బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#టీమ్‌ఇండియా

53 articles

శ్రీలంక 284 ఆలౌట్‌.. భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం
క్రీడలు

శ్రీలంక 284 ఆలౌట్‌.. భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం

గాలె టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 462 పరుగులకు ఆలౌట్‌ కాగా, శ్రీలంక 284 పరుగులకు మూడో రోజు ఆలౌట్‌ అయింది. మానవ్‌ సుతార్‌ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి శ్రీలంకను కట్టడి చేశారు. దీంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించగా, మేఘావృత వాతావరణం, వర్ష సూచనల కారణంగా మూడో రోజు ఆటను అంపైర్లు ముందుగానే నిలిపివేశారు.

18, ఆగ 2026

శ్రీలంక టెస్టు సిరీస్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాం: గౌతమ్ గంభీర్
క్రీడలు

శ్రీలంక టెస్టు సిరీస్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాం: గౌతమ్ గంభీర్

శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకోవాలని కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. దక్షిణాఫ్రికా చేతిలో గత టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాజయం తర్వాత ఈ సిరీస్‌ను కీలక పరీక్షగా చూస్తున్నారు. బుమ్రా గాయం కారణంగా ఆకిబ్ నబి, సారాంశ్ జైన్‌లకు టెస్టు జట్టులో అవకాశం లభించగా, వీరు దేశం గర్వించే ప్రదర్శన చేయాలని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

7, ఆగ 2026

మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్‌ ఇంగ్లాండ్  సొంతం
క్రీడలు

మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్‌ ఇంగ్లాండ్ సొంతం

లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్‌ 27 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. బెన్ శతకం, జాకబ్ బెథెల్ జో రూట్ , జొస్ అర్ధశతకాలతో ఇంగ్లాండ్‌ 387/3 భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ శతకం, శుబ్మం గిల్, విరాట్ కోహ్లీ అర్ధశతకాలు చేసినా, సామ్ కరెం నాలుగు వికెట్లతో భారత్‌ను 360/7కే పరిమితం చేశాడు.

20, జులై 2026

రెండో వన్డే ఇంగ్లాండ్‌దే.. రూట్‌ ధాటికి భారత్‌ ఓటమి
క్రీడలు

రెండో వన్డే ఇంగ్లాండ్‌దే.. రూట్‌ ధాటికి భారత్‌ ఓటమి

కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ 4 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 234 పరుగుల లక్ష్యాన్ని జో రూట్‌ 99 నాటౌట్‌ ఇన్నింగ్స్‌ ఆధారంగా ఇంగ్లాండ్‌ 44.1 ఓవర్లలో ఛేదించగా, అంతకుముందు భారత్‌ విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధశతకాలతో 233 పరుగులకే ఆలౌటైంది.

17, జులై 2026

రోహిత్‌ శర్మపై ఎటువంటి ఒత్తిడి లేదు..: స్పష్టం చేసిన బ్యాటింగ్‌ కోచ్‌
క్రీడలు

రోహిత్‌ శర్మపై ఎటువంటి ఒత్తిడి లేదు..: స్పష్టం చేసిన బ్యాటింగ్‌ కోచ్‌

‘రిటైర్మెంట్‌’ విషయంలో రోహిత్‌ (Rohit Sharma)పై మేనేజ్‌మెంట్‌ ఎలాంటి ఒత్తిడి పెట్టట్లేదని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటాక్‌ స్పష్టం చేశారు.

17, జులై 2026

సిరీస్‌.. సాధిస్తారా? రెండో వన్డేలో టీమ్‌ఇండియా లక్ష్యం
క్రికెట్

సిరీస్‌.. సాధిస్తారా? రెండో వన్డేలో టీమ్‌ఇండియా లక్ష్యం

ఇంగ్లాండ్‌తో కార్డిఫ్‌లో జరగనున్న రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్‌ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. తొలి వన్డేలో శుబ్మం గిల్ గాయం, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, KL రాహుల్ వైఫల్యం ఆందోళన కలిగిస్తుండగా, జస్ప్రీత్ బుమ్రాహ్,ఆక్సర్ పటేల్ తో కూడిన బౌలింగ్‌ దళం బలంగా ఉంది. సిరీస్‌ నిలుపుకోవాలంటే ఇంగ్లాండ్‌ కూడా కసితో బరిలోకి దిగనుంది.

16, జులై 2026

ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియాకు గాయాల బెడద..
క్రీడలు

ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియాకు గాయాల బెడద..

ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియాకు గాయాల బెడద తీవ్రంగా ఉంది. తొలి వన్డేలో శుభ్‌మన్‌ గిల్‌, గుర్నూర్‌ బ్రార్‌ గాయపడగా, శ్రేయస్‌ అయ్యర్‌ కూడా అసౌకర్యానికి గురయ్యాడు. రెండో వన్డేకు ముందు వీరి ఫిట్‌నెస్‌పై సందిగ్ధత నెలకొనగా, బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదిలా ఉండగా బుమ్రా బౌలింగ్‌లో మెరిసినా, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌లో విఫలమవడంతో వారి ఫామ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

15, జులై 2026

యూకే పర్యటనలో భారత్‌కు తొలి విజయం
క్రీడలు

యూకే పర్యటనలో భారత్‌కు తొలి విజయం

యూకే పర్యటనలో వరుస టీ20 పరాజయాల తర్వాత భారత్‌ వన్డేల్లో పుంజుకుంది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌, తర్వాత అక్షర్‌–వాషింగ్టన్‌ సుందర్‌ అజేయ అర్ధశతకాలు భారత్‌కు విజయాన్ని అందించగా, రెండో వన్డే గురువారం జరగనుంది.

15, జులై 2026

టీ20 పరాభవం పక్కనపెట్టి.. ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధం
క్రీడలు

టీ20 పరాభవం పక్కనపెట్టి.. ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధం

టీ20 సిరీస్‌లో వరుస పరాజయాల తర్వాత టీమ్‌ఇండియా ఇప్పుడు ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ ద్వారా పునరాగమనం లక్ష్యంగా పెట్టుకుంది.రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాహ్ తిరిగి చేరడంతో జట్టు బలం పెరిగింది; వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను దిగజార్చే అవకాశం కూడా ఉంది. ఒడి వరల్డ్ కప్ 2027 సన్నాహకంలో భాగమైన ఈ ఇండియా vs ఇంగ్లాండ్ ఒడి సిరీస్ ను క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

12, జులై 2026

ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టు: రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు 269 పరుగుల ఆధిక్యం
క్రికెట్

ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టు: రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు 269 పరుగుల ఆధిక్యం

లార్డ్స్‌లో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌పై బలమైన ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285, ఇంగ్లాండ్ 170 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌కు 115 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 154/1తో కొనసాగుతూ మొత్తం 269 పరుగుల ముందంజలో ఉండగా, స్మృతి మంధాన, యస్తికా భాటియా కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును బలపరుస్తున్నారు.

12, జులై 2026

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు షాక్‌: అగ్రస్థానంలోకి ఇంగ్లాండ్‌
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు షాక్‌: అగ్రస్థానంలోకి ఇంగ్లాండ్‌

ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో వరుస పరాజయాల కారణంగా ఐసీసీ పురుషుల టీ20 జట్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ దాదాపు నాలుగేళ్ల తర్వాత నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోయి, ఇంగ్లాండ్‌ అగ్రస్థానానికి చేరుకుంది. జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ వెనుకబడినా, బ్యాటర్లలో ఇషాన్ కిషన్‌, అభిషేక్ శర్మలు టాప్‌-2లో, బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా టాప్‌-10లో కొనసాగడం విశేషం.

12, జులై 2026

శ్రేయస్ పోరాటం వృథా.. 3-0తో సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్
క్రీడలు

శ్రేయస్ పోరాటం వృథా.. 3-0తో సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత్‌ ఇంగ్లాండ్‌ చేతికి 9 వికెట్ల తేడాతో ఓడి, అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. శ్రేయస్‌ అయ్యర్‌ 80 పరుగులతో ఒంటరిగా పోరాడగా, మిగతా బ్యాటర్లు, బౌలర్లు విఫలమయ్యారు. Phil Salt, Harry Brook అజేయ అర్ధశతకాలతో ఇంగ్లాండ్‌ 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

10, జులై 2026

నేడు ఇంగ్లాండ్‌తో కీలక నాలుగో టీ20
క్రీడలు

నేడు ఇంగ్లాండ్‌తో కీలక నాలుగో టీ20

టీమ్‌ఇండియా వరుసగా నాలుగు టీ20ల్లో ఓటములు చవిచూసి, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 0-2తో వెనుకబడిన నేపథ్యంలో, బ్రిస్టల్‌లో నేడు జరగనున్న నాలుగో మ్యాచ్‌ ద్వారా సిరీస్‌లో నిలబడాలని లక్ష్యంగా పెట్టుకుంది. టాప్‌ ఆర్డర్‌ సహా భారత బ్యాటింగ్‌ పూర్తిగా విఫలమవుతుండగా, మంచి ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్‌ నేతృత్వంలోని ఇంగ్లాండ్‌ జట్టు ఈసారి భారత్‌పై తొలి టీ20 సిరీస్‌ విజయాన్ని సాధించాలని పట్టుదలగా ఉంది.

9, జులై 2026

లక్ష్మణ్‌కి కోచింగ్‌ బాధ్యతలు?
క్రీడలు

లక్ష్మణ్‌కి కోచింగ్‌ బాధ్యతలు?

భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ జింబాబ్వే పర్యటన, ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపడుతున్నారు. అరుదైన రోగ నిరోధక సమస్యతో బాధపడుతున్న అఫ్గాన్‌ వెటరన్‌ పేసర్‌ షాపూర్‌ జద్రాన్‌ దిల్లీలో చికిత్స పొందుతూ 39వ పుట్టినరోజు ముందు రోజు మృతి చెందగా, అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కామన్వెల్త్‌ క్రీడల కోసం 124 మంది అథ్లెట్లతో భారత బృందం గ్లాస్గోకు బయల్దేరగా, జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

8, జులై 2026

ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాభవం.. టీమ్‌ఇండియా ఖాతాలో చెత్త రికార్డుల పరంపర
క్రీడలు

ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాభవం.. టీమ్‌ఇండియా ఖాతాలో చెత్త రికార్డుల పరంపర

ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో భారత్‌ 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌట్‌ అవుతూ ఘోర పరాభవం చెందింది. టీ20ల్లో ఇది భారత జట్టు రెండో అత్యల్ప స్కోర్‌ కాగా, ఇంగ్లాండ్‌ నేలపై విదేశీ జట్లలో కనిష్ఠ స్కోర్‌గా నిలిచింది. 125 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత్‌ టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో నమోదైన ఓటమి కాగా, శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం రాకపోవడం మరో చెత్త రికార్డుగా మారింది.

8, జులై 2026

రెండో టీ20లో ఇంగ్లాండ్‌ విజయం
క్రీడలు

రెండో టీ20లో ఇంగ్లాండ్‌ విజయం

మాంచెస్టర్‌లో జరిగిన రెండో టీ20లో జాకబ్‌ బెతెల్‌ 76 నాటౌట్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌ భారత్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 190 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 19 ఓవర్లలో ఛేదించగా, 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసి సచిన్‌ తెందుల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

5, జులై 2026

ఇంగ్లాండ్‌తో రెండో టీ20కి టీమ్‌ఇండియా సిద్ధం
క్రీడలు

ఇంగ్లాండ్‌తో రెండో టీ20కి టీమ్‌ఇండియా సిద్ధం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు టీమ్‌ఇండియా మాంచెస్టర్‌లో ఇవాళ రాత్రి 7 గంటలకు రంగంలోకి దిగుతోంది. పిచ్‌, వాతావరణం, జట్ల సమీకరణలు, పవర్‌ప్లే పరుగులు, డెత్‌ ఓవర్ల బౌలింగ్‌, ఫీల్డింగ్‌ వంటి అంశాలు ఫలితంపై కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌ సిరీస్‌ దిశను నిర్ణయించే కీలక పోరుగా క్రికెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

4, జులై 2026

శ్రీలంక పర్యటనకు భారత్‌.. టెస్టు తేదీలు ఖరారు
క్రీడలు

శ్రీలంక పర్యటనకు భారత్‌.. టెస్టు తేదీలు ఖరారు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా టీమ్‌ఇండియా ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లి గాలె, కొలంబోలో రెండు టెస్టులు ఆడనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్‌కు ఈ సిరీస్‌ అత్యంత కీలకమని నిపుణులు భావిస్తున్నారు. 2017 తర్వాత తొలి టెస్టు పర్యటన కావడంతో, BCCI జట్టు ఎంపిక, సిద్ధతపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.

2, జులై 2026

టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌

ఐసీసీ తాజా టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ తొలిసారిగా నంబర్‌వన్‌ స్థానాన్ని దక్కించుకుని, 876 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 869 పాయింట్లతో అభిషేక్‌ శర్మ రెండో స్థానంలో, తిలక్‌ వర్మ ఆరో స్థానంలో ఉన్నారు. బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ అగ్రస్థానాన్ని కొనసాగిస్తుండగా, వరుణ్‌ చక్రవర్తి మూడో, జస్‌ప్రీత్‌ బుమ్రా ఆరో స్థానాల్లో కొనసాగుతున్నారు.

2, జులై 2026

ఇంగ్లాండ్‌పై మెరిసిన భారత్‌ బ్యాటింగ్‌.. తొలి టీ20 వర్షార్పణం
క్రీడలు

ఇంగ్లాండ్‌పై మెరిసిన భారత్‌ బ్యాటింగ్‌.. తొలి టీ20 వర్షార్పణం

చెస్టర్‌ లీ స్ట్రీట్‌లో జరిగిన భారత్‌–ఇంగ్లాండ్‌ తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబె కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా, వర్షం వల్ల ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కి అవకాశం లేకపోయినా, భారత్‌ బ్యాటింగ్‌ ఫామ్‌ తిరిగి రావడం జట్టుకు, అభిమానులకు ఊరట కలిగించింది.

2, జులై 2026

ఐర్లాండ్‌ విజయానికి జై ముంద్రా కీలకం
క్రీడలు

ఐర్లాండ్‌ విజయానికి జై ముంద్రా కీలకం

రాజస్థాన్‌లో జన్మించిన జై ముంద్రా ఉన్నత విద్య కోసం ఐర్లాండ్‌ చేరి అక్కడే క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. లేమిన్స్టర్ క్లబ్‌ ద్వారా మెరిసి ఐర్లాండ్ ఇంటర్ - ప్రొవిన్సియల్ T20లో రాణించిన అతడు, టీమ్‌ఇండియాతో చారిత్రాత్మక సిరీస్‌లో ఐర్లాండ్‌ తరఫున అద్భుత బౌలింగ్‌తో రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు అందుకుని సిరీస్‌ విజయానికి కీలకంగా నిలిచాడు.

30, జూన్ 2026

వైభవ్‌ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?

టీమ్‌ఇండియా కొత్త ఆటగాళ్లను సిరీస్‌ల తరబడి బెంచ్‌పైనే కూర్చోబెట్టే పాత విధానం ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ ,ఇండియ A స్థాయిలో రాణించిన 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీకి ఐర్లాండ్‌ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ అవకాశం కూడా ఇవ్వకపోవడంతో అభిమానులు, విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో అయినా అతనికి అవకాశం ఇస్తారా, యువ ప్రతిభను సమయానికి వినియోగించుకుంటారా అన్నదానిపై ఇప్పుడు చర్చ కొనసాగుతోంది.

30, జూన్ 2026

అతివిశ్వాసం టీమ్‌ఇండియా కొంపముంచింది:  మాజీల ఆగ్రహం
క్రీడలు

అతివిశ్వాసం టీమ్‌ఇండియా కొంపముంచింది: మాజీల ఆగ్రహం

టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత తొలి అంతర్జాతీయ సిరీస్‌లోనే ఐర్లాండ్‌ చేతిలో 0-2 తేడాతో ఓడిపోవడం టీమ్‌ఇండియాపై తీవ్ర విమర్శలకు దారితీసింది. అతివిశ్వాసం, చిన్న జట్టుగా నిర్లక్ష్య భావన, నాసిరక ఫీల్డింగ్‌, బాధ్యతారహిత బ్యాటింగ్‌, జట్టు ఎంపికలో మేనేజ్‌మెంట్‌ తీరు ప్రధాన కారణాలుగా మాజీ క్రికెటర్లు శఠగోపన్‌ రమేశ్‌, ఆకాశ్‌ చోప్రా, మహ్మద్‌ కైఫ్‌ సూచించారు. రాబోయే సిరీస్‌లకు ముందు వ్యూహాల్లో మార్పులు అవసరమని క్రికెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

29, జూన్ 2026

ఐర్లాండ్‌దే సిరీస్‌ విజయం…  రెండో టీ20లోనూ భారత్‌ ఓటమి
క్రికెట్

ఐర్లాండ్‌దే సిరీస్‌ విజయం… రెండో టీ20లోనూ భారత్‌ ఓటమి

ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌ రెండో మ్యాచ్‌లోనూ ఓడి 2-0తో సిరీస్‌ను కోల్పోయింది. బెల్‌ఫాస్ట్‌లో జరిగిన రెండో టీ20లో ఐర్లాండ్‌ 154 పరుగులకు 8 వికెట్లు, భారత్‌ 153 పరుగులకు 9 వికెట్లు చేసి ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. వరుసగా 16 టీ20 సిరీస్‌ల్లో విజయం సాధించిన టీమ్‌ఇండియాకు ఇది తొలి సిరీస్‌ ఓటమిగా నమోదు కాగా, ఐర్లాండ్‌ భారత్‌పై ఏ ఫార్మాట్లోనైనా సిరీస్‌ గెలిచిన మొదటి సందర్భం ఇది.

29, జూన్ 2026

పరిస్థితులను అర్థం చేసుకోలేక ఓడిపోయాం : అభిషేక్‌ శర్మ
క్రీడలు

పరిస్థితులను అర్థం చేసుకోలేక ఓడిపోయాం : అభిషేక్‌ శర్మ

టీ20 ప్రపంచ కప్‌ తర్వాత తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లోనే టీమ్‌ఇండియాకు ఓటమి తప్పలేదు. అదీనూ ఐర్లాండ్‌ వంటి జట్టు చేతిలో పరాజయం చవిచూసింది.

27, జూన్ 2026

ఐర్లాండ్‌ చేతిలో భారత్‌కు తొలి పరాజయం
క్రీడలు

ఐర్లాండ్‌ చేతిలో భారత్‌కు తొలి పరాజయం

ఐర్లాండ్‌ బెల్‌ఫాస్ట్‌లో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియాను 34 పరుగుల తేడాతో ఓడించి, భారత్‌పై అన్ని ఫార్మాట్లలో తన తొలి విజయాన్ని నమోదు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ బ్యాటింగ్‌ విభాగం విఫలమై 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో ఐర్లాండ్‌ 2 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా, రెండో టీ20 ఆదివారం జరగనుంది.

27, జూన్ 2026

ఐర్లాండ్‌తో తొలి టీ20లో వైభవ్‌కు దక్కని అవకాశం
క్రికెట్

ఐర్లాండ్‌తో తొలి టీ20లో వైభవ్‌కు దక్కని అవకాశం

బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టాస్‌ గెలిచిన భారత్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకోగా, వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతని అరంగేట్రం కోసం అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో వైభవ్‌కు అవకాశం దక్కే అవకాశాలపై చర్చ నడుస్తుండగా, ఈ సిరీస్‌ను రెండు జట్లు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

26, జూన్ 2026

ప్రదర్శనే ముఖ్యం టీమ్‌ఇండియా ఎంపికపై కైఫ్‌
క్రికెట్

ప్రదర్శనే ముఖ్యం టీమ్‌ఇండియా ఎంపికపై కైఫ్‌

ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా, తిలక్‌ వర్మ వైస్‌ కెప్టెన్‌గా నియమించడంపై మహ్మద్‌ కైఫ్‌ స్పందించాడు. వైస్‌ కెప్టెన్‌ హోదా ఉన్నంత మాత్రాన జట్టులో స్థానం గ్యారంటీ కాదని, ఫామ్‌ లేకపోతే ఎవరికీ స్థిరమైన స్థానం ఉండదని ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుత కోచ్‌, సెలక్టర్ల దృష్టిలో హోదా కంటే ప్రతి మ్యాచ్‌లోని ప్రదర్శనకే ప్రాధాన్యం ఉందని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు.

26, జూన్ 2026

ఒత్తిడి తగ్గించుకో..  : వైభవ్‌కి అశ్విన్‌ సూచన
క్రీడలు

ఒత్తిడి తగ్గించుకో.. : వైభవ్‌కి అశ్విన్‌ సూచన

ఐపీఎల్‌లో మెరిసిన 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీపై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమవుతున్న వేళ, Ravichandran Ashwin అతనికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని, ఒక్కసారిగా వచ్చిన ఖ్యాతి, సోషల్‌ మీడియా హైప్‌ వల్ల ఒత్తిడికి లోనుకాకూడదని సూచించాడు. చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవాలంటే శారీరక, మానసికంగా బలంగా ఉండి, ఆటను నిరంతరం మెరుగుపరుచుకోవాలని, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ యువ ఆటగాళ్లకు సమయం, సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

26, జూన్ 2026

వైభవ్‌ కోసం ఓపెనింగ్‌ కుర్చీలాట: సంజు శాంసన్‌నా? అభిషేక్‌ శర్మనా?
క్రీడలు

వైభవ్‌ కోసం ఓపెనింగ్‌ కుర్చీలాట: సంజు శాంసన్‌నా? అభిషేక్‌ శర్మనా?

ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం మొదలయ్యే టీ20 సిరీస్‌తో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం దాదాపు ఖాయమవుతోంది. అతనికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలంటే అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ల బ్యాటింగ్‌ క్రమంలో మార్పులు చేయాల్సి రావచ్చని, అలాగే బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌తో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబేల్లో కొందరికి మాత్రమే తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలున్నాయని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

25, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters