బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ప్రచార

104 articles

రివ్యూ ‘కర్మాఖ్య’:మూఢనమ్మకాల నేపథ్యంతో వచ్చిన థ్రిల్లర్
సినిమా రివ్యూలు

రివ్యూ ‘కర్మాఖ్య’:మూఢనమ్మకాల నేపథ్యంతో వచ్చిన థ్రిల్లర్

మూఢనమ్మకాల నేపథ్యంతో తెరకెక్కిన థ్రిల్లర్ ‘కర్మాఖ్య’లో కామాఖ్య దేవితో లింక్, తంత్ర విద్యల అంశాలు ఆసక్తికరంగా మిళితమయ్యాయి. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగినా, సెకండ్ హాఫ్‌లో ట్విస్టులు, హీరోయిన్ ఇంట్లో చిక్కుకుని బయటపడేందుకు చేసే ప్రయత్నాలు థ్రిల్లర్ ఫీల్‌ను పెంచాయి. నటన, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బలంగా నిలిచి, మొత్తం మీద ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

9, ఆగ 2026

చారిత్రక కొండారెడ్డి బురుజు ఎక్కి టీచర్ల ఆగ్రహం
జిల్లా వార్తలు

చారిత్రక కొండారెడ్డి బురుజు ఎక్కి టీచర్ల ఆగ్రహం

మెగా డీఎస్సీపై వైఎస్ జగన్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఉపాధ్యాయ వర్గాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. తమ ఆత్మగౌరవాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్న ధోరణికి నిరసనగా టీచర్లు చారిత్రక కొండారెడ్డి బురుజు ఎక్కి తమ ధ్వనిని బలంగా వినిపిస్తూ, తప్పుడు ప్రచారాలు వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.

9, ఆగ 2026

మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం
జిల్లా వార్తలు

మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం

మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయ నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలను ఖండిస్తూ అభ్యర్థులు ‘ఛలో కర్నూల్ మెగా డీఎస్సీ–2025 ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి 42 మంది అభ్యర్థులు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ర్యాలీలో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయుల ఐక్యత, న్యాయమైన నియామకాలకు మద్దతు ప్రకటిస్తూ, నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వడం ఈ ర్యాలీ లక్ష్యంగా ఉంది.

8, ఆగ 2026

‘కొరియన్ కనకరాజు’ రివ్యూ: హారర్ కామెడీతో వరుణ్‌తేజ్ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్?
సినిమా రివ్యూలు

‘కొరియన్ కనకరాజు’ రివ్యూ: హారర్ కామెడీతో వరుణ్‌తేజ్ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్?

‘కొరియన్ కనకరాజు’ హారర్ కామెడీగా వరుణ్‌తేజ్‌కు రెండు కోణాల్లో నటించే అవకాశం ఇచ్చిన చిత్రం. కథ, లాజిక్, క్లైమాక్స్‌లో బలహీనతలు ఉన్నా, సత్య–మురళీధర్ గౌడ్ కామెడీ, వరుణ్‌తేజ్ టైమింగ్, కొరియా నేపథ్యం, తమన్ సంగీతం ప్రధాన బలాలు. హారర్ కామెడీ జానర్, థియేటర్‌లో గుంపుగా కూర్చొని నవ్వుకోవడం ఇష్టపడే వారికి ఇది సరదా ఎంటర్‌టైనర్‌గా అనిపించే అవకాశం ఉంది.

7, ఆగ 2026

ఎమ్మిగనూరు 10వ వార్డులో ఇంటింటికీ ప్రచారం, అభివృద్ధి పనుల పరిశీలన
జిల్లా వార్తలు

ఎమ్మిగనూరు 10వ వార్డులో ఇంటింటికీ ప్రచారం, అభివృద్ధి పనుల పరిశీలన

ఎమ్మిగనూరు పట్టణం 10వ వార్డులో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం’ పేరుతో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి, Dr. B V జయనాగేశ్వర్ రెడ్డి ప్రజల సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. రెండు అన్నా క్యాంటీన్ల ద్వారా వేలాది పేదలు, కార్మికులకు తక్కువ ధరలో భోజనం అందుతున్నట్లు గుర్తుచేస్తూ, గోనెగండ్లలో మూడో అన్నా క్యాంటీన్ ఏర్పాటు, రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై పార్టీ నేతలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.

7, ఆగ 2026

రేణిగుంటలో గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం: సీఐ జయచంద్ర
జిల్లా వార్తలు

రేణిగుంటలో గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం: సీఐ జయచంద్ర

తిరుపతి జిల్లా రేణిగుంటలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసు విభాగం విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు "గంజాయి నిర్మూలిద్దాం – Action After Awareness", "పరీక్ష చేద్దాం – మత్తును వదిలిద్దాం" నినాదాలతో ప్రచారం నిర్వహిస్తూ, అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం ఉంటే 1972 లేదా 112కు వెంటనే ఫోన్ చేయాలని సీఐ జయచంద్ర ప్రజలను కోరారు.

7, ఆగ 2026

ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ నిషేధంపై కమిషనర్ ప్రచారం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ నిషేధంపై కమిషనర్ ప్రచారం

ప్రొద్దుటూరు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మార్కెట్ ప్రాంతంలో స్వయంగా ప్రచారం నిర్వహించి, వ్యాపారుల వద్ద ఉన్న నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను స్వాధీనం చేయించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల స్థానంలో బట్ట, కాగితం సంచులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచిస్తూ, నిషేధిత ప్లాస్టిక్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని మున్సిపల్ వర్గాలు స్పష్టం చేశాయి.

7, ఆగ 2026

అబద్ధాల ప్రజంటేషన్‌తో ప్రజలను మభ్యపెట్టలేరు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
జిల్లా వార్తలు

అబద్ధాల ప్రజంటేషన్‌తో ప్రజలను మభ్యపెట్టలేరు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 26 నెలల పాలనపై ఇచ్చిన ప్రజంటేషన్ పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిందని, సంక్షేమం, ఉద్యోగాల విషయంలో చెప్పిన గణాంకాలు వాస్తవాలకు విరుద్ధమని ఆరోపించారు. భారీ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఎన్నికల హామీల అమలుపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, అబద్ధాల పాలనకు ముగింపు రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

6, ఆగ 2026

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన
జిల్లా వార్తలు

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన

మదనపల్లె కలెక్టరేట్ ఎదుట జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులు నిరసన నిర్వహించి, చేనేత రంగం క్షీణతతో జీవనోపాధి దెబ్బతింటోందని, ఇళ్లలో ఉన్న విద్యుత్ మీటర్ల వల్ల అధిక బిల్లులు వచ్చి ఆర్థిక భారంతో నలుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, నేతన్న నేస్తం పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా చేసి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

3, ఆగ 2026

ప్రజల ముంగిటకు కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు : ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఇంటింటికీ ప్రచారం
జిల్లా వార్తలు

ప్రజల ముంగిటకు కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు : ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఇంటింటికీ ప్రచారం

ప్రొద్దుటూరు 16వ వార్డులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం నిర్వహించి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడం, ప్రతి కుటుంబాన్ని సంక్షేమ పథకాల ద్వారా చేరుకోవడం, ప్రాంతీయ సమతుల అభివృద్ధి సాధించడమే కూటమి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

3, ఆగ 2026

మదనపల్లె ప్రైవేట్ పాఠశాలపై మతబోధనల ఆరోపణలు.. విచారణకు తల్లిదండ్రుల డిమాండ్
జిల్లా వార్తలు

మదనపల్లె ప్రైవేట్ పాఠశాలపై మతబోధనల ఆరోపణలు.. విచారణకు తల్లిదండ్రుల డిమాండ్

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని మిస్టర్ రెడ్డి ఈ.ఎం. ప్రైమరీ స్కూల్‌లో చిన్నారులకు పాఠ్యాంశాలతో పాటు మతపరమైన బోధనలు, అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ వీడియోలు, ఫోటోలు ఆధారంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన తేలితే తగిన చర్యలు తీసుకోవాలని వారు DEO, MEOలకు విజ్ఞప్తి చేశారు.

3, ఆగ 2026

‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ విడుదల..
సినిమా

‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ విడుదల..

వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. థ్రిల్‌, హాస్యం, హారర్‌ మేళవింపుతో, కొరియన్ నేపథ్యంపై సాగే ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుండగా, తమన్ సంగీతం, సాంకేతిక నిపుణుల పనితనం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

2, ఆగ 2026

‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
జాతీయం

‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

డ్రగ్స్ రహిత యువతే వికసిత్ భారత్‌కు పునాది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా యువతను మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడంతో పాటు, సామాజిక మార్పుకు వారిని భాగస్వాములుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ను ప్రారంభించింది.

2, ఆగ 2026

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల వేట..   ఆచూకీ కోసం సోషల్ మీడియాలో ప్రచారం
రాజకీయాలు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల వేట.. ఆచూకీ కోసం సోషల్ మీడియాలో ప్రచారం

గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ముస్తఫా కోసం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు బషీర్‌పై నమోదైన పలు క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

1, ఆగ 2026

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు
జాతీయం

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

31, జులై 2026

మోదీ రాజీనామా లేఖ వైరల్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
జాతీయం

మోదీ రాజీనామా లేఖ వైరల్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

ప్రధాని సంతకంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ నకిలీదేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. వైరల్ పోస్టులను ఆధారంగా చేసుకుని వ్యక్తిగత, ఆర్థిక వివరాలను షేర్ చేసుకోవద్దని పీఐబీ సూచించింది.

30, జులై 2026

ప్రధాని మోదీపై పోస్టులు తొలగించండి.. : ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
జాతీయం

ప్రధాని మోదీపై పోస్టులు తొలగించండి.. : ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు

సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్న వివాదాస్పద పోస్టులపై ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

30, జులై 2026

నా భర్త భార్గవ్ అంశం ప్రస్తావన రాలేదు..: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
రాజకీయాలు

నా భర్త భార్గవ్ అంశం ప్రస్తావన రాలేదు..: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త భార్గవ్ నాయుడు నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ సూచించిందన్న ప్రచారంపై స్పందిస్తూ, అలాంటి నిర్ణయం ఉంటే ముందుగా తనకే తెలియజేస్తారని స్పష్టం చేశారు.

30, జులై 2026

రివ్యూ..  స్పైడర్ మ్యాన్ ‘బ్రాండ్ న్యూ డే’-ఎమోషన్‌, విజువల్‌ ఫీస్ట్‌
సినిమా రివ్యూలు

రివ్యూ.. స్పైడర్ మ్యాన్ ‘బ్రాండ్ న్యూ డే’-ఎమోషన్‌, విజువల్‌ ఫీస్ట్‌

స్పైడర్ మ్యాన్ ‘బ్రాండ్ న్యూ డే’ చిత్రం ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’కి కొనసాగింపుగా భావోద్వేగాలు, విజువల్స్‌కి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. Peter Parker మానసిక సంఘర్షణ, అదృశ్య శక్తితో పోరాటం, Punisher, Hulk పాత్రలతో కలిసి నడిచే యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. అద్భుతమైన 3D విజువల్స్‌తో కుటుంబమంతా కలిసి చూడదగిన చిత్రం

30, జులై 2026

శ్రీవారి వీవీఐపీ దర్శనం ఎరగా ప్లాట్ల విక్రయం: ఎస్సీపీ డెవలపర్స్‌పై భక్తుల ఆగ్రహం
జిల్లా వార్తలు

శ్రీవారి వీవీఐపీ దర్శనం ఎరగా ప్లాట్ల విక్రయం: ఎస్సీపీ డెవలపర్స్‌పై భక్తుల ఆగ్రహం

తిరుమల శ్రీవారి వీవీఐపీ దర్శనం పేరుతో జీవితాంతం దర్శనం కల్పిస్తామని ప్రచారం చేస్తూ ప్లాట్లు విక్రయిస్తున్న ఎస్సీపీ డెవలపర్స్‌పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీతో ఒప్పందం ఉందని, ఫేక్ ఫోన్ నంబర్ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్న ఈ నెట్‌వర్క్‌పై టీటీడీ, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే ఇలాంటి ప్రకటనలను నమ్మి ఎవరూ డబ్బులు చెల్లించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

29, జులై 2026

రణ్‌బీర్ కపూర్ ప్రాజెక్టులపై‘ఆల్ఫా’ ఫ్లాప్ ప్రభావం ?
సినిమా

రణ్‌బీర్ కపూర్ ప్రాజెక్టులపై‘ఆల్ఫా’ ఫ్లాప్ ప్రభావం ?

ఆలియా భట్ నటించిన ‘ఆల్ఫా’ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం తర్వాత, ఆ ప్రభావం రణ్‌బీర్ కపూర్ కెరీర్, ముఖ్యంగా వై.ఆర్.ఎఫ్ ప్లాన్ చేసిన ‘ధూమ్ 4’ ప్రాజెక్ట్‌పై పడుతోందనే ప్రచారం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రణ్‌బీర్ ‘ధూమ్ 4’ నుంచి తప్పుకున్నారనే టాక్ ఉన్నప్పటికీ, ఆల్ఫా ఫలితం, ఆయన నిర్ణయాల మధ్య నేర సంబంధం, అలాగే కాస్టింగ్ వివరాలపై వై.ఆర్.ఎఫ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

29, జులై 2026

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా
రాజకీయాలు

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా

‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను' అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తాను కేవలం ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరయ్యాయని, తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

28, జులై 2026

తిరుమల జపాలి నీటి వివాదంపై టీటీడీ స్పష్టీకరణ
జిల్లా వార్తలు

తిరుమల జపాలి నీటి వివాదంపై టీటీడీ స్పష్టీకరణ

తిరుమల జపాలి నీటి వివాదంపై టీటీడీ అధికారులు స్పష్టీకరణ ఇచ్చారు. జపాలి వద్ద నీరు మొదట్లో తెల్లగా కనిపించడం వాటర్ ప్రెజర్ వల్ల ఏర్పడే గాలి బుడగల కారణమని, కొన్ని సెకన్లలో నీరు మళ్లీ పారదర్శకంగా మారుతుందని తెలిపారు. టీటీడీ వాటర్ ల్యాబ్ పరీక్షల్లో జపాలి నీరు పూర్తిగా స్వచ్ఛమైనదని, తాగడానికి అనువైనదని నిర్ధారించడంతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.

28, జులై 2026

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించాలి: సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1 ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం, యువత, మహిళలు, విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు, థింసా నృత్యం, పర్యాటక బ్రాండింగ్ ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

28, జులై 2026

కూటమి ప్రభుత్వ విజయాలు ఇంటింటికీ చేరేలా టీడీపీ ప్రచారం
జిల్లా వార్తలు

కూటమి ప్రభుత్వ విజయాలు ఇంటింటికీ చేరేలా టీడీపీ ప్రచారం

ప్రొద్దుటూరులో టీడీపీ చేపట్టిన "ఇంటింటికీ టీడీపీ - డోర్ టు డోర్" కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. వార్డువారీగా ఇంటింటికీ వెళ్లి పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుతున్న సేవలు, సౌకర్యాలపై అవగాహన కల్పిస్తూ, ప్రజల సమస్యలు, సూచనలు సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

27, జులై 2026

ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వం – 45 రోజుల డోర్ టు డోర్ ప్రచారానికి శ్రీకారం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వం – 45 రోజుల డోర్ టు డోర్ ప్రచారానికి శ్రీకారం

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ రెండు సంవత్సరాల విజయోత్సవాన్ని పురస్కరించుకుని 45 రోజుల డోర్ టు డోర్ క్యాంపెయిన్‌కు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. Bharat Function Hall‌లో జరిగిన అవగాహన సదస్సులో క్యాంపెయిన్ లక్ష్యాలు, అమలు విధానంపై వివరించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ చేరవేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించేందుకు ఈ ప్రచారం కీలకమని నాయకులు పేర్కొన్నారు.

27, జులై 2026

‘ది ప్యారడైజ్’ తొలి పాట ‘ఆయా షేర్’కు 20 కోట్ల వ్యూస్‌
సినిమా

‘ది ప్యారడైజ్’ తొలి పాట ‘ఆయా షేర్’కు 20 కోట్ల వ్యూస్‌

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ తొలి పాట ‘ఆయా షేర్’ 20 కోట్ల వ్యూస్ దాటుతూ అరుదైన రికార్డు సాధించింది. ఈ మాస్ ట్రాక్ విజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి, త్వరలో భారీ అప్డేట్ రాబోతోందని సూచించడంతో, అది కొత్త రిలీజ్ డేట్ గురించే అయి ఉంటుందని అభిమానులు ఊహిస్తున్నారు.

27, జులై 2026

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు

అమరావతిలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ విజయాన్ని నిలబెట్టే దిశగా 45 రోజుల ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలు, యువత సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీ తప్పుదారి పట్టించే ప్రయత్నాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

26, జులై 2026

కడపలో ట్రేడింగ్ పేరుతో రూ.15 కోట్ల మోసం బహిర్గతం
జిల్లా వార్తలు

కడపలో ట్రేడింగ్ పేరుతో రూ.15 కోట్ల మోసం బహిర్గతం

కడపలో స్టాక్ ట్రేడింగ్, క్రిప్టో పెట్టుబడుల పేరుతో అంతర్రాష్ట్ర నిందితుడు వీరభద్రరావు (KV రావు) సుమారు రూ.15 కోట్ల మోసం చేసినట్లు రిమ్స్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. నెలకు 10–20 శాతం లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడిదారులను ఆకర్షించి, ప్రారంభంలో చిన్న మొత్తాలు చెల్లించి నమ్మకం కలిగించి, తరువాత భారీగా డబ్బులు తీసుకుని మాయమైనట్లు దర్యాప్తులో బయటపడింది.

26, జులై 2026

"డ్రగ్స్ వద్దు బ్రో", "పల్లె బాటలో ఈగల్" అవగాహన కార్యక్రమాలు
జిల్లా వార్తలు

"డ్రగ్స్ వద్దు బ్రో", "పల్లె బాటలో ఈగల్" అవగాహన కార్యక్రమాలు

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో "డ్రగ్స్ వద్దు బ్రో", "పల్లె బాటలో ఈగల్" అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, మహిళా భద్రతపై ప్రజలకు వివరించారు. ఎస్‌ఐ హరిహర ప్రసాద్ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాలు, మహిళలు, పిల్లలపై నేరాల సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై "ఈగల్" టోల్ ఫ్రీ 1972కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

26, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters