24 articles

దివ్యాంగుల జాతీయ టీ–20 క్రికెట్‌కు రావాలంటూ మంత్రికి జనసేన నేత ఆహ్వానం
జిల్లా వార్తలు

దివ్యాంగుల జాతీయ టీ–20 క్రికెట్‌కు రావాలంటూ మంత్రికి జనసేన నేత ఆహ్వానం

తిరుపతిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన జనసేన ఇన్‌చార్జ్ పసుపులేటి హరిప్రసాద్, అక్టోబర్ 13–18 మధ్య మంగళగిరి, అమరావతిలో జరగనున్న 9వ జాతీయ టీ–20 దివ్యాంగుల క్రికెట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. దివ్యాంగ క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి రావడానికి ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు దోహదం చేస్తాయని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు.

24, ఆగ 2026

మదనపల్లెలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీ
జిల్లా వార్తలు

మదనపల్లెలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీ

మదనపల్లెలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అడపా సురేంద్ర నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో చేనేత రంగ ప్రాధాన్యం, కార్మికుల సమస్యలు, మార్కెట్ ఇబ్బందులు, ముడి సరుకుల వ్యయభారం, ఆధునికీకరణ అవసరాలపై చర్చించి, చేనేత ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం, సరైన ధరలు, విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం, అధికారులను కోరారు.

7, ఆగ 2026

డోన్ ఆర్టీసీ బస్టాండ్‌లో మదర్ ఫీడింగ్ రూమ్ ప్రారంభం
జిల్లా వార్తలు

డోన్ ఆర్టీసీ బస్టాండ్‌లో మదర్ ఫీడింగ్ రూమ్ ప్రారంభం

డోన్ ఆర్టీసీ బస్టాండ్‌లో చిన్నారులకు తల్లిపాలు అందించేందుకు ప్రత్యేక మదర్ ఫీడింగ్ రూమ్‌ను ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. జనసేన కార్యకర్త మైకేల్ తన వ్యక్తిగత నిధులతో ఈ గదిని నిర్మించగా, ప్రజా ప్రదేశాల్లో తల్లులకు ఇలాంటి సౌకర్యాలు అవసరమని స్థానికులు అభిప్రాయపడి, ఇతర బస్టాండ్లలో కూడా ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు.

5, ఆగ 2026

జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ: రాష్ట్ర అధికార ప్రతినిధుల వ్యవస్థ రద్దు
ఆంధ్రప్రదేశ్

జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ: రాష్ట్ర అధికార ప్రతినిధుల వ్యవస్థ రద్దు

జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతినిధుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, ప్రస్తుతం ఉన్న 26 మంది ప్రతినిధుల బాధ్యతలను తక్షణం నిలిపివేశారు. కొత్త కమిటీలు ప్రకటించే వరకు టెలివిజన్ డిబేట్లు, మీడియా చర్చల్లో పార్టీ తరఫున ఎవరూ పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేయగా, త్వరలో కొత్త అధికార ప్రతినిధుల జాబితా వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

29, జులై 2026

స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం పెంచుకోవాలి: నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం పెంచుకోవాలి: నాదెండ్ల మనోహర్

నాదెండ్ల మనోహర్ స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం, వ్యక్తిగత నమ్మకం కీలకమని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకే మద్దతు లభిస్తుందని అన్నారు. జనసేనలో గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ వ్యూహాత్మకంగా కృషి చేయాలని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు.

24, జులై 2026

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమిదే విజయం  : మంత్రి కందుల దుర్గేశ్
రాజకీయాలు

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమిదే విజయం : మంత్రి కందుల దుర్గేశ్

జనసేన పార్టీ కోసం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సొంతంగా పనిచేశారని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అందరం సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిత్రపక్ష పార్టీల‌ నేతలను కలుపుకుని ముందుకు సాగాలని నేతలకు సూచించారు.

24, జులై 2026

వర్షాకాల సమావేశాల్లో ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

వర్షాకాల సమావేశాల్లో ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలు రెండింటినీ సమతుల్యం చేస్తూ ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించేలా చర్చల్లో పాల్గొనాలని జనసేన ఎంపీలకు పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు. రైల్వే ప్రాజెక్టులు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల వంటి కీలక అంశాలపై వ్యూహాలను వివరించడంతో పాటు జాతీయ చలన చిత్ర పురస్కారాలు సాధించిన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులను ఆయన అభినందించారు.

19, జులై 2026

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు జనసేన వ్యూహం ఖరారు కానున్న కీలక భేటీ
తెలంగాణ

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు జనసేన వ్యూహం ఖరారు కానున్న కీలక భేటీ

హైదరాబాద్‌లో శనివారం జరగనున్న జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాల కోసం పార్టీ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ ఖరారు చేయనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, విభజన హామీలు, ప్రజా సమస్యలపై లోక్‌సభ, రాజ్యసభలో జనసేన ఎంపీలు ఏకైక వైఖరితో, సమన్వయంతో ఎలా వ్యవహరించాలనే అంశంపై సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.

18, జులై 2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త వ్యూహం.. : మంత్రి నాదెండ్ల మనోహర్
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త వ్యూహం.. : మంత్రి నాదెండ్ల మనోహర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ వ్యూహం పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి బలోపేతం, విజయం ప్రధాన లక్ష్యమని, అవసరమైతే జనసేన ఒక అడుగు వెనక్కు వేయడానికి సిద్ధమని, అయితే కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అవకాశాల కల్పనలో రాజీ ఉండదని స్పష్టం చేశారు.

17, జులై 2026

క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలసి పనిచేయండి! : జనసేన నేతలకు పవన్‌ దిశానిర్దేశం
రాజకీయాలు

క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలసి పనిచేయండి! : జనసేన నేతలకు పవన్‌ దిశానిర్దేశం

జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

10, జులై 2026

మళ్లీ దీక్ష చేపట్టిన పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

మళ్లీ దీక్ష చేపట్టిన పవన్‌ కల్యాణ్‌

ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ మరోసారి దీక్ష చేపట్టారు.. ప్రతి ఏడాది చేపట్టే ఆధ్యాత్మిక దీక్షను ఈసారి కూడా ప్రారంభించారు.

25, జూన్ 2026

జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన రామ్ చరణ్‌
టాలీవుడ్

జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన రామ్ చరణ్‌

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్‌ను ఆయన కార్యాలయంలో రామ్ చరణ్ ఇదే మొదటిసారి కలవడం, అనంతరం ACA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న Andhra Pradesh Premier League‌కు ముఖ్య అతిథిగా హాజరుకావడం అభిమానుల్లో విశేష ఆసక్తిని రేకెత్తించింది.

25, జూన్ 2026

పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ :  25 మంది పరిశీలకుల నియామకం
రాజకీయాలు

పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ : 25 మంది పరిశీలకుల నియామకం

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ, నాయకుల అభిప్రాయాల సేకరణ కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీ పరిశీలకులను నియమించారు.

23, జూన్ 2026

సామాన్యుడి గొంతుకగా.. తెలంగాణలో జనసేన ‘జనవాణి’
తెలంగాణ

సామాన్యుడి గొంతుకగా.. తెలంగాణలో జనసేన ‘జనవాణి’

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కార మార్గాల కోసం కృషి చేయడానికి ‘జనవాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పేదలు, కార్మికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగార్థులు, రైతులు, మహిళలు తదితర వర్గాల నుండి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు, సూచనలు స్వీకరించి, వాటిని వర్గీకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

22, జూన్ 2026

తెలంగాణలో జనసేన కొత్త రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
తెలంగాణ

తెలంగాణలో జనసేన కొత్త రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్ మణికొండలోని మల్కం చెరువు సమీపంలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రత్యేక కార్యాలయం లేని జనసేనకు ఇది శాశ్వత కేంద్రంగా మారనుండగా, రాబోయే GHMC ఎన్నికల వ్యూహాలు, తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఈ కార్యాలయం కీలక మైలురాయిగా విశ్లేషకులు భావిస్తున్నారు.

19, జూన్ 2026

జనసేనలో చేరికలకు గ్రీన్ సిగ్నల్  :  సమన్వయానికి 14 మందితో కమిటీ
రాజకీయాలు

జనసేనలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ : సమన్వయానికి 14 మందితో కమిటీ

జనసేనలో చేరికలను సమన్వయం చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్‌కు 14 మంది సభ్యులతో ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థుల చేరికలను ఈ కమిటీ రూపకల్పన, అమలు, సమన్వయం చేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ నమూనాలోనే త్వరలో తెలంగాణలో కూడా ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

16, జూన్ 2026

దేశ సమగ్రతకే ప్రాధాన్యం: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు:  పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

దేశ సమగ్రతకే ప్రాధాన్యం: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు: పవన్‌ కల్యాణ్‌

జనసేన 12 ఏళ్ల ప్రయాణాన్ని దిల్లీలో సమీక్షించిన పవన్‌ కల్యాణ్‌ పార్టీ స్థాపన వెనుక దేశ సమగ్రత, శ్రేయస్సే లక్ష్యమని, అధికార లెక్కలు అప్పట్లో లేవని చెప్పారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లోనూ ఏడు ప్రాథమిక సూత్రాలను వదలకుండా 21 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం, సభ్యత్వం లక్ష నుంచి 20 లక్షలకు పెరగడం ప్రజల మద్దతుకి నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే ప్రాధాన్యం ఇస్తామని, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాలేదని, ఆంధ్రప్రదేశ్‌ విభజన విధానానికే తమ ఆవేదననని స్పష్టం చేశారు.

15, జూన్ 2026

జనసేన జాతీయ విస్తరణ దిశగా పవన్ ఢిల్లీ పర్యటన
రాజకీయాలు

జనసేన జాతీయ విస్తరణ దిశగా పవన్ ఢిల్లీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి, ఐదు రాష్ట్రాల జనసేన నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ జాతీయ విస్తరణ, సంస్థాగత బలోపేతంపై చర్చించనున్నారు. India Gate సమీపంలో ‘సేన గళం’ కార్యక్రమంతో జనసేన సిద్ధాంతాలు, జాతీయ రాజకీయాల్లో పార్టీ పాత్రను వివరించే ఈ పర్యటనలో MPs, MLAs సహా సుమారు 150 మంది కీలక నేతలు పాల్గొంటుండగా, దీనిని రాజకీయ వర్గాలు జాతీయ విస్తరణకు కీలక అడుగుగా చూస్తున్నాయి.

14, జూన్ 2026

'చింతకాయల'కు లక్కీఛాన్స్!
రాజకీయాలు

'చింతకాయల'కు లక్కీఛాన్స్!

రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు కూటమి నుంచి అభ్యర్థులు ఖరారయ్యారు. ఇందులో ఒకటి జనసేనకు కేటాయించగా మిగిలిన స్థానాలకు తెలుగు దేశం అభ్యర్థులను ప్రకటించింది. సాన సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లను ఎంపిక చేసింది. దీంతో చింతకాయల కు లక్కీఛాన్స్ అని చెప్పవచ్చు. రాజ్యసభ అభ్యర్థిత్వం ఆశించిన వర్ల రామయ్య, రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి లకు నిరాశే మిగిలింది.

7, జూన్ 2026

జనసేన రాజ్యసభగా అభ్యర్థి లింగమనేని నామినేషన్
ఆంధ్రప్రదేశ్

జనసేన రాజ్యసభగా అభ్యర్థి లింగమనేని నామినేషన్

జనసేన తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ అమరావతిలో నామినేషన్ దాఖలు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ లకు చెందిన 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ఆయన నామినేషన్‌ను ప్రతిపాదించి మద్దతు తెలిపారు.

6, జూన్ 2026

వెనక్కు తగ్గని ప్రకాశ్‌ రాజ్‌
రాజకీయాలు

వెనక్కు తగ్గని ప్రకాశ్‌ రాజ్‌

ప్రకాష్ రాజ్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జనసేన నేత నాగబాబు పెట్టిన, నాయకుడిని సందేహాలు లేకుండా మౌనంగా అనుసరించాలనే పోస్ట్‌పై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో నాయకులను ప్రశ్నించడం ప్రజల హక్కు అని, మౌనంగా అనుసరించమనే పిలుపు సరైంది కాదని ఆయన పేర్కొంటూ, తాము జంతువులు కాదని, ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

6, జూన్ 2026

జనసేన–తెలంగాణ రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ ట్వీట్, విష్ణువర్ధన్ రెడ్డి రిప్లైతో ఆన్‌లైన్ హీట్
ఆంధ్రప్రదేశ్

జనసేన–తెలంగాణ రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ ట్వీట్, విష్ణువర్ధన్ రెడ్డి రిప్లైతో ఆన్‌లైన్ హీట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు, అక్కడ జనసేన పోటీ ప్రకటన చుట్టూ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన సెటైరికల్ ట్వీట్‌కు, పవన్ అనుచరుడు బండ్ల గణేష్‌తో పాటు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా ప్రతిస్పందించగా, ఇద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పవన్, జనసేన, తెలంగాణ రాజకీయాలపై ఆన్‌లైన్ చర్చలను మరింత వేడెక్కిస్తున్నాయి.

4, జూన్ 2026

జనసేన పార్టీ నిర్మాణానికి సమాచార సేకరణ కమిటీల నియామకం
ఆంధ్రప్రదేశ్

జనసేన పార్టీ నిర్మాణానికి సమాచార సేకరణ కమిటీల నియామకం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణానికి సమాచార సేకరణ కమిటీలను నియమించి, కేడర్ ఆధారిత నాయకత్వాన్ని బలోపేతం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసిన అంకితభావం గల కార్యకర్తల వివరాలు సేకరించి, భవిష్యత్‌లో పార్టీ బాధ్యతల కేటాయింపులు, నిర్మాణ మార్పులపై తుది నిర్ణయాలు తీసుకునే దిశగా ఈ కమిటీల పనితీరును మార్గనిర్దేశం చేసినట్టు సమాచారం.

4, జూన్ 2026

‘అదే నా రాస్తా’.. శేషేంద్ర కవితను పంచుకున్న పవన్‌ కల్యాణ్‌ పోస్టు వైరల్‌
తెలంగాణ

‘అదే నా రాస్తా’.. శేషేంద్ర కవితను పంచుకున్న పవన్‌ కల్యాణ్‌ పోస్టు వైరల్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోషల్‌ మీడియాలో శేషేంద్ర కవిత భాగాన్ని పంచుకోవడంతో ఆ పోస్టు వైరల్‌గా మారింది. తెలంగాణలో జనసేన భవిష్యత్‌ రాజకీయ ప్రణాళికలపై సంకేతాలు ఇస్తున్న వేళ, పోరాటం, అపజయం, మరణం, సంకెళ్లు వంటి ప్రతీకలతో కూడిన ఈ కవితను తన రాజకీయ ప్రయాణంతో అన్వయించుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాలు, జనసేన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters