బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఉంటుందని

36 articles

డ్వాక్రా లీడర్లకు తపాలాశాఖలో ఏజెంట్లుగా అవకాశం
జిల్లా వార్తలు

డ్వాక్రా లీడర్లకు తపాలాశాఖలో ఏజెంట్లుగా అవకాశం

చిత్తూరు జిల్లాలోని డ్వాక్రా గ్రూపుల లీడర్లకు తపాలాశాఖలో ఏజెంట్లుగా చేరేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కిరణ్ తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను నమోదు చేయించే బాధ్యతలు నిర్వహించే ఈ ఏజెంట్ల ఎంపిక కోసం ఈ నెల 5న ఉదయం 11 గంటలకు చిత్తూరు ప్రధాన తపాలా కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పదోతరగతి మార్కుల జాబితా, పాస్ పోర్ట్ సైజు ఫొటో, ఆధార్ కార్డు వంటి ధ్రువపత్రాలతో డ్వాక్రా లీడర్లు హాజరై గ్రామీణ ప్రాంతాల్లో లైఫ్ ఇన్సూరెన్స్ సేవలను విస్తరించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

5, ఆగ 2026

కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో నేడు స్పాట్ అడ్మిషన్లు
జిల్లా వార్తలు

కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో నేడు స్పాట్ అడ్మిషన్లు

కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 4 సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తులు సమర్పించి, అవసరమైన సర్టిఫికెట్లతో ఆగస్టు 5 ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

4, ఆగ 2026

భారత ప్రధాని మోడీకి పాకిస్థాన్ ఆహ్వానం?
అంతర్జాతీయం

భారత ప్రధాని మోడీకి పాకిస్థాన్ ఆహ్వానం?

2027లో ఇస్లామాబాద్‌లో జరగనున్న SCO శిఖరాగ్ర సమావేశానికి సభ్యదేశాలన్నింటికీ ఆహ్వానాలు పంపాల్సిన నిబంధనల ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆహ్వానం పంపనున్నట్లు పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది. మనీలాలో ఆసియాన్‌ సమావేశాల సందర్భంగా భారత–పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రుల ద్వైపాక్షిక భేటీపై ఇప్పటివరకు భారత్‌ నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదని ఆ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

31, జులై 2026

‘లక్కీ భాస్కర్ 2’ ఖాయం, కానీ ఆలస్యమే: డైరెక్టర్ వెంకీ అట్లూరి
టాలీవుడ్

‘లక్కీ భాస్కర్ 2’ ఖాయం, కానీ ఆలస్యమే: డైరెక్టర్ వెంకీ అట్లూరి

దర్శకుడు వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్ 2’ సీక్వెల్ ఖచ్చితమని, అయితే అది ఆలస్యంగా మాత్రమే మొదలవుతుందని తెలిపారు. ముందుగా ఉన్న రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక, దాదాపు రెండేళ్ల తర్వాత సీక్వెల్ పనులు మొదలుపెట్టి, మొదటి భాగం స్థాయికి తగ్గట్టుగా మరింత బలమైన కథతో దుల్కర్ సల్మాన్‌ను మళ్లీ భాస్కర్‌గా తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు.

31, జులై 2026

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ
రాజకీయాలు

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నిర్ణయించిన సమయం ముగిసిన తర్వాత జైలు వద్దకు చేరుకోవడంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.

30, జులై 2026

నీట్ యూజీ కౌన్సెలింగ్ లో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు
జాతీయం

నీట్ యూజీ కౌన్సెలింగ్ లో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు

నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ఒక్కసారి భౌతిక హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

30, జులై 2026

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి
జాతీయం

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉదయ్‌పూర్–పాంగి మార్గంలో ప్రయాణిస్తున్న టాటా సుమోపై అకస్మాత్తుగా భారీగా కొండచరియలు విరిగిపడటంతో వాహనం పూర్తిగా ధ్వంసమై 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పర్వత ప్రాంతమైన ఈ మార్గంలో తరచూ కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో, వాతావరణ పరిస్థితులు, ముందస్తు హెచ్చరికలు, జాగ్రత్తలు అత్యంత అవసరమని స్థానికులు సూచిస్తున్నారు.

27, జులై 2026

రెండో టీ20లో జింబాబ్వే టాస్ గెలుపు… భారత్‌కు ముందుగా బ్యాటింగ్
క్రీడలు

రెండో టీ20లో జింబాబ్వే టాస్ గెలుపు… భారత్‌కు ముందుగా బ్యాటింగ్

హరారేలో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శీతాకాల వాతావరణం, తొలి ఓవర్లలో సీమ్ బౌలర్లకు అనుకూల పరిస్థితులు ఉండొచ్చన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ సికిందర్ రజా తెలిపారు. టాస్ ఓడినా ముందే బ్యాటింగ్ ఎంచుకునే ఆలోచనలో ఉన్నామని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పగా, గత మ్యాచ్‌లో రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీపై మరోసారి దృష్టి నిలిచింది.

25, జులై 2026

స్వాతంత్య్ర దినోత్సవం ముందే రిలయన్స్ జియో నుంచి కొత్త ‘జియో ఫ్రీడమ్ ప్యాక్’
బిజినెస్

స్వాతంత్య్ర దినోత్సవం ముందే రిలయన్స్ జియో నుంచి కొత్త ‘జియో ఫ్రీడమ్ ప్యాక్’

రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జియోఫైబర్, ఎయిర్‌ఫైబర్ వినియోగదారుల కోసం రూ.10,000 ధరతో 15 నెలల వ్యాలిడిటీ కలిగిన దీర్ఘకాలిక ‘జియో ఫ్రీడమ్ ప్యాక్’ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 100 Mbps బ్రాడ్‌బ్యాండ్, అపరిమిత వాయిస్ కాల్స్, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 12 OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్లు, ఉచిత సెట్‌టాప్ బాక్స్, JioPC సపోర్ట్ ఒకే ప్యాక్‌లో లభిస్తాయి.

25, జులై 2026

హిందీ, దక్షిణాది చిత్రసీమల మధ్య తేడాలపై తమన్నా వ్యాఖ్యలు
సినిమా

హిందీ, దక్షిణాది చిత్రసీమల మధ్య తేడాలపై తమన్నా వ్యాఖ్యలు

తమన్నా భాటియా, Forbes ఇంటర్వ్యూలో హిందీ, దక్షిణాది చిత్రసీమల మధ్య తాను గమనించిన తేడాలను వివరించారు. హిందీలో నటనకు ప్రాధాన్యం ఉన్న విభిన్న పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, దక్షిణాదిలో Commercial అంశాలు, Star qualityకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. ఇవన్నీ తన వ్యక్తిగత అనుభవమేనని, ఏ పరిశ్రమపై విమర్శ కాదని స్పష్టం చేశారు.

25, జులై 2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త వ్యూహం.. : మంత్రి నాదెండ్ల మనోహర్
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త వ్యూహం.. : మంత్రి నాదెండ్ల మనోహర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ వ్యూహం పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి బలోపేతం, విజయం ప్రధాన లక్ష్యమని, అవసరమైతే జనసేన ఒక అడుగు వెనక్కు వేయడానికి సిద్ధమని, అయితే కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అవకాశాల కల్పనలో రాజీ ఉండదని స్పష్టం చేశారు.

17, జులై 2026

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ..
రాజకీయాలు

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్‌ 2.0’ మొబైల్ సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు.

16, జులై 2026

CBSE పాఠశాలల్లో ‘థర్డ్ లాంగ్వేజ్’పై కొత్త మార్గదర్శకాలు
విద్య

CBSE పాఠశాలల్లో ‘థర్డ్ లాంగ్వేజ్’పై కొత్త మార్గదర్శకాలు

CBSE పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు మూడో భాష (R3) అభ్యాసం, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణతను 2026-27 విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేసింది. పదవ తరగతి బోర్డు పరీక్షల్లో R3 ఉండదు కానీ పాఠశాల స్థాయిలోనే మూల్యాంకనం, మార్కుల కేటాయింపు, రికార్డు నిర్వహణ బాధ్యత పాఠశాలలదే. ఈ మార్పుల లక్ష్యం మూడో భాష బోధనను బలోపేతం చేసి బహుభాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడం.

14, జులై 2026

తెలంగాణలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక TET – 21న నోటిఫికేషన్
ఉద్యోగాలు

తెలంగాణలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక TET – 21న నోటిఫికేషన్

రాష్ట్రంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక TET నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. ఈ నెల 21న మొదటి ప్రత్యేక TET నోటిఫికేషన్ విడుదల చేసి, సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుత TET సిలబస్, ప్రమాణాలు, ప్రశ్నపత్ర రూపకల్పన, మార్కుల కేటాయింపు విధానం యథాతథంగా కొనసాగుతాయని, ఉపాధ్యాయుల అర్హతలను బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

14, జులై 2026

శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్.. బ్రేక్ దర్శనం నిలిపివేత
జిల్లా వార్తలు

శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్.. బ్రేక్ దర్శనం నిలిపివేత

శ్రీశైలం మల్లన్న స్పర్శ (బ్రేక్) దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. వారాంతపు సెలవులు కావడంతో క్షేత్రానికి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిందని పేర్కొన్నారు.

12, జులై 2026

కడపలో కరోనా నియంత్రణకు కఠిన చర్యలు: మంత్రి సవిత
జిల్లా వార్తలు

కడపలో కరోనా నియంత్రణకు కఠిన చర్యలు: మంత్రి సవిత

కడపలో ఎనిమిది కరోనా కేసులు, ఇద్దరి మృతులు నమోదవడంతో వైరస్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. కేసులు ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ నిబంధనలు, అవగాహన కార్యక్రమాలు, పరీక్షలు, ఐసోలేషన్, టీకాలు, వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వియత్నాం బోటు ప్రమాదంలో ముడియం శ్రీధర్ మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, మృతదేహం స్వదేశానికి రప్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

12, జులై 2026

జులై 7న కడపలో జిల్లాస్థాయి జూనియర్‌ ఫుట్‌బాల్‌ ఎంపికలు
జిల్లా వార్తలు

జులై 7న కడపలో జిల్లాస్థాయి జూనియర్‌ ఫుట్‌బాల్‌ ఎంపికలు

కడపలోని ప్రభుత్వ జూనియర్‌ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఈ నెల 7న జిల్లాస్థాయి జూనియర్‌ ఫుట్‌బాల్‌ బాల, బాలికల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డేనియల్‌ ప్రదీప్‌ తెలిపారు. 2011 జనవరి 1 నుంచి 2012 డిసెంబర్‌ మధ్య జన్మించిన క్రీడాకారులు మాత్రమే ఆధార్‌ కార్డు, జనన ధృవీకరణ పత్రాలతో ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం పొందనున్నారు.

6, జులై 2026

ఇస్రోకు బాంబు బెదిరింపు మెయిల్‌
జాతీయం

ఇస్రోకు బాంబు బెదిరింపు మెయిల్‌

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు బాంబు బెదిరింపు వచ్చింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గురువారం ఈ బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది.

2, జులై 2026

టిప్పర్‌తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర..   తోపుదుర్తి సంచలన ఆరోపణలు
జిల్లా వార్తలు

టిప్పర్‌తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు

అనంతపురంలో వైసీపీ నాయకుడు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్‌ పేరుతో ప్రచారంలో ఉన్న “రెడ్‌బుక్” రాజకీయాలు అరాచకాలకు దారితీస్తున్నాయని విమర్శించారు.

2, జులై 2026

ఒట్టేసి చెబుతున్నా.. ఎవడు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదు: సీఎం రేవంత్
తెలంగాణ

ఒట్టేసి చెబుతున్నా.. ఎవడు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదు: సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన తన జీవితకాల లక్ష్యమని, ఎవరి అడ్డంకులు, ఒత్తిడులు వచ్చినా ఈ ప్రాజెక్టు ఆగదని స్పష్టం చేశారు. 2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. SLBC, డిండి, నక్కల గండి ప్రాజెక్టులను పూర్తి చేసి నల్లగొండ ప్రజల చిరకాల ఆకాంక్షలను నెరవేర్చుతామని, గత BRS ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.

28, జూన్ 2026

ఏఐలో భారత ఐటీ కంపెనీల జోరు :  రూ. లక్ష కోట్లకు పైగా ఆదాయం
టెక్నాలజీ

ఏఐలో భారత ఐటీ కంపెనీల జోరు : రూ. లక్ష కోట్లకు పైగా ఆదాయం

నాస్‌కామ్‌ నివేదిక ప్రకారం ఏఐ సేవల ద్వారా భారతీయ ఐటీ కంపెనీలు ప్రస్తుతం 10-12 బిలియన్‌ డాలర్ల (రూ.95,000 కోట్లు–1.14 లక్షల కోట్లు) ఆదాయం సాధిస్తున్నాయి మరియు 2030 నాటికి Agentic AI ద్వారా అదనంగా 300-400 బిలియన్‌ డాలర్ల వ్యాపార అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. సంప్రదాయ ఐటీ సేవలు ఏఐ సామర్థ్యాలతో కలిసిపోతుండగా, legacy modernization, cyber security, governance వంటి సేవలకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుందని నాస్‌కామ్‌ అంచనా వేస్తోంది.

27, జూన్ 2026

బాహుబలి-3 అధికారికంగా ప్రకటించిన ప్రభాస్‌–రానా–అనుష్క…
సినిమా

బాహుబలి-3 అధికారికంగా ప్రకటించిన ప్రభాస్‌–రానా–అనుష్క…

ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఎపిక్‌ ఫ్రాంచైజీ ‘బాహుబలి’కి మూడో భాగం రానుందని ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్‌ ప్రత్యేక వీడియోలో అధికారికంగా వెల్లడించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆ వీడియోలో ప్రభాస్‌, రానా, అనుష్కలు ‘బాహుబలి 3’ వస్తుందని చెబుతూ షూటింగ్‌ జ్ఞాపకాలు, సరదా సంఘటనలను పంచుకున్నారు. ఈ ప్రకటనతో రాజమౌళి ‘వారణాసి’ తర్వాత ‘బాహుబలి 3’పై పని మొదలుపెట్టే అవకాశాలపై ఫ్యాన్స్‌ ఊహాగానాలు మళ్లీ జోరందుకున్నాయి.

26, జూన్ 2026

ఏపీలో పిడుగుల హెచ్చరిక..  : ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!
వ్యవసాయం

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. : ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!

ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

22, జూన్ 2026

ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI… కోహ్లీ ?
క్రికెట్

ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI… కోహ్లీ ?

ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టును BCCI ప్రకటించింది. హామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుంటున్న విరాట్ కోహ్లీ ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉండగా, 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత తొలి సారి జస్ప్రీత్ బుమ్రా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌లో శతకం చేసిన యశస్వి జైస్వాల్‌కు ఈసారి జట్టులో చోటు దక్కలేదు.

21, జూన్ 2026

హెయిర్ ఫాల్ నుంచి హెయిర్ గ్రోత్ వరకు క్యారెట్ ఆయిల్ ప్రయోజనాలు
ఫ్యాక్ట్ చెక్

హెయిర్ ఫాల్ నుంచి హెయిర్ గ్రోత్ వరకు క్యారెట్ ఆయిల్ ప్రయోజనాలు

క్యారెట్ ఆయిల్‌లో ఉండే విటమిన్ A, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు తల చర్మానికి పోషణ అందించి జుట్టు పెరుగుదల మెరుగుపడేలా, జుట్టు బలంగా, మెరిసేలా ఉండేలా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా క్యారెట్ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం, బ్రేకేజ్, స్ప్లిట్ ఎండ్స్, డ్రై స్కాల్ప్, చుండ్రు వంటి సమస్యలు కొంతవరకు తగ్గవచ్చని, అయితే ప్రతి ఒక్కరి తల చర్మం స్వభావాన్ని బట్టి ఫలితాలు మారవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

18, జూన్ 2026

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్
జాతీయం

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ రథిన్ బసు తీసుకున్న నిర్ణయంపై తాత్కాలిక నిలుపుదల చేయాలని అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

18, జూన్ 2026

హైదరాబాద్ ముస్లిం పెళ్లిళ్ల రుచితో స్పెషల్ చికెన్ ఖోర్మా
ఆహా

హైదరాబాద్ ముస్లిం పెళ్లిళ్ల రుచితో స్పెషల్ చికెన్ ఖోర్మా

హైదరాబాద్ ముస్లిం పెళ్లిళ్లలో వడ్డించే స్పెషల్ చికెన్ ఖోర్మా, క్రీమీ గ్రేవీ, ఘాటు మసాలా, రిచ్ ఫ్లేవర్‌లతో ఇంట్లో రెస్టారెంట్ స్థాయి రుచిని ఇస్తుంది. పొట్లి మసాలా నీరు, పప్పుల పేస్ట్, వేయించిన ఉల్లిపాయలు, ఎక్కువ నూనెతో తయారయ్యే ఈ వంటకం జీరా రైస్, బగారా రైస్, రోటీ, నాన్, అన్నంతో బాగా సరిపోతుందని ఫుడ్ లవర్స్ సూచిస్తున్నారు.

17, జూన్ 2026

రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్ ఇంధన కొనుగోళ్లకు బ్రేక్
బిజినెస్

రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్ ఇంధన కొనుగోళ్లకు బ్రేక్

వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్‌గా పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం 90 రోజుల తాత్కాలిక నిషేధం విధించింది. రిటైల్, బల్క్ డీజిల్ ధరల మధ్య భారీ వ్యత్యాసం వల్ల కమర్షియల్ వినియోగదారులు రిటైల్ బంకులవైపు మళ్లడంతో మార్కెట్‌లో అసమతౌల్యం ఏర్పడే ప్రమాదం ఉందని భావించి, అధీకృత బల్క్ సరఫరాదారుల ద్వారా మాత్రమే కొనుగోళ్లు చేయాలని ఆదేశించింది.

12, జూన్ 2026

తిరుమలలో టాక్సీ డ్రైవర్ల దోపిడీపై భక్తుల ఆగ్రహం
జిల్లా వార్తలు

తిరుమలలో టాక్సీ డ్రైవర్ల దోపిడీపై భక్తుల ఆగ్రహం

తిరుమలలో కొందరు టాక్సీ డ్రైవర్లు స్వల్ప దూరాలకు కూడా అధిక ఛార్జీలు వసూలు చేస్తూ భక్తులను దోచుకుంటున్నారనే ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. రాత్రివేళల్లో రేట్లు మరింత పెరగడంతో పాటు, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాల భయం పెరుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌ సిబ్బంది కొరత మధ్య ప్రీపెయిడ్‌ టాక్సీ కేంద్రాలు, ఏకరీతి ఛార్జీల కోసం భక్తులు డిమాండ్‌ చేస్తున్నా, ఇంకా స్పష్టమైన చర్యలు కనిపించకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

10, జూన్ 2026

ప్రొద్దుటూరు పెట్రోల్‌ బంకులో కోట్ల రూపాయల అక్రమాలు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు పెట్రోల్‌ బంకులో కోట్ల రూపాయల అక్రమాలు

వైయస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్‌ బంకులో రూ.1.28 కోట్లకు పైగా నిధుల అక్రమ వినియోగం బయటపడింది. ఇప్పటివరకు రూ.56.90 లక్షలు మాత్రమే రికవరీ చేయగా, మిగతా రూ.71.53 లక్షలు బకాయిగా ఉన్నట్లు పురపాలక శాఖ నివేదికలో వెల్లడించారు. ఈ వ్యవహారంలో 15 మంది అధికారులు, సిబ్బంది పేర్లు ఉండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు, మొత్తం వసూళ్లు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters