బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#స్పష్టత

37 articles

నిలిచిపోయిన ‘తని ఒరువన్ 2’ సినిమా: నిర్మాత స్పష్టత
సినిమా

నిలిచిపోయిన ‘తని ఒరువన్ 2’ సినిమా: నిర్మాత స్పష్టత

‘తని ఒరువన్ 2’ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిలిచిపోయిందని నిర్మాత అర్చన కల్పతి స్పష్టం చేశారు. భారీ బడ్జెట్, అనుకూలంగా లేని మార్కెట్ పరిస్థితులు, రవి మోహన్, నయనతార, మోహన్ రాజా ఇతర కమిట్‌మెంట్లు కారణంగా షూటింగ్ ప్రారంభం కాలేదని ఆమె తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిగా రద్దు కాలేదని, పరిస్థితులు మెరుగుపడితే మళ్లీ ముందుకు సాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

9, ఆగ 2026

ప్రొద్దుటూరు దేవాంగ కళ్యాణ మండపం తూర్పు భాగం స్థలాన్ని ఖాళీ చేయాలని దేవస్థాన నిర్ణయం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు దేవాంగ కళ్యాణ మండపం తూర్పు భాగం స్థలాన్ని ఖాళీ చేయాలని దేవస్థాన నిర్ణయం

శ్రీ అగస్త్యేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన వినాయకనగర్‌లోని దేవాంగ కళ్యాణ మండపం తూర్పు భాగంలో ఉన్న సర్వే నంబర్ 431/B2లోని 26 సెంట్ల స్థలాన్ని ఆక్రమణదారులు ఖాళీ చేయాలని దేవస్థాన పాలకవర్గం నిర్ణయించింది. భూ సర్వేలో స్థలం దేవస్థానానికి చెందినదని నిర్ధారణ కావడంతో, సంబంధిత వారికి నోటీసులు జారీ చేసి చట్టపరమైన ప్రక్రియల ద్వారా ఆస్తులను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

6, ఆగ 2026

కోలీవుడ్‌లో సీక్వెల్స్ హవా: ‘వడ చెన్నై 2’, ‘మావీరన్ 2’ సిద్ధం
సౌత్ ఇండియా

కోలీవుడ్‌లో సీక్వెల్స్ హవా: ‘వడ చెన్నై 2’, ‘మావీరన్ 2’ సిద్ధం

తమిళంలో సీక్వెల్స్ జోరు పెరిగింది. ధనుష్ నటించిన కల్ట్ హిట్ ‘వడ చెన్నై’కి సీక్వెల్‌గా ‘వడ చెన్నై 2’ ప్రొడక్షన్ త్వరలో ప్రారంభం కానుండగా, ‘కెప్టెన్ మిల్లర్ ’ను కూడా మల్టీ పార్ట్ ఫ్రాంచైజీగా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శివకార్తికేయన్ హీరోగా ‘మావీరం 2’ను 2027 చివర్లో ప్రారంభించేలా సన్నాహాలు సాగుతున్నాయి.

5, ఆగ 2026

అరుదైన ఘనతతో ముందంజలో RCB
క్రీడలు

అరుదైన ఘనతతో ముందంజలో RCB

రాయల్ చల్లేంగెర్స్ బెంగుళూరు (RCB) బ్రాండ్ విలువ $312 మిలియన్‌ (రూ.2,986 కోట్లు) చేరుకుని, ఐపీఎల్‌లో ఈ మైలురాయిని సాధించిన తొలి జట్టుగా హాయిహాన్ లోకీ నివేదికలో నిలిచింది.యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ , ఐపీల్ -2026కు ముందు RCBని బ్లాక్స్టన్ , బోల్ట్ వెంచర్స్ , ఆదిత్య బిర్లా గ్రూప్స్ , తొలి కన్సార్షియం కలిసి రూ.16,705 కోట్లకు కొనుగోలు చేయగా, ఈ ఒప్పందం ఫ్రాంచైజీ వ్యాపార బలం, మార్కెట్ స్థాయిని మరింత స్పష్టంగా చూపించింది.

30, జులై 2026

మత మార్పిడి, ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత
జాతీయం

మత మార్పిడి, ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత

మత మార్పిడి చేసిన షెడ్యూల్డ్ కులాల ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు మార్చి 2026లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాల నుంచి క్రైస్తవం లేదా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా కొనసాగదని, తిరిగి పూర్వ మతంలో చేరి మూడు నిర్దిష్ట షరతులు నెరవేర్చినప్పుడే ఎస్సీ హోదా పునరుద్ధరణ సాధ్యమని ధర్మాసనం తేల్చింది.

27, జులై 2026

శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
రాజకీయాలు

శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇటీవల పొత్తికడుపు శస్త్రచికిత్స జరిగి, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నట్లు ఆమె 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. ఆసుపత్రి ఫొటో వైరల్ కావడంతో కలిగిన ఆందోళనల నేపథ్యంలో, తన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసి, తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

26, జులై 2026

రాజీనామా చేయకపోతే చర్చల్లేవు.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!
జాతీయం

రాజీనామా చేయకపోతే చర్చల్లేవు.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!

దేశవ్యాప్తంగా కలకలం రేపిన పేపర్ లీక్‌ల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ (CJP) తెగేసి చెప్పింది. లేకుంటే కేంద్రంతో చర్చలు జరపడంలో ఎలాంటి అర్థం లేదని తేల్చిచెప్పారు.

25, జులై 2026

శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా జట్టు ఎంపికపై ఆసక్తి
క్రీడలు

శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా జట్టు ఎంపికపై ఆసక్తి

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ నివేదిక ఆధారంగా జట్టు తుది కూర్పు నిర్ణయించనుండగా, అతను అందుబాటులో లేకపోతే సారాంశ్ జైన్‌కు అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా ఉండగా, బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ తదితరుల ఎంపికపై స్పష్టత ఉంది.

22, జులై 2026

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు? స్పష్టతలేని కేంద్రం, దక్షిణాదిపై ఆందోళనలు
తమిళనాడు

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు? స్పష్టతలేని కేంద్రం, దక్షిణాదిపై ఆందోళనలు

డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వైఖరి స్పష్టంగా లేకపోవడంతో, ఆ పార్టీ మద్దతు ఇస్తుందా అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రతిపాదన రాలేదని డీఎంకే చెబుతూనే, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర సమానంగా పెంచితే సానుకూలంగా పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

19, జులై 2026

ఈరోజు రాశిఫలాలు 15.07.2026
రాశి ఫలాలు

ఈరోజు రాశిఫలాలు 15.07.2026

ఈరోజు పన్నెండు రాశుల వారికి సాధారణంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం, ఆరోగ్య పరంగా రాశి రాశికి పరిస్థితులు మారుతున్నా, ఎక్కువగా పురోగతి, ఆదాయం, కుటుంబ సఖ్యత, కొత్త అవకాశాలు, గుర్తింపు, శుభవార్తలు, భాగస్వామ్య లాభాలు, స్థిరాస్తి పనుల్లో ముందడుగు వంటి అనుకూల ఫలితాల సూచనలు ఉన్నాయి. జాగ్రత్త, ప్రణాళిక, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధ్యమని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తోంది.

15, జులై 2026

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనపై నమోదైన కేసు, అరెస్ట్ చేసిన స్థలం, కేసు నేర స్వరూపంపై అధికారిక వివరాలు వెలుబడకపోవడంతో వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. కేసు పూర్తి వివరాలు, తదుపరి చర్యలపై స్పష్టత కోసం రాజకీయ వర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

13, జులై 2026

తల్లికి వందనం నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్

తల్లికి వందనం నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల విడుదలకు సిద్ధమై, అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం పనులు వేగవంతం చేసింది. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.15 వేలలో రూ.13 వేలు తల్లి బ్యాంకు ఖాతాలో, రూ.2 వేలు పాఠశాల ఖాతాలో జమ కానున్నాయి. నారా లోకేష్‌ జులై 16–18 తేదీల్లో నిధులు జమవుతాయని ప్రకటించగా, తల్లిదండ్రులు ఆధార్‌ లింక్‌, NPCI మ్యాపింగ్‌, KYC వివరాలు సరిచూసుకుని, అవసరమైతే వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

12, జులై 2026

మైదుకూరు మున్సిపాలిటీ ప్రాంగణంలో టేకు చెట్లు మాయం
జిల్లా వార్తలు

మైదుకూరు మున్సిపాలిటీ ప్రాంగణంలో టేకు చెట్లు మాయం

కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న దాదాపు 20 టేకు చెట్లు రాత్రికి రాత్రే నరికి మాయం కావడంతో స్థానికంగా సంచలనం రేగింది. లక్షల రూపాయల విలువ చేసే ఈ ప్రభుత్వ ఆస్తులను అధికారులు స్వయంగా తొలగించారా, లేక గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారా అన్నదానిపై స్పష్టత లేక ప్రజలు పూర్తి స్థాయి విచారణ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

9, జులై 2026

ఆ ఆరుగురు మత్స్యకారులు మృతి.. త్రీమెన్ కమిటీ నివేదిక
ఆంధ్రప్రదేశ్

ఆ ఆరుగురు మత్స్యకారులు మృతి.. త్రీమెన్ కమిటీ నివేదిక

విశాఖపట్నం తీరంలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన త్రీమెన్ కమిటీ విచారణ పూర్తి చేసి, గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు నివేదికలో నిర్ధారించింది. కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్ వివరాలు, సముద్ర పరిస్థితులు, ప్రమాద ప్రాంతం, గడిచిన కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చిన కమిటీ నివేదికను ఆధారంగా తీసుకుని ప్రభుత్వం తదుపరి చర్యలు, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

8, జులై 2026

LCU ముగియదు, ఇంకా కొనసాగుతుంది లోకేష్ కనగరాజ్ స్పష్టత
సౌత్ ఇండియా

LCU ముగియదు, ఇంకా కొనసాగుతుంది లోకేష్ కనగరాజ్ స్పష్టత

లోకేష్ కనగరాజ్ స్పష్టంగా ఎల్‌సీయూ ముగియదని, ఇంకా ఎన్నో కథలు, పాత్రలు మిగిలి ఉన్నందున ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. ఖhaidీ 2, విక్రమ్ 2, రోలెక్స్ స్టాండలోన్ చిత్రం, జీస్క్వాడ్ బ్యానర్‌లో బెంజ్ వంటి ప్రాజెక్టులు ఎల్‌సీయూలో భాగమని, ప్రస్తుతం అల్లు అర్జున్ చిత్రంపై పని పూర్తయ్యాక వీటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని ఆయన పేర్కొన్నారు.

7, జులై 2026

‘జననాయగన్’ విడుదలపై ప్రియమణి తాజా అప్‌డేట్‌
సౌత్ ఇండియా

‘జననాయగన్’ విడుదలపై ప్రియమణి తాజా అప్‌డేట్‌

విజయ్‌ నటించిన ‘జననాయగన్’ విడుదల తేదీపై వస్తున్న వార్తల మధ్య నటి ప్రియమణి స్పష్టతనిచ్చారు. అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని, జులై నెలాఖరులో థియేటర్లలోకి వచ్చే అవకాశముందని ఆమె సూచించారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ బాధ్యతలు స్వీకరించిన విషయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ఆయన ప్రజాసేవ పట్ల ఉన్న కట్టుబాటును ప్రశంసించారు.

6, జులై 2026

డిజిటల్‌ వేదికపై సమంత కొత్త ప్రయాణం..
టాలీవుడ్

డిజిటల్‌ వేదికపై సమంత కొత్త ప్రయాణం..

స్టార్‌ హీరోయిన్‌ సమంత సోనీలివ్‌ తమిళంతో కొత్త డిజిటల్‌ ప్రాజెక్ట్‌ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది వెబ్‌ సిరీస్‌నా, షోనా అనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’, ‘సామ్‌జామ్‌’ విజయాల తర్వాత, ‘మా ఇంటి బంగారం’ సినిమా హిట్‌ ఊపుతో సమంత ఈ కొత్త ప్రయాణంపై సినీ వర్గాలు, అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.

5, జులై 2026

రైల్వే ఉద్యోగి ఆత్మహత్య కేసులో నిందితురాలు ఉషారాణి అరెస్ట్
జిల్లా వార్తలు

రైల్వే ఉద్యోగి ఆత్మహత్య కేసులో నిందితురాలు ఉషారాణి అరెస్ట్

రైల్వే ఉద్యోగి K. రవి ఆత్మహత్య కేసులో నిందితురాలు ఉషారాణిని రేణిగుంట పోలీసులు కరకంబాడి బస్టాండ్ సమీపంలో అరెస్టు చేశారు. సూసైడ్ నోట్, పోస్టుమార్టం నివేదిక, సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలను సమగ్రంగా పరిశీలించి ఆమె పాత్రపై స్పష్టత వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు నేపథ్యం, రవితో ఉషారాణి సంబంధం తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తూ, విచారణ అనంతరం నిందితురాలిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నారు.

30, జూన్ 2026

రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదాపై స్పష్టత అవసరం: వెంకయ్య నాయుడు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదాపై స్పష్టత అవసరం: వెంకయ్య నాయుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వంటి కీలక అంశాలపై రాజకీయ నాయకులు సూటిగా, స్పష్టంగా మాట్లాడాలని సూచించారు. ‘జై ఆంధ్ర’ ఉద్యమం సమయంలోనే విభజన జరిగి ఉంటే రెండు రాష్ట్రాలు మరింత అభివృద్ధి సాధించేవని, ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో బలంగా డిమాండ్ చేసి, ఏపీకి తగిన న్యాయం కోసం ప్రతి మంత్రిత్వ శాఖతో కృషి చేశానని ఆయన గుర్తుచేశారు.

28, జూన్ 2026

గర్భవతిననే క్లారిటీ ఇచ్చిన సమంత… మెటర్నిటీ లీవ్‌కు రెడీ
టాలీవుడ్

గర్భవతిననే క్లారిటీ ఇచ్చిన సమంత… మెటర్నిటీ లీవ్‌కు రెడీ

నటి సమంత తన గర్భధారణ విషయాన్ని అధికారికంగా ధృవీకరించి, త్వరలో మెటర్నిటీ లీవ్‌ తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవాల్లో బేబీ బంప్‌తో కనిపించిన ఆమెపై వచ్చిన వార్తలకు ఈ ప్రకటనతో ముగింపు లభించింది. రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత చేసిన ఈ తొలి చిత్రం విజయంతో పాటు గర్భవార్తతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

25, జూన్ 2026

గాదె సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్

గాదె సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక మలుపుగా సిట్ అధికారులు సీఐ నాగరాజును అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని విచారణకు సిద్ధమవుతున్నారు. ఆయన విధులు, అప్పటి పరిస్థితులు, కేసు నమోదు, తదుపరి చర్యలపై సమగ్రంగా ప్రశ్నించేందుకు ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేసు సున్నితత్వం కారణంగా సిట్ అధికారిక వివరాలపై మౌనం పాటిస్తుండగా, నిజాలు త్వరగా వెలుగులోకి రావాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుకుంటున్నారు.

23, జూన్ 2026

‘కాక్‌టెయిల్‌ 2’ లెస్బియన్‌ లవ్‌స్టోరీ కాదు: కృతి సనన్‌ స్పష్టీకరణ
సినిమా

‘కాక్‌టెయిల్‌ 2’ లెస్బియన్‌ లవ్‌స్టోరీ కాదు: కృతి సనన్‌ స్పష్టీకరణ

హోమీ అదజానియా దర్శకత్వంలో షాహిద్‌ కపూర్‌, రష్మిక మందన్నా, కృతి సనన్‌ నటించిన ‘కాక్‌టెయిల్‌ 2’ జూన్‌ 19న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం లెస్బియన్‌ లవ్‌స్టోరీ కాదని, ముగ్గురు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే భావోద్వేగ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ మాత్రమేనని కృతి సనన్‌ స్పష్టం చేస్తూ, సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌ను నమ్మకుండా థియేటర్‌లో చూసి నిర్ణయం తీసుకోవాలని ప్రేక్షకులను కోరారు.

18, జూన్ 2026

‘కల్కి 2’పై వస్తున్న రూమర్లకు నాగ్‌ అశ్విన్‌ క్లారిటీ
టాలీవుడ్

‘కల్కి 2’పై వస్తున్న రూమర్లకు నాగ్‌ అశ్విన్‌ క్లారిటీ

‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ ‘కల్కి 2’ షూటింగ్‌ వేగంగా సాగుతోందని, రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెలిపారు. రెండో భాగంలో దీపికా పడుకొణె లేకపోయినా, సుమతి పాత్రను తీసేయరని, అవసరమైతే కొత్త నాయికను ఎంపిక చేస్తామని ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ పాత్రను ఎవరు పోషిస్తారన్న చర్చ ఇండస్ట్రీలో జోరుగా కొనసాగుతోంది.

17, జూన్ 2026

ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!.. ఆ రోజు గుర్తుకు రాలేదా మహిళా లోకం?
రాజకీయాలు

ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!.. ఆ రోజు గుర్తుకు రాలేదా మహిళా లోకం?

హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యల వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టత ఇచ్చారు. తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు మాత్రమే ప్రతిస్పందించానని స్పష్టం చేశారు.

17, జూన్ 2026

‘వారణాసి’ ఓటీటీ సస్పెన్స్‌.. భారీ డిమాండ్‌తో వెనుకడుగు వేస్తున్న ప్లాట్‌ఫామ్‌లు
టాలీవుడ్

‘వారణాసి’ ఓటీటీ సస్పెన్స్‌.. భారీ డిమాండ్‌తో వెనుకడుగు వేస్తున్న ప్లాట్‌ఫామ్‌లు

టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన ‘వారణాసి’ సినిమా ఓటీటీ హక్కుల డీల్‌పై ఇంకా స్పష్టత రాలేదు. డిజిటల్‌ హక్కుల కోసం 400–500 కోట్ల రూపాయల వరకు డిమాండ్‌ చేస్తున్నారన్న వార్తలతో, ఒక్క సినిమాకే ఇంత భారీ మొత్తం పెట్టుబడి పెట్టడంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సందిగ్ధంలో ఉన్నాయి. ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉండే రేటు, షరతుల కోసం ఒక టాప్‌ నిర్మాత మధ్యవర్తిత్వం చేస్తుండగా, ఈ డీల్‌ ఎక్కడ లాక్‌ అవుతుందో సినీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

16, జూన్ 2026

సందీప్ రెడ్డి వంగా కాదు, మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనేనా?
టాలీవుడ్

సందీప్ రెడ్డి వంగా కాదు, మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనేనా?

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ఈ చిత్రం తర్వాత ఆయన 30వ సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందనే విషయంలో ఇంకా అధికారిక ప్రకటన లేదు. బుచ్చిబాబు, సందీప్ రెడ్డి వంగా పేర్లు వినిపించినా, ప్రస్తుతం అనిల్ రావిపూడి చెప్పిన క్రీడల నేపథ్య కథలో మహేష్ బాబు కోచ్‌గా నటించే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసే అవకాశాలపై టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

16, జూన్ 2026

‘విశ్వంభర’ రిలీజ్‌పై మెగా అభిమానుల్లో ఆందోళన
సినిమా

‘విశ్వంభర’ రిలీజ్‌పై మెగా అభిమానుల్లో ఆందోళన

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘విశ్వంభర’ విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. విజువల్ ఎఫెక్ట్స్ పనుల ఆలస్యంతో జూలై రిలీజ్ ఆలోచన నుంచి వెనక్కి తగ్గిన మేకర్స్, ఇప్పుడు ఈ ఏడాది దసరా సీజన్‌లో విడుదల చేసే దిశగా ఆలోచిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

16, జూన్ 2026

10 రోజులు గడిచినా జ్ఞానేశ్వరి జాడ లేదు… తుని చిన్నారి మిస్సింగ్‌ కేసు మిస్టరీ
ఆంధ్రప్రదేశ్

10 రోజులు గడిచినా జ్ఞానేశ్వరి జాడ లేదు… తుని చిన్నారి మిస్సింగ్‌ కేసు మిస్టరీ

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారానికి చెందిన రెండేళ్ల సుంకర జ్ఞానేశ్వరి ఈ నెల 6న ఇంటి సమీపంలోని తోటలో ఆడుకుంటూ ఉండగా అదృశ్యమై పది రోజులు గడిచినా ఎలాంటి క్లూ లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. వందలాది మంది పోలీసు, అటవీ, NDRF బృందాలు, సీసీ కెమెరా దృశ్యాలు, ఫోన్‌ డేటాతో విస్తృతంగా గాలించినా పురోగతి లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎస్పీ బిందుమాధవ్‌ దర్యాప్తును సమీక్షించగా, ఒక లక్ష రూపాయల బహుమతి ప్రకటించినట్టు పోలీసులు వెల్లడించారు.

16, జూన్ 2026

దేశ సమగ్రతకే ప్రాధాన్యం: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు:  పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

దేశ సమగ్రతకే ప్రాధాన్యం: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు: పవన్‌ కల్యాణ్‌

జనసేన 12 ఏళ్ల ప్రయాణాన్ని దిల్లీలో సమీక్షించిన పవన్‌ కల్యాణ్‌ పార్టీ స్థాపన వెనుక దేశ సమగ్రత, శ్రేయస్సే లక్ష్యమని, అధికార లెక్కలు అప్పట్లో లేవని చెప్పారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లోనూ ఏడు ప్రాథమిక సూత్రాలను వదలకుండా 21 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం, సభ్యత్వం లక్ష నుంచి 20 లక్షలకు పెరగడం ప్రజల మద్దతుకి నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే ప్రాధాన్యం ఇస్తామని, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాలేదని, ఆంధ్రప్రదేశ్‌ విభజన విధానానికే తమ ఆవేదననని స్పష్టం చేశారు.

15, జూన్ 2026

రోహిత్ రనౌట్‌పై గిల్ వివరణ
క్రికెట్

రోహిత్ రనౌట్‌పై గిల్ వివరణ

ధర్మశాలలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో రనౌట్ ఘటనపై శుభ్‌మన్ గిల్ వివరణ ఇచ్చాడు. రనౌట్‌పై రోహిత్ శర్మకు కోపం లేదని, డ్రెస్సింగ్ రూమ్‌లో రిప్లే చూసి నవ్వేశాడని గిల్ తెలిపాడు. స్లిప్‌లో తాను పట్టిన క్యాచ్ గురించి మాట్లాడుతూ, అలాంటి క్యాచ్‌లకు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తానని, అది అద్భుతం కాకపోయినా పట్టినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

14, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters